ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఒకవైపు సంక్రాంతి పండుగ వచ్చే సింది. ఇంటిల్లిపాదీ పండగ సంబరాలకు రెడీ అయ్యారు. అయితే.. నెల మొత్తం పనిచేసిన ఉద్యోగులు మాత్రం జీతం కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వచ్చేసినా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 30 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు ఇచ్చింది.
అది కూడా సీమ ప్రాంతానికే మెజారిటీగా దక్కాయని తెలుస్తోంది. ఇక, మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు పడలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ.. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవేమో.. అనుకుని సరిపెట్టుకుందామని అనుకున్నా.. అలా ఏమీ కనిపించ లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకం కింద లక్షల రూపాయలను అందించారు.
ఏపీలోని చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం కింద ఆరోవిడతగా 3.95 లక్షల మందికి రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లకు తోడుగా ఉంటూ వారికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలకు శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
అయితే.. ఈ పరిణామాలను గమనిస్తున్న ఉద్యోగులు.. ఇదేం ఖర్మ నెల రోజులు పూర్తిగా సెలవు కూడా పెట్టకుండా.. పనిచేసిన తమకు వేతనాలు సకాలంలో ఇవ్వకుండా.. ఇలా.. తోడు పథకానికి ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. ఈ పథకానికి మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే.. పోయేదేంటి? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ముందు తన వేతనాలు ఇచ్చాక ఏం చేసుకున్నా.. తమకు ఇబ్బంది లేదని.. వగరుస్తున్నారు. కానీ, పట్టించుకునేవారేరీ?!
This post was last modified on January 11, 2023 10:33 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…