Political News

అమ‌రావ‌తి సెంటిమెంటు ఏమైన‌ట్టు…

రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క‌మైన సెంటిమెంటుగా ఉన్న రాజ‌ధాని అమ‌రావతి విష‌యం ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ స‌హా.. జ‌న‌సేన‌లో ఈ విష‌యం ఆస‌క్తిగా ఉంది. రాజ‌ధాని అమ‌రావ‌తికే త‌మ మ‌ద్ద‌తు అని టీడీపీ బాహాటంగానే ప్ర‌చారం చేసింది. అయితే.. త‌ర్వాత చంద్ర‌బాబు జిల్లాల ప‌ర్య‌ట‌న చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డి ప్ర‌జ‌ల నాడిని తెలుసుకున్నారు.

పైకి మౌనంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఉత్త‌రాంధ్ర‌, సీమ ప్రాంతాల్లో వ‌రుసగా చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తెప్పించుకున్న స‌ర్వేల నివేదిక‌ల ఆధారంగా ఏమైందో ఏమో.. అమ‌రావ‌తి గురించిన ప్ర‌స్తావ‌న‌ను త‌గ్గించేసి.. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పైనే దృష్టి పెట్టారు. సీఎం జ‌గ‌న్‌ను కార్న‌ర్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఇప్పుడు చిత్రంగా అదే అమ‌రావ‌తి ఇష్యూపై వైసీపీలో చ‌ర్చ‌సాగుతోంది.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం హైకోర్టు అమ‌రావ‌తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆరుమాసాల్లో ఇక్క‌డ అభివృద్ది చేయాల‌ని తేల్చి చెప్పింది. దీనిని సుప్రీంకోర్టులో స‌వాల్ చేసినా.. స‌మ‌యాన్ని త‌ప్పు బ‌ట్టిందే త‌ప్ప‌.. రాజ‌ధానిని త‌ప్పు బ‌ట్ట‌లేదు. పైగా.. అమ‌రావ‌తికి అనుకూలంగా ఉన్న‌ట్టుగా సంకేతాలు పంపించింది. రైతుల సెంటిమెంటును తీవ్రంగా భావించింది. ఈ నెల‌లో మ‌రోసారి సుప్రీంకోర్టు ఈ విష‌యాన్ని విచారించ‌నుంది.

ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు అమ‌రావ‌తికి అనుకూలంగా ఏదైనా తీర్పు ఇస్తే ఏం చేయాల‌నేది వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీస్తోంది. రాజ‌కీయ ప‌క్షాలు ఏమ‌నుకుంటున్నాయ‌ని ఆరాతీస్తే.. దాదాపు అవి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, రాజ‌ధాని రైతులుకూడా సుప్రీం కోర్టు తీర్పు కోసం..చూస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌భుత్వ ప‌రంగా ఏం చేయాలి..? ఎన్నిక‌ల‌కు ముందు అమ‌రావ‌తి అజెండాను అందుకుంటే.. న‌ష్ట‌మ‌ని.. కాబ‌ట్టి దీనికి విరుగుడుగా ఎలా ముందుకుసాగాల‌నేది ఆస‌క్తిగా మారింద‌ని అంటున్నారు.

This post was last modified on January 15, 2023 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దీపిక ప్ర‌క‌ట‌న‌… మ‌రి రాకా ప‌రిస్థితేంటి?

రాకా.. ప్ర‌స్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒక‌టి. పుష్ప‌-2 లాంటి సెన్సేష‌నల్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్…

15 minutes ago

డార్లింగ్ క్రేజ్ ఇంకా తగ్గలేదే

పదహారు సంవత్సరాల క్రితం 2010లో విడుదలైన డార్లింగ్ అంటే ప్రభాస్ అభిమానులకు ఒక స్పెషల్ ఎమోషన్. మాస్ ఫార్ములాకు దూరంగా…

47 minutes ago

OTT రూటు… ఇది కరెక్టు పాయింటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…

2 hours ago

బడ్జెట్ 10 కోట్లు… వసూళ్లు 200 కోట్లు

మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద…

2 hours ago

నవ్వుల నాగ‌బాబు… జ‌బ‌ర్ద‌స్త్‌ను లేప‌గ‌ల‌డా?

తెలుగు టీవీ చ‌రిత్ర‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన షోగా జ‌బ‌ర్ద‌స్త్‌ను చెప్పొచ్చు. అందులో డ‌బుల్ మీనింగ్‌లు, బాడీ షేమింగ్‌ల గురించి అభ్యంత‌రాలు…

3 hours ago

ప్రొడ్యూసర్ కిరణ్ సక్సెస్ అయినట్టేనా

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం…

5 hours ago