టీడీపీ అధినేత చంద్రబాబు భోగి పండుగ సందర్భంగా నారావారి పల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. సంచ లన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 150-160 కాదు.. 175 నియోజకవర్గాల్లో 175 చోట్లా విజయం దక్కించు కోవాలి.. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి.. అని అన్నారు. నిజానికి ఇన్నేళ్లలో అంటే.. 2014 నుంచి 2023 వరకు కూడా చంద్రబాబు నోటి నుంచి ఈ మాట రాలేదనే చెప్పాలి.
కనీసం.. వైసీపీ అధినేత జగన్ చేసిన వైనాట్ 175
ప్రకటన తర్వాత కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రకటన చేయలేదు. జగన్ వైనాట్ 175 ప్రకటించి.. దాదాపు ఆరు మాసాలు అయిపోయింది. ఆయన ఎక్కడ ఎప్పుడు పార్టీ నేతలతో భేటీ అవుతున్నా.. వెంటనే ఈ మాటను చెబుతున్నారు. కానీ, అప్పట్లో మౌనంగా ఉన్న చంద్రబాబు.. బీజేపీ, జనసేనతో పొత్తు కోసం.. ప్రయత్నించారే తప్ప.. పూర్తిస్థాయిలో పోటీకి కానీ.. గెలుపు కోసం ఒక్క చిన్న ప్రకటన చేయలేదు.
కానీ, ఇంతలోనే ఆయన నోటి నుంచి ఆణిముత్యం వంటి మాట దొర్లింది. సరే.. మాట అయితే.. అనేశారు. మరి.. 175/175 సీట్లలో విజయం దక్కించుకునేందుకు టీడీపీకి ఉన్న సానుకూలతలు ఏంటి? ఎలా? అనేది ఆసక్తిగా మారింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జోష్ పెరిగినప్పుడు కూడా.. ఆయన పాదయాత్ర, బస్సు యాత్ర చేసిన సమయంలోనూ 120 ఫిగర్ చేరుకోలేక పోయారు. మరిఇప్పుడు వైసీపీ ప్రభంజనం.. సంక్షేమం ఉందని.. వైసీపీ నేతలు చెబుతున్న సమయంలో చంద్రబాబు ప్రకటన ఆసక్తి రేపుతోంది.
అంతేకాదు.. ఈ ప్రకటనతో ఆయన పొత్తులకు బ్రేక్ ఇచ్చినట్టేనా.. అనే మరో చర్చ కూడా సాగుతోంది. ఇంకో వైపు.. అసలు 175 నియోజకవర్గాల్లో 20 నుంచి 30 స్థానాల్లో అసలు ఇంచార్జ్లే లేరనే టాక్ వినిపిస్తోం ది. ఉన్న చోట కూడా.. ఎవరిలో వారు గిల్లి కజ్జాలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సమయంలో అత్యంత కీలకమైన ఎన్నికలని చంద్రబాబే చెబుతున్న వేళ.. 175 టార్గెట్ సాధ్యమేనా.. లేక నోటి మాటగా ఆయన చెప్పి వదిలేశారా? అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఆయన ఏం చేస్తారో.
This post was last modified on January 16, 2023 9:04 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…