ఏపీలోని వైసీపీ సర్కారుకు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. తాజాగా ఈ నెల మొదట్లో ప్రభు త్వం జీవో 1/2023 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లపై ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు చేసేందుకు ఈ జీవో అనుమతించదు. అదేసమయంలో రోడ్లపై షోలు, బహిరంగ సభలు పెట్టుకునేందుకు కూడా ఈ జీవో అనుమతించదు. ఈ పరిణామాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
కేవలం టీడీపీ సహా ఇతర పక్షాలను అడ్డుకునే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందనే వాదన బలంగా వినిపించింది. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తనను తాను సమర్థించుకుంది. గుంటూ రు, కందుకూరు ఘటనల్లో ప్రజలు చనిపోయారని.. ప్రజల ప్రాణాల రక్షణకు ప్రభుత్వం పూచీ వహించాల్సి ఉంటుందని.. అందుకనే ఈ జీవోను తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ జీవోను సవాల్ చేస్తూ.. రెండు రోజుల కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తాజాగా విచారించిన హైకోర్టు.. జీవో 1/2023ని సస్పెండ్ చేసింది. ఈనెల 23 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ నెల 20న తిరిగి విచారించనున్నట్టు పేర్కొంది. జీవో 1… నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే జీవోను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…