ఏపీలోని వైసీపీ సర్కారుకు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. తాజాగా ఈ నెల మొదట్లో ప్రభు త్వం జీవో 1/2023 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లపై ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు చేసేందుకు ఈ జీవో అనుమతించదు. అదేసమయంలో రోడ్లపై షోలు, బహిరంగ సభలు పెట్టుకునేందుకు కూడా ఈ జీవో అనుమతించదు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
కేవలం టీడీపీ సహా ఇతర పక్షాలను అడ్డుకునే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందనే వాదన బలంగా వినిపించింది. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తనను తాను సమర్థించుకుంది. గుంటూ రు, కందుకూరు ఘటనల్లో ప్రజలు చనిపోయారని.. ప్రజల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం పూచీ వహించాల్సి ఉంటుందని.. అందుకనే ఈ జీవోను తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ జీవోను సవాల్ చేస్తూ.. రెండు రోజుల కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తాజాగా విచారించిన హైకోర్టు.. జీవో 1/2023ని సస్పెండ్ చేసింది. ఈనెల 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ నెల 20న తిరిగి విచారించనున్నట్టు పేర్కొంది. జీవో 1… నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే జీవోను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
This post was last modified on January 13, 2023 1:26 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…