Political News

జగనన్న లెక్క అట్లుంటది

ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఉద్యోగులు ర‌గిలిపోతున్నారు. ఒక‌వైపు సంక్రాంతి పండుగ వ‌చ్చే సింది. ఇంటిల్లిపాదీ పండ‌గ సంబ‌రాల‌కు రెడీ అయ్యారు. అయితే.. నెల మొత్తం ప‌నిచేసిన ఉద్యోగులు మాత్రం జీతం కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వ‌చ్చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం 30 శాతం మంది ఉద్యోగుల‌కు మాత్ర‌మే వేత‌నాలు ఇచ్చింది.

అది కూడా సీమ ప్రాంతానికే మెజారిటీగా ద‌క్కాయ‌ని తెలుస్తోంది. ఇక‌, మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు వేత‌నాలు ప‌డ‌లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోనీ.. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవేమో.. అనుకుని స‌రిపెట్టుకుందామ‌ని అనుకున్నా.. అలా ఏమీ క‌నిపించ లేదు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అందించారు.

ఏపీలోని చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం కింద ఆరోవిడతగా 3.95 లక్షల మందికి రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లకు తోడుగా ఉంటూ వారికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలకు శ్రీకారం చుట్టామ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చెప్పారు.

అయితే.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న ఉద్యోగులు.. ఇదేం ఖ‌ర్మ‌ నెల రోజులు పూర్తిగా సెల‌వు కూడా పెట్ట‌కుండా.. ప‌నిచేసిన త‌మ‌కు వేత‌నాలు స‌కాలంలో ఇవ్వ‌కుండా.. ఇలా.. తోడు ప‌థ‌కానికి ఇవ్వ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు. ఈ ప‌థ‌కానికి మ‌రికొన్ని రోజులు వెయిట్ చేస్తే.. పోయేదేంటి? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ముందు త‌న వేత‌నాలు ఇచ్చాక ఏం చేసుకున్నా.. త‌మ‌కు ఇబ్బంది లేద‌ని.. వ‌గ‌రుస్తున్నారు. కానీ, ప‌ట్టించుకునేవారేరీ?!

This post was last modified on January 11, 2023 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

4 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

38 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago