ఏపీలోని వైసీపీ సర్కారుకు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. తాజాగా ఈ నెల మొదట్లో ప్రభు త్వం జీవో 1/2023 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లపై ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు చేసేందుకు ఈ జీవో అనుమతించదు. అదేసమయంలో రోడ్లపై షోలు, బహిరంగ సభలు పెట్టుకునేందుకు కూడా ఈ జీవో అనుమతించదు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
కేవలం టీడీపీ సహా ఇతర పక్షాలను అడ్డుకునే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందనే వాదన బలంగా వినిపించింది. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తనను తాను సమర్థించుకుంది. గుంటూ రు, కందుకూరు ఘటనల్లో ప్రజలు చనిపోయారని.. ప్రజల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం పూచీ వహించాల్సి ఉంటుందని.. అందుకనే ఈ జీవోను తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ జీవోను సవాల్ చేస్తూ.. రెండు రోజుల కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తాజాగా విచారించిన హైకోర్టు.. జీవో 1/2023ని సస్పెండ్ చేసింది. ఈనెల 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ నెల 20న తిరిగి విచారించనున్నట్టు పేర్కొంది. జీవో 1… నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే జీవోను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…