నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా మూవీ వీరసింహారెడ్డి విడుదలై ప్రభంజనం సృష్టిస్తు న్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్లోనూ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు.. పెద్ద ఎత్తున మూవీకి స్వాగతం పలుకుతూ.. బ్యానర్లు కట్టారు.
మరోవైపు.. టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. ఇక, హిందూపురం నియోజకవర్గంలో ఈ జోష్ మరింతగా కనిపిస్తోంది. ధియేటర్ల దగ్గర సంక్రాంతి అప్పుడే వచ్చేసినట్టు కనిపి స్తోంది. యువత పండగ సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలావుంటే.. ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి.
వైసీపీలోకి రాకముందు.. టీడీపీలో ఉన్న వసంత.. బాలయ్యకు కూడా అబిమాని, ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా ఉంది. అయితే.. వైసీపీలోకి వచ్చి.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, ఇటీవల కాలంలో ఆయన వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుండడం తెలిసిందే. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా బాలయ్య సినిమాకు సంబంధించి భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం.. రాజకీయంగా చర్చకు దారితీసింది.
వైసీపీ నాయకులు ఎంతో మంది అభిమానులుగా ఉన్నప్పటికీ.. అందరూ కూడా పార్టీ లైన్కు అనుగుణం గా.. దూరంగా ఉన్నారు. బాలయ్య మూవీలను కూడా చాటుమాటుగా చూస్తున్నారు. కానీ, వసంత మాత్రం బహిరంగంగానే కటౌట్లు పెట్టుకోవడం గమనార్హం.దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on January 12, 2023 9:50 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…