నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా మూవీ వీరసింహారెడ్డి విడుదలై ప్రభంజనం సృష్టిస్తు న్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్లోనూ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలావుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు.. పెద్ద ఎత్తున మూవీకి స్వాగతం పలుకుతూ.. బ్యానర్లు కట్టారు.
మరోవైపు.. టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. ఇక, హిందూపురం నియోజకవర్గంలో ఈ జోష్ మరింతగా కనిపిస్తోంది. ధియేటర్ల దగ్గర సంక్రాంతి అప్పుడే వచ్చేసినట్టు కనిపి స్తోంది. యువత పండగ సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలావుంటే.. ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫొటోలతో కూడిన భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి.
వైసీపీలోకి రాకముందు.. టీడీపీలో ఉన్న వసంత.. బాలయ్యకు కూడా అబిమాని, ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా ఉంది. అయితే.. వైసీపీలోకి వచ్చి.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, ఇటీవల కాలంలో ఆయన వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుండడం తెలిసిందే. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా బాలయ్య సినిమాకు సంబంధించి భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం.. రాజకీయంగా చర్చకు దారితీసింది.
వైసీపీ నాయకులు ఎంతో మంది అభిమానులుగా ఉన్నప్పటికీ.. అందరూ కూడా పార్టీ లైన్కు అనుగుణం గా.. దూరంగా ఉన్నారు. బాలయ్య మూవీలను కూడా చాటుమాటుగా చూస్తున్నారు. కానీ, వసంత మాత్రం బహిరంగంగానే కటౌట్లు పెట్టుకోవడం గమనార్హం.దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on January 12, 2023 9:50 pm
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…