ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా ఖమ్మంలో నిర్వహించటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు గడిచిన కొద్దిరోజులుగా భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 70 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు వచ్చే వారు కూర్చోవటానికే 70 వేల కుర్చీలను వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఇంత భారీగా ఒక రాజకీయ సభను ఏర్పాటుచేసింది లేదంటున్నారు. ఈ భారీ సభకు ముగ్గురు ముఖ్యమంత్రుల్ని.. ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు.. పలువురు జాతీయ పార్టీ నేతల్ని ఆహ్వానించటం ద్వారా.. తనకున్న సత్తాను చాటాలన్నది కేసీఆర్ ప్రయత్నంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సభకు జనాల్ని తరలించేందుకు ఏపీ నుంచి బస్సుల్ని బుక్ చేసినట్లుగా చెబుతున్నారు.
తమ ప్రత్యర్థి పార్టీలు నిర్వహించే రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సుల్ని కేటాయించే విషయంలో ప్రభుత్వాలు ఎంత కటువుగా ఉంటాయో తెలిసిందే. అందుకు భిన్నంగా.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సభకు ఏపీకి చెందిన బస్సుల్ని కేటాయించటం ద్వారా.. కేసీఆర్ మీద తనకున్న అభిమానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాటుకున్నారన్న ప్రచారం సాగుతోంది.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రిగా వ్యవహరించిన జవహర్ ఈ వ్యవహారంపై స్పందించారు. బీఆర్ఎస్ సభకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున బస్సులు పంపుతున్నారని.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభకు ఏపీ బస్సులు కేటాయించటం దేనికి నిదర్శనం? అంటూ ప్రశ్నిస్తున్నారు.
జగన్ కు కేసీఆర్ కు మధ్యనున్న ఇచ్చిపుచ్చుకునే వైనం కొత్తేం కాదని ఆయన మండిపడ్డారు. 2019 లో జరిగిన ఎన్నికల వేళలో తనకు కేసీఆర్ అందించిన సహకారానికి నిదర్శనంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రిటర్న్ గిప్టు రూపంలో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. ఖమ్మం సభతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…