ఏపీలోని వైసీపీ సర్కారుకు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. తాజాగా ఈ నెల మొదట్లో ప్రభు త్వం జీవో 1/2023 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లపై ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు చేసేందుకు ఈ జీవో అనుమతించదు. అదేసమయంలో రోడ్లపై షోలు, బహిరంగ సభలు పెట్టుకునేందుకు కూడా ఈ జీవో అనుమతించదు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
కేవలం టీడీపీ సహా ఇతర పక్షాలను అడ్డుకునే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందనే వాదన బలంగా వినిపించింది. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తనను తాను సమర్థించుకుంది. గుంటూ రు, కందుకూరు ఘటనల్లో ప్రజలు చనిపోయారని.. ప్రజల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం పూచీ వహించాల్సి ఉంటుందని.. అందుకనే ఈ జీవోను తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ జీవోను సవాల్ చేస్తూ.. రెండు రోజుల కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తాజాగా విచారించిన హైకోర్టు.. జీవో 1/2023ని సస్పెండ్ చేసింది. ఈనెల 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ నెల 20న తిరిగి విచారించనున్నట్టు పేర్కొంది. జీవో 1… నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే జీవోను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
This post was last modified on January 13, 2023 1:26 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…