Political News

వైసీపీ ఎమ్మెల్యే ఫొటోతో వీర‌సింహారెడ్డి పోస్ట‌ర్లు!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌టించిన తాజా మూవీ వీర‌సింహారెడ్డి విడుద‌లై ప్ర‌భంజ‌నం సృష్టిస్తు న్న విష‌యం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్సీస్‌లోనూ ఈ మూవీపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల‌య్య అభిమానులు.. పెద్ద ఎత్తున మూవీకి స్వాగ‌తం ప‌లుకుతూ.. బ్యాన‌ర్లు క‌ట్టారు.

మ‌రోవైపు.. టీడీపీ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద ఎత్తున బ్యాన‌ర్లు క‌ట్టారు. ఇక‌, హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ జోష్ మ‌రింత‌గా క‌నిపిస్తోంది. ధియేట‌ర్ల ద‌గ్గ‌ర సంక్రాంతి అప్పుడే వ‌చ్చేసిన‌ట్టు క‌నిపి స్తోంది. యువ‌త పండ‌గ సంబ‌రాల్లో మునిగిపోయారు. ఇదిలావుంటే.. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్రసాద్ ఫొటోల‌తో కూడిన భారీ కటౌట్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

వైసీపీలోకి రాక‌ముందు.. టీడీపీలో ఉన్న వ‌సంత.. బాల‌య్య‌కు కూడా అబిమాని, ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ప్ర‌చారం కూడా ఉంది. అయితే.. వైసీపీలోకి వ‌చ్చి.. గ‌త ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న వైసీపీపై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతుండ‌డం తెలిసిందే. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా బాల‌య్య సినిమాకు సంబంధించి భారీ క‌టౌట్లు ఏర్పాటు చేయ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

వైసీపీ నాయ‌కులు ఎంతో మంది అభిమానులుగా ఉన్న‌ప్ప‌టికీ.. అంద‌రూ కూడా పార్టీ లైన్‌కు అనుగుణం గా.. దూరంగా ఉన్నారు. బాల‌య్య మూవీల‌ను కూడా చాటుమాటుగా చూస్తున్నారు. కానీ, వ‌సంత మాత్రం బ‌హిరంగంగానే క‌టౌట్లు పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on January 12, 2023 9:50 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago