Political News

జగనన్న లెక్క అట్లుంటది

ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఉద్యోగులు ర‌గిలిపోతున్నారు. ఒక‌వైపు సంక్రాంతి పండుగ వ‌చ్చే సింది. ఇంటిల్లిపాదీ పండ‌గ సంబ‌రాల‌కు రెడీ అయ్యారు. అయితే.. నెల మొత్తం ప‌నిచేసిన ఉద్యోగులు మాత్రం జీతం కోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వ‌చ్చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం 30 శాతం మంది ఉద్యోగుల‌కు మాత్ర‌మే వేత‌నాలు ఇచ్చింది.

అది కూడా సీమ ప్రాంతానికే మెజారిటీగా ద‌క్కాయ‌ని తెలుస్తోంది. ఇక‌, మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు వేత‌నాలు ప‌డ‌లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోనీ.. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవేమో.. అనుకుని స‌రిపెట్టుకుందామ‌ని అనుకున్నా.. అలా ఏమీ క‌నిపించ లేదు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను అందించారు.

ఏపీలోని చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం కింద ఆరోవిడతగా 3.95 లక్షల మందికి రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లకు తోడుగా ఉంటూ వారికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలకు శ్రీకారం చుట్టామ‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చెప్పారు.

అయితే.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న ఉద్యోగులు.. ఇదేం ఖ‌ర్మ‌ నెల రోజులు పూర్తిగా సెల‌వు కూడా పెట్ట‌కుండా.. ప‌నిచేసిన త‌మ‌కు వేత‌నాలు స‌కాలంలో ఇవ్వ‌కుండా.. ఇలా.. తోడు ప‌థ‌కానికి ఇవ్వ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు. ఈ ప‌థ‌కానికి మ‌రికొన్ని రోజులు వెయిట్ చేస్తే.. పోయేదేంటి? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ముందు త‌న వేత‌నాలు ఇచ్చాక ఏం చేసుకున్నా.. త‌మ‌కు ఇబ్బంది లేద‌ని.. వ‌గ‌రుస్తున్నారు. కానీ, ప‌ట్టించుకునేవారేరీ?!

This post was last modified on January 11, 2023 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

35 minutes ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

2 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

3 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

3 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

5 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

5 hours ago