నేషనల్ పాలిటిక్స్పై నజర్ పెట్టిన బీఆర్ఎస్కు సొంత రాష్ట్రం తెలంగాణలోని జిల్లాజిల్లాలో తలనొప్పులు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే ఖమ్మంలో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్న తరుణంలో ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోనూ బీఆర్ఎస్ కోటకు బీటలు వారుతున్నాయి.
ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు గొంతు విప్పుతూ తన ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచారు. ఆ విమర్శలు కేవలం తన స్థానిక ప్రత్యర్థులకే కాకుండా పార్టీలో పెద్దలను కూడా తాకేలా సూటిగా ఉండడం చర్చనీయమవుతోంది.
స్టేషన్ ఘన్పూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి అక్కడ మాట్లాడుతూ.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎవరికీ తలవంచి పాదాభివందనం చేయలేదని అన్నారు. తప్పు చేయను, తల వంచను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయమవుతున్నాయి. ఆర్జించడం కాదు, ఆత్మగౌరవంతో బతకండి అంటూ ఆయన అన్న మాటలు పార్టీలో వేడినిపెంచుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవితను, పార్టీ అధినేత కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ మాటలు అన్నారంటూ ఆయన వ్యతిరేకులు చెప్తున్నారు.
కేసీఆర్ రీసెంటుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం మానుకోటలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభించారు. ఆ సమయంలో మాలోత్ కవిత.. కేసీఆర్ కాళ్లకు మొక్కారు. దీనిపై బీజేపీ నేతలు అప్పుడే విపరీతంగా ట్రోల్ చేశారు. ఒక గిరిజన మహిళతో కాళ్లు మొక్కించుకున్నారంటూ కేసీఆర్పై విమర్శలు చేశారు. తాజాగా కడియం శ్రీహరి కూడా అన్యాపదేశంగా ఈ విషయమే ప్రస్తావించారు. ఆయన కవితతో పాటు కేసీఆర్నూ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీలో ఉండలేక కడియం బీఆర్ఎస్లో చేరారు. కొంతకాలం కేసీఆర్ మంత్రివర్గంలోనూ ఉన్నా ఆ తరువాత ఆయన స్థానం పోయింది. ఇప్పుడు టికెట్ కూడా ఆయనకు ఇవ్వరన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్పై కోపంగా ఉన్నారని… అదేసమయంలో టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివేట్ అవుతుండడంతో అటువైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ముఖ్యులు కొందరు ఆయనతో టచ్లోకి వెళ్లారని.. పాత వరంగల్ జిల్లాలో టీడీపీకి పునర్వైభవం తేవాలని, అందుకు తమతో కలిసిరావాలని కడియంను టీడీపీ కీలక నేత ఒకరు సంప్రదించినట్లు వినిపిస్తోంది.
ఎలాగూ టికెట్ ఇవ్వాలనుకోవడం లేదు కాబట్టి కడియం బయటకు వెళ్లినా ఇబ్బందేం లేదంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నా… కడియం వంటి సీనియర్లు బయటకు వెళ్లడం అలాంటి మరికొందరికి దారి చూపినట్లు అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
This post was last modified on January 16, 2023 6:00 pm
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…
కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…
మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…