Political News

తెలంగాణ : ఆ సీనియర్ లీడర్ మళ్లీ టీడీపీలోకి !

నేషనల్ పాలిటిక్స్‌పై నజర్ పెట్టిన బీఆర్ఎస్‌కు సొంత రాష్ట్రం తెలంగాణలోని జిల్లాజిల్లాలో తలనొప్పులు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోనూ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయి.

ప్రధానంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు గొంతు విప్పుతూ తన ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచారు. ఆ విమర్శలు కేవలం తన స్థానిక ప్రత్యర్థులకే కాకుండా పార్టీలో పెద్దలను కూడా తాకేలా సూటిగా ఉండడం చర్చనీయమవుతోంది.

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి అక్కడ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎవరికీ తలవంచి పాదాభివందనం చేయలేదని అన్నారు. తప్పు చేయను, తల వంచను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయమవుతున్నాయి. ఆర్జించడం కాదు, ఆత్మగౌరవంతో బతకండి అంటూ ఆయన అన్న మాటలు పార్టీలో వేడినిపెంచుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవితను, పార్టీ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ మాటలు అన్నారంటూ ఆయన వ్యతిరేకులు చెప్తున్నారు.

కేసీఆర్ రీసెంటుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించారు. ఆ సమయంలో మాలోత్ కవిత.. కేసీఆర్ కాళ్లకు మొక్కారు. దీనిపై బీజేపీ నేతలు అప్పుడే విపరీతంగా ట్రోల్ చేశారు. ఒక గిరిజన మహిళతో కాళ్లు మొక్కించుకున్నారంటూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తాజాగా కడియం శ్రీహరి కూడా అన్యాపదేశంగా ఈ విషయమే ప్రస్తావించారు. ఆయన కవితతో పాటు కేసీఆర్‌నూ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీలో ఉండలేక కడియం బీఆర్ఎస్‌లో చేరారు. కొంతకాలం కేసీఆర్ మంత్రివర్గంలోనూ ఉన్నా ఆ తరువాత ఆయన స్థానం పోయింది. ఇప్పుడు టికెట్ కూడా ఆయనకు ఇవ్వరన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్‌పై కోపంగా ఉన్నారని… అదేసమయంలో టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివేట్ అవుతుండడంతో అటువైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ముఖ్యులు కొందరు ఆయనతో టచ్‌లోకి వెళ్లారని.. పాత వరంగల్ జిల్లాలో టీడీపీకి పునర్వైభవం తేవాలని, అందుకు తమతో కలిసిరావాలని కడియంను టీడీపీ కీలక నేత ఒకరు సంప్రదించినట్లు వినిపిస్తోంది.

ఎలాగూ టికెట్ ఇవ్వాలనుకోవడం లేదు కాబట్టి కడియం బయటకు వెళ్లినా ఇబ్బందేం లేదంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నా… కడియం వంటి సీనియర్లు బయటకు వెళ్లడం అలాంటి మరికొందరికి దారి చూపినట్లు అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

This post was last modified on January 16, 2023 6:00 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

1 hour ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago