మెగా స్టార్ చిరంజీవిపై ఇటీవల కాలంలో వైసీపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా.. విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగబాబుకు ఇస్తున్న కౌంటర్లలో రోజా.. ఎక్కువగా చిరును కోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి తాజాగా రోజాపై కామెంట్లు చేశారు. అయితే.. రోజాలాగా ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలు చేయలేదు. సూటిగా సున్నితంగా మనసును తట్టేలా కామెంట్లు చేశారు చిరంజీవి.
రోజా చేసిన పరుష వ్యాఖ్యలపై తాను మాట్లాడాలనుకోవడం లేదని చిరంజీవి వ్యాఖ్యానించారు. తాను చేస్తున్న సేవలకు సీసీటీ, బ్లడ్బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్.. వంటివి నిలువెత్తు నిదర్శనాలని ఆయన చెప్పారు. “ఆ సమయానికి ఆమె అలా అనాల్సి వచ్చిందేమో. ఆమె చేసిన వ్యాఖ్యల గురించి నేను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. నేను ఎలాంటి సేవలు చేశాను, చేస్తున్నాను అనేది అందరికీ తెలుసు” అని చిరు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడైనా, లేదా తర్వాతైనా.. ఎదుటి వారు తనపై ఎలాంటి విమర్శలు చేసినా వాటిపై స్పందించాలని అనుకోలేదని చిరంజీవి చెప్పారు. “రోజా మా ఇంటికి వచ్చారు. మాతో కలిసి భోజనం చేశారు. సొంతవారిలా కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ల నైజం ప్రకారం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించడం నా నైజం కాదు. వాళ్లు ఏం మాట్లాడినా అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా” అని చిరు చురకలు అంటించారు.
“రోజా కుంటుంబంతో అనుబంధాన్ని ఎప్పుడూ పదిలంగానే చూసుకుంటా. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. ప్రేమాభిమానాలకు విలువే లేదా? ఇంతేనా ఈ ప్రపంచం? ఎలాంటి లబ్ధి కోసం, ఎవరి కరుణ పొందాలని వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు?” అని వ్యాఖ్యానించారు.
This post was last modified on January 13, 2023 12:45 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…