Political News

బీఆర్ఎస్ సభ: కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న జగన్

ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా ఖమ్మంలో నిర్వహించటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు గడిచిన కొద్దిరోజులుగా భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 70 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు వచ్చే వారు కూర్చోవటానికే 70 వేల కుర్చీలను వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఇంత భారీగా ఒక రాజకీయ సభను ఏర్పాటుచేసింది లేదంటున్నారు. ఈ భారీ సభకు ముగ్గురు ముఖ్యమంత్రుల్ని.. ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు.. పలువురు జాతీయ పార్టీ నేతల్ని ఆహ్వానించటం ద్వారా.. తనకున్న సత్తాను చాటాలన్నది కేసీఆర్ ప్రయత్నంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సభకు జనాల్ని తరలించేందుకు ఏపీ నుంచి బస్సుల్ని బుక్ చేసినట్లుగా చెబుతున్నారు.

తమ ప్రత్యర్థి పార్టీలు నిర్వహించే రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సుల్ని కేటాయించే విషయంలో ప్రభుత్వాలు ఎంత కటువుగా ఉంటాయో తెలిసిందే. అందుకు భిన్నంగా.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సభకు ఏపీకి చెందిన బస్సుల్ని కేటాయించటం ద్వారా.. కేసీఆర్ మీద తనకున్న అభిమానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాటుకున్నారన్న ప్రచారం సాగుతోంది.

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రిగా వ్యవహరించిన జవహర్ ఈ వ్యవహారంపై స్పందించారు. బీఆర్ఎస్ సభకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున బస్సులు పంపుతున్నారని.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభకు ఏపీ బస్సులు కేటాయించటం దేనికి నిదర్శనం? అంటూ ప్రశ్నిస్తున్నారు.

జగన్ కు కేసీఆర్ కు మధ్యనున్న ఇచ్చిపుచ్చుకునే వైనం కొత్తేం కాదని ఆయన మండిపడ్డారు. 2019 లో జరిగిన ఎన్నికల వేళలో తనకు కేసీఆర్ అందించిన సహకారానికి నిదర్శనంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రిటర్న్ గిప్టు రూపంలో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. ఖమ్మం సభతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Satya

Recent Posts

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 minutes ago

సేనానికి అభిమానం అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

19 minutes ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

23 minutes ago

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

2 hours ago

తెలుగోళ్లు గిచ్చితే కానీ… తమిళ సినిమా మారలేదు

ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…

2 hours ago

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

4 hours ago