Political News

‘సంబ‌రాల రాంబాబు గురించే బాబు నేను మాట్లాడుకున్నాం’

శ్రీకాకుళంలో నిర్వ‌హించిన యువ‌శ‌క్తి స‌భ‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దుమ్మురేపారు. వైసీపీ నేత‌ల‌పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాను హైద‌రాబాద్‌లో కలిసినప్పుడు వైసీపీ వెధవలు అందరూ ఏం మాట్లాడుకున్నారంటూ.. ప్ర‌శ్నించార‌ని.. ఈ వెధ‌వ‌ల‌కు తెలియ‌దు.. నేను చాలా విష‌యాలే చ‌ర్చించాన‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

“అరేయ్ వెధవల్లారా నేను అమ్ముడు పోయే వ్య‌క్తిని కాదురా.. 20 కోట్లు టాక్స్ కట్టే సత్తా ఉన్న వాడిని. ప్యాకేజీ కాదు.. మీ వోల్టేజీ తీసేసే వాడిని. వైజాగ్‌లో నా పార్టీ నేత‌ల‌పైనా.. కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రిగిన‌ సంఘటనకు చంద్ర‌బాబు నాకోసం నిల్చున్నాడు. ఆయనకి కుప్పంలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి సాలిడారిటీ చూపించడం నా బాధ్యత. అందుకే హైద‌రాబాద్‌లో స్వ‌యంగా నేనే ఆయ‌న ఇంటికి వెళ్లా” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

“రెండు గంటలు ఏం మాట్లాడుకున్నారు అని తెగవాగారు ఇప్పుడు చెప్తున్నా ఏం మాట్లాడుకున్నాం. కానీ, చాలా విష‌యాలు మాట్లాడుకున్నాం. సంబరాలు రాంబాబు గురించి 23 నిమిషాల రెండు సెకండ్లు మాట్లాడుకున్నాం. 18 నిమిషాలపాటు మన రాష్ట్రాన్ని 15వ స్థానంలో పెట్టాడు ఏంటి అని మూడుముక్క‌ల ముఖ్య‌మంత్రి గురించి మాట్లాడుకున్నాం” అని ప‌వ‌న్ అన్నారు.

“లా అండ్ ఆర్డర్ ఎందుకు చితికిపోయింది ఏం చేయాలి.. అని ఓ 30 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడే కొద్దీ తీసుకొస్తూనే ఉన్నాయి అలా గంటన్నర అయింది. ఓ పదిహేను నిమిషాలు స్నాక్స్ కోసం గడిచాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి అని మాట్లాడుకున్నాం..” అని ప‌వ‌న్ వెల్ల‌డించారు. 

This post was last modified on January 13, 2023 12:45 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

1 hour ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

2 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

6 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

6 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago