ఏపీలో సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో పందేలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వాస్తవానికిఇ క్కడ పోలీసులు కోడి పందేలపై నెలరోజులుగా నిఘా పెట్టారు. పందేలు వేయడానికి వీల్లేదని చెప్పారు. చాలా చర్యలు కూడా తీసుకున్నారు. అయితే.. పోలీసులను మచ్చిక చేసుకున్న నేతలు.. పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి పందేలకు రెడీ అయ్యారు.
అయినప్పటికీ.. ఉమ్మడి తూర్పుగోదావరిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. తాజాగా ఒక చోట జరిగిన ఘటనలో ఏకంగా పోలీసు అధికారిపైనే వైసీపీ ఎమ్మెల్యే జులుం ప్రదర్శించడం.. చర్చకు దారితీసింది. కోడి పందాలు వద్దు అన్నందుకు పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే దాడి కి యత్నించారు. అంతేకాదు.. ఎన్ని కేసులు అయిన పోట్టుకో పో అంటూ ఫైరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా(ప్రస్తుతం కోనసీమ)లోని రావుల పాలెంలో వైసీపీ నేత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కోడి పందేలకు బరులు రెడీ చేశారు.
అయితే.. రావులపాలెం పోలీసులు బరులను నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలోనే రావులపాలెం శివారు ప్రాంతంలో వేసిన బరిలోనూ చర్యలు తీసుకునేందుకు వచ్చారు. ఎస్సై సురేంద్ర వచ్చీరావడంతో అక్కడే ఉన్న కొత్తపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మీకేం పనంటూ మండిపడ్డారు. అంతేకాదు.. బరులు వేసింది ప్రయివేటు స్థలమని, సంక్రాంతి రోజు కూడా ప్రజలను బతకనివ్వరా? అని వ్యాఖ్యానించారు. ఒకవేళ కేసులుంటే తనపై పెట్టాలంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎస్సై భుజంపై చేయి వేసి.. అక్కడ నుంచి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
This post was last modified on January 15, 2023 10:52 am
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…