Political News

బీఆర్ఎస్ సభ: కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న జగన్

ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా ఖమ్మంలో నిర్వహించటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు గడిచిన కొద్దిరోజులుగా భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 70 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు వచ్చే వారు కూర్చోవటానికే 70 వేల కుర్చీలను వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఇంత భారీగా ఒక రాజకీయ సభను ఏర్పాటుచేసింది లేదంటున్నారు. ఈ భారీ సభకు ముగ్గురు ముఖ్యమంత్రుల్ని.. ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు.. పలువురు జాతీయ పార్టీ నేతల్ని ఆహ్వానించటం ద్వారా.. తనకున్న సత్తాను చాటాలన్నది కేసీఆర్ ప్రయత్నంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సభకు జనాల్ని తరలించేందుకు ఏపీ నుంచి బస్సుల్ని బుక్ చేసినట్లుగా చెబుతున్నారు.

తమ ప్రత్యర్థి పార్టీలు నిర్వహించే రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సుల్ని కేటాయించే విషయంలో ప్రభుత్వాలు ఎంత కటువుగా ఉంటాయో తెలిసిందే. అందుకు భిన్నంగా.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సభకు ఏపీకి చెందిన బస్సుల్ని కేటాయించటం ద్వారా.. కేసీఆర్ మీద తనకున్న అభిమానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాటుకున్నారన్న ప్రచారం సాగుతోంది.

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రిగా వ్యవహరించిన జవహర్ ఈ వ్యవహారంపై స్పందించారు. బీఆర్ఎస్ సభకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున బస్సులు పంపుతున్నారని.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చటానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభకు ఏపీ బస్సులు కేటాయించటం దేనికి నిదర్శనం? అంటూ ప్రశ్నిస్తున్నారు.

జగన్ కు కేసీఆర్ కు మధ్యనున్న ఇచ్చిపుచ్చుకునే వైనం కొత్తేం కాదని ఆయన మండిపడ్డారు. 2019 లో జరిగిన ఎన్నికల వేళలో తనకు కేసీఆర్ అందించిన సహకారానికి నిదర్శనంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రిటర్న్ గిప్టు రూపంలో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. ఖమ్మం సభతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

52 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

1 hour ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

1 hour ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

2 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago