Political News

తెలంగాణ : ఆ సీనియర్ లీడర్ మళ్లీ టీడీపీలోకి !

నేషనల్ పాలిటిక్స్‌పై నజర్ పెట్టిన బీఆర్ఎస్‌కు సొంత రాష్ట్రం తెలంగాణలోని జిల్లాజిల్లాలో తలనొప్పులు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోనూ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయి.

ప్రధానంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు గొంతు విప్పుతూ తన ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచారు. ఆ విమర్శలు కేవలం తన స్థానిక ప్రత్యర్థులకే కాకుండా పార్టీలో పెద్దలను కూడా తాకేలా సూటిగా ఉండడం చర్చనీయమవుతోంది.

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి అక్కడ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎవరికీ తలవంచి పాదాభివందనం చేయలేదని అన్నారు. తప్పు చేయను, తల వంచను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయమవుతున్నాయి. ఆర్జించడం కాదు, ఆత్మగౌరవంతో బతకండి అంటూ ఆయన అన్న మాటలు పార్టీలో వేడినిపెంచుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవితను, పార్టీ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ మాటలు అన్నారంటూ ఆయన వ్యతిరేకులు చెప్తున్నారు.

కేసీఆర్ రీసెంటుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించారు. ఆ సమయంలో మాలోత్ కవిత.. కేసీఆర్ కాళ్లకు మొక్కారు. దీనిపై బీజేపీ నేతలు అప్పుడే విపరీతంగా ట్రోల్ చేశారు. ఒక గిరిజన మహిళతో కాళ్లు మొక్కించుకున్నారంటూ కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తాజాగా కడియం శ్రీహరి కూడా అన్యాపదేశంగా ఈ విషయమే ప్రస్తావించారు. ఆయన కవితతో పాటు కేసీఆర్‌నూ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీలో ఉండలేక కడియం బీఆర్ఎస్‌లో చేరారు. కొంతకాలం కేసీఆర్ మంత్రివర్గంలోనూ ఉన్నా ఆ తరువాత ఆయన స్థానం పోయింది. ఇప్పుడు టికెట్ కూడా ఆయనకు ఇవ్వరన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్‌పై కోపంగా ఉన్నారని… అదేసమయంలో టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివేట్ అవుతుండడంతో అటువైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ముఖ్యులు కొందరు ఆయనతో టచ్‌లోకి వెళ్లారని.. పాత వరంగల్ జిల్లాలో టీడీపీకి పునర్వైభవం తేవాలని, అందుకు తమతో కలిసిరావాలని కడియంను టీడీపీ కీలక నేత ఒకరు సంప్రదించినట్లు వినిపిస్తోంది.

ఎలాగూ టికెట్ ఇవ్వాలనుకోవడం లేదు కాబట్టి కడియం బయటకు వెళ్లినా ఇబ్బందేం లేదంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నా… కడియం వంటి సీనియర్లు బయటకు వెళ్లడం అలాంటి మరికొందరికి దారి చూపినట్లు అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

This post was last modified on January 16, 2023 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

1 hour ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

1 hour ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

2 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

2 hours ago

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల…

2 hours ago

అఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బ

న‌ట‌సింహం బాల‌య్య హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ్‌-2 సినిమాల‌కు బాలారిష్టాలు తీర‌డం లేదు. ఈ నెల తొలి…

2 hours ago