నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా మూవీ వీరసింహారెడ్డి విడుదలై ప్రభంజనం సృష్టిస్తు న్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్లోనూ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు.. పెద్ద ఎత్తున మూవీకి స్వాగతం పలుకుతూ.. బ్యానర్లు కట్టారు.
మరోవైపు.. టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. ఇక, హిందూపురం నియోజకవర్గంలో ఈ జోష్ మరింతగా కనిపిస్తోంది. ధియేటర్ల దగ్గర సంక్రాంతి అప్పుడే వచ్చేసినట్టు కనిపి స్తోంది. యువత పండగ సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలావుంటే.. ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి.
వైసీపీలోకి రాకముందు.. టీడీపీలో ఉన్న వసంత.. బాలయ్యకు కూడా అబిమాని, ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా ఉంది. అయితే.. వైసీపీలోకి వచ్చి.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, ఇటీవల కాలంలో ఆయన వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుండడం తెలిసిందే. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా బాలయ్య సినిమాకు సంబంధించి భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం.. రాజకీయంగా చర్చకు దారితీసింది.
వైసీపీ నాయకులు ఎంతో మంది అభిమానులుగా ఉన్నప్పటికీ.. అందరూ కూడా పార్టీ లైన్కు అనుగుణం గా.. దూరంగా ఉన్నారు. బాలయ్య మూవీలను కూడా చాటుమాటుగా చూస్తున్నారు. కానీ, వసంత మాత్రం బహిరంగంగానే కటౌట్లు పెట్టుకోవడం గమనార్హం.దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…