నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా మూవీ వీరసింహారెడ్డి విడుదలై ప్రభంజనం సృష్టిస్తు న్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్లోనూ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు.. పెద్ద ఎత్తున మూవీకి స్వాగతం పలుకుతూ.. బ్యానర్లు కట్టారు.
మరోవైపు.. టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. ఇక, హిందూపురం నియోజకవర్గంలో ఈ జోష్ మరింతగా కనిపిస్తోంది. ధియేటర్ల దగ్గర సంక్రాంతి అప్పుడే వచ్చేసినట్టు కనిపి స్తోంది. యువత పండగ సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలావుంటే.. ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి.
వైసీపీలోకి రాకముందు.. టీడీపీలో ఉన్న వసంత.. బాలయ్యకు కూడా అబిమాని, ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా ఉంది. అయితే.. వైసీపీలోకి వచ్చి.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, ఇటీవల కాలంలో ఆయన వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుండడం తెలిసిందే. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా బాలయ్య సినిమాకు సంబంధించి భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం.. రాజకీయంగా చర్చకు దారితీసింది.
వైసీపీ నాయకులు ఎంతో మంది అభిమానులుగా ఉన్నప్పటికీ.. అందరూ కూడా పార్టీ లైన్కు అనుగుణం గా.. దూరంగా ఉన్నారు. బాలయ్య మూవీలను కూడా చాటుమాటుగా చూస్తున్నారు. కానీ, వసంత మాత్రం బహిరంగంగానే కటౌట్లు పెట్టుకోవడం గమనార్హం.దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…