తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన గణాంకాలు చూస్తుంటే వామ్మో అనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య భయం గొలిపేలా ఉంది. అందరూ కేసుల సంఖ్యనే చూస్తున్నారు కానీ.. మరణాల మీద దృష్టిసారించట్లేదు. ప్రభుత్వం కూడా బులిటెన్లో జిల్లాల వారీగా, ఓవరాల్గా కేసుల సంఖ్యను చెబుతోంది. అలాగే ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాల సంఖ్యా ఇస్తోంది. కానీ రోజు వారీ మరణాల టోటల్ నంబర్ ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఒక్కో జిల్లాలో ఇంతమంది అని చెబుతోంది. కానీ అన్ని జిల్లాల మరణాల్ని కలిపి చివరగా వచ్చే నంబర్ చూస్తే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన సంగతి అర్థమవుతుంది.
కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో 368 మంది కోవిడ్ వల్ల మరణించడం గమనార్హం. ఆదివారం ఏకంగా 56 మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు వదిలారు. సోమవారం కూడా దాదాపుగా అదే స్థాయిలో 52 మంది కరోనాతో మృతి చెందారు. ప్రతి జిల్లాలోనూ కరోనా మరణాలున్నాయి. గోదావరి జిల్లాలు రెండింట్లో కలిపితే రోజూ రెండంకెల సంఖ్యలో మరణాలుంటున్నాయి. రాష్ట్రంలో రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నపుడు అమ్మో అనుకున్న జనాలు కూడా.. ఇప్పుడు రోజుకు 50 మంది చనిపోతుంటే మామూలుగా చూస్తుండటం.. ప్రభుత్వం తీవ్రతను గుర్తించకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఏపీలో సోమవారం 4 వేలకు పైగా కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా.. మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటిపోవడం గమనార్హం. మొత్తం మరణాల సంఖ్య 696కు చేరుకుంది.
This post was last modified on July 20, 2020 8:58 pm
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…