Political News

ఏపీలో క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌లు చూస్తే వ‌ణుకే

తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలకు సంబంధించిన గ‌ణాంకాలు చూస్తుంటే వామ్మో అనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజులుగా న‌మోద‌వుతున్న కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భ‌యం గొలిపేలా ఉంది. అంద‌రూ కేసుల సంఖ్య‌నే చూస్తున్నారు కానీ.. మ‌ర‌ణాల మీద దృష్టిసారించ‌ట్లేదు. ప్ర‌భుత్వం కూడా బులిటెన్లో జిల్లాల వారీగా, ఓవ‌రాల్‌గా కేసుల సంఖ్య‌ను చెబుతోంది. అలాగే ఇప్ప‌టిదాకా న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్యా ఇస్తోంది. కానీ రోజు వారీ మ‌ర‌ణాల టోట‌ల్ నంబ‌ర్ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌ట్లేదు. ఒక్కో జిల్లాలో ఇంత‌మంది అని చెబుతోంది. కానీ అన్ని జిల్లాల మ‌ర‌ణాల్ని క‌లిపి చివ‌ర‌గా వ‌చ్చే నంబ‌ర్ చూస్తే ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్పిన సంగ‌తి అర్థ‌మ‌వుతుంది.

కేవ‌లం ఎనిమిది రోజుల వ్య‌వ‌ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 368 మంది కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. ఆదివారం ఏకంగా 56 మంది క‌రోనా పేషెంట్లు ప్రాణాలు వ‌దిలారు. సోమ‌వారం కూడా దాదాపుగా అదే స్థాయిలో 52 మంది క‌రోనాతో మృతి చెందారు. ప్ర‌తి జిల్లాలోనూ క‌రోనా మ‌ర‌ణాలున్నాయి. గోదావ‌రి జిల్లాలు రెండింట్లో క‌లిపితే రోజూ రెండంకెల సంఖ్య‌లో మ‌ర‌ణాలుంటున్నాయి. రాష్ట్రంలో రోజుకు ఇద్ద‌రు ముగ్గురు చ‌నిపోతున్న‌పుడు అమ్మో అనుకున్న జ‌నాలు కూడా.. ఇప్పుడు రోజుకు 50 మంది చనిపోతుంటే మామూలుగా చూస్తుండ‌టం.. ప్ర‌భుత్వం తీవ్ర‌త‌ను గుర్తించక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ఏపీలో సోమ‌వారం 4 వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు వెలుగు చూడ‌గా.. మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటిపోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 696కు చేరుకుంది.

This post was last modified on July 20, 2020 8:58 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

52 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago