అదేం చిత్రమో కానీ.. కొన్నాళ్ల కిందట.. ఏపీ వేరు మేం వేరు.. అక్కడ ప్రజలు ఏమైతే మాకెందుకు.. అని.. వ్యాఖ్యానించిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తాజాగా టంగ్ మార్చారు. ఒక రాష్ట్రంగా ఉన్న ప్రాంతాలు రెండు రాష్ట్రాలు అయ్యాయి.. అంతే! రెండు రాష్ట్రాల ప్రజల మనసులు కలిసే ఉన్నాయి.. అంటూ.. తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో గత విషయాలు గుర్తున్నవారు.. హనన్నా.. శ్రీనన్నా.. అంటూ ముక్కున వేలేసుకున్నారు.
ఏపీ విషయంలో ఆది నుంచి కూడా తెలంగాణ నాయకులు దూకుడుగానే ఉన్నారు. సాగర్ నుంచి బలవం తంగా విద్యుత్ ఉత్పత్తి చేసినా.. కరోనా సమయంలో ఏపీ అంబులెన్సులను అడ్డుకున్నా.. సమర్ధించుకు న్న తెలంగాణ మంత్రులు.. తాజాగా ఏపీ విషయంలో మాట మార్చేశారు. తాజాగా విజయవాడలో జరిగిన ఉద్యోగుల కార్యక్రమంలోపాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆశ్చర్యకరంగా మాట్లాడారు.
“ఉమ్మడి రాష్ట్రంలో కలిసే పని చేశాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. భౌగోళికంగా విడిపోయినా, ఇప్పటికీ మా మనసులు కలిసే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. రెండురాష్ట్రాల ప్రజల మనసులు ఒకటేనని వ్యాఖ్యానించారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకునే విధానాలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు.
కానీ, గతంలో ఇదే మంత్రి మాత్రం ఫైర్ అయ్యారు. అయితే.. ఇప్పుడు ఇంత మార్పునకు కూడా బీఆర్ ఎస్ కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో బీఆర్ ఎస్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో మంత్రి పర్యటన.. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి మున్ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాలో అంటున్నారు ఏపీ రాజకీయ పరిశీలకులు.
This post was last modified on January 16, 2023 9:09 am
ఒకరిని పొగడ్డానికి ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం లేదు. అలాగే ఒకరిని విమర్శించే క్రమంలో కూడా అవసరం లేని ఇంకొకరి పేరు…
కొన్ని సినిమాలు రిలీజ్ టైంలో సరిగా ఆడవు. కానీ తర్వాతి కాలంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. ఇలాంటి పేరు చాలా…
చెన్నై లవ్ స్టోరీ ఏ స్థాయిలో విజయం సాధిస్తుందనేది తేలడానికి కొంచెం టైం పడుతుంది కానీ వీకెండ్ దాకా ఢోకా…
తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం…
ఒక హీరోతో చేయాల్సిన కథ ఇంకో హీరో చేతికి వెళ్లిపోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఐతే పెద్ద ఫ్యామిలీకి చెందిన…
మనం ఎంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ జనం నిత్యం మాట్లాడుకునేలా,…