తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన గణాంకాలు చూస్తుంటే వామ్మో అనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య భయం గొలిపేలా ఉంది. అందరూ కేసుల సంఖ్యనే చూస్తున్నారు కానీ.. మరణాల మీద దృష్టిసారించట్లేదు. ప్రభుత్వం కూడా బులిటెన్లో జిల్లాల వారీగా, ఓవరాల్గా కేసుల సంఖ్యను చెబుతోంది. అలాగే ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాల సంఖ్యా ఇస్తోంది. కానీ రోజు వారీ మరణాల టోటల్ నంబర్ ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఒక్కో జిల్లాలో ఇంతమంది అని చెబుతోంది. కానీ అన్ని జిల్లాల మరణాల్ని కలిపి చివరగా వచ్చే నంబర్ చూస్తే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన సంగతి అర్థమవుతుంది.
కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో 368 మంది కోవిడ్ వల్ల మరణించడం గమనార్హం. ఆదివారం ఏకంగా 56 మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు వదిలారు. సోమవారం కూడా దాదాపుగా అదే స్థాయిలో 52 మంది కరోనాతో మృతి చెందారు. ప్రతి జిల్లాలోనూ కరోనా మరణాలున్నాయి. గోదావరి జిల్లాలు రెండింట్లో కలిపితే రోజూ రెండంకెల సంఖ్యలో మరణాలుంటున్నాయి. రాష్ట్రంలో రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నపుడు అమ్మో అనుకున్న జనాలు కూడా.. ఇప్పుడు రోజుకు 50 మంది చనిపోతుంటే మామూలుగా చూస్తుండటం.. ప్రభుత్వం తీవ్రతను గుర్తించకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఏపీలో సోమవారం 4 వేలకు పైగా కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా.. మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటిపోవడం గమనార్హం. మొత్తం మరణాల సంఖ్య 696కు చేరుకుంది.
This post was last modified on July 20, 2020 8:58 pm
హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్ కు తెచ్చేశాడు.…
హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్ల పర్వంలో చివరి ఘట్టం జరిగింది. విడుదలకు 4 రోజులు మాత్రమే ఉన్న…
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్గా ఉన్నవారే.. నేడు అసలు…
టాలీవుడ్ క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 1 తక్కువ బడ్జెట్ తో…
34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో…
ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బోలెడు సమయాన్ని ముంబైలో వృథా చేసుకుని వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాగానే వరసబెట్టి సినిమాలు…