Political News

ఏపీ స‌ర్కారుకు ఝ‌ల‌క్‌..

ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు మ‌రోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ‌త‌గిలింది. తాజాగా ఈ నెల మొద‌ట్లో ప్ర‌భు త్వం జీవో 1/2023 తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్ల‌పై ర్యాలీలు, ధ‌ర్నాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసేందుకు ఈ జీవో అనుమ‌తించ‌దు. అదేస‌మ‌యంలో రోడ్ల‌పై షోలు, బ‌హిరంగ స‌భ‌లు పెట్టుకునేందుకు కూడా ఈ జీవో అనుమ‌తించ‌దు. ఈ ప‌రిణామాల‌పై ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కేవ‌లం టీడీపీ స‌హా ఇతర‌ ప‌క్షాల‌ను అడ్డుకునే క్ర‌మంలోనే వైసీపీ ప్ర‌భుత్వం ఈ జీవోను తీసుకువ‌చ్చింద‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం మాత్రం త‌న‌ను తాను స‌మ‌ర్థించుకుంది. గుంటూ రు, కందుకూరు ఘ‌ట‌న‌ల్లో ప్ర‌జ‌లు చ‌నిపోయార‌ని.. ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం పూచీ వ‌హించాల్సి ఉంటుంద‌ని.. అందుక‌నే ఈ జీవోను తీసుకువ‌చ్చామ‌ని ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఈ జీవోను స‌వాల్ చేస్తూ.. రెండు రోజుల కింద‌ట హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని తాజాగా విచారించిన హైకోర్టు.. జీవో 1/2023ని స‌స్పెండ్ చేసింది. ఈనెల 23 వ‌రకు ఈ ఉత్త‌ర్వులు అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొంది. ఈ నెల 20న తిరిగి విచారించ‌నున్న‌ట్టు పేర్కొంది. జీవో 1… నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలోనే జీవోను స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు తెలిపింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

This post was last modified on January 13, 2023 1:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

32 minutes ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

54 minutes ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

1 hour ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

2 hours ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

2 hours ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

5 hours ago