అదేం ఖర్మమో కానీ.. ఏపీ అధికారులు మళ్లీ కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడడమే కాదు.. మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఈ సారి ఇద్దరు కీలక అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానాలు కూడా విధించింది. ఆ ఇద్దరూ కూడా విద్యాశాఖకు చెందిన వారే కావడం గమనార్హం. ఒక్కొక్కరికీ నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2000 చొప్పున హైకోర్టు జరిమానా విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన సర్వీసు రూల్స్పై గత ఏడాది హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిని అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది. అయితే.. ఈ తీర్పును అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించారు. మళ్లీ ఇదే విషయంపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది.
అయితే.. గత తీర్పును అమలు చేయలేదని వెల్లడించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు వెంటనే దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ బుడితి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణలు బాధ్యులని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో ఆ ఇద్దరిని బాధ్యులను చేస్తూ.. హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికీ నెల రోజుల పాటు జైలు శిక్ష, తలా రూ.2000 చొప్పున జరిమానా విధించింది.
వైసీపీ హయాంలో ఇప్పటికే చాలా మంది అధికారులు ఆఖరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి డీజీపీ వరకు, ఇతర అధికారులు కూడా అనేక సందర్భాల్లో హైకోర్టు మెట్లు ఎక్కారు. అంతేకాదు.. కోర్టులో చీవాట్లు కూడా తిన్నారు. ఇక, మరికొందరు అధికారులకు గతంలో జైలు శిక్ష కూడా పడింది. అయితే.. ధర్మాసనం కలుగ జేసుకుని.. తర్వాత వారికి ఊరట కల్పించింది.
This post was last modified on January 18, 2023 3:20 pm
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…