Political News

ఏ అవకాశాన్నీ వదులుకోని రఘురామకృష్ణం రాజు

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిరంతరం తనను గెలిపించిన పార్టీకి షాకులు ఇస్తూనే ఉన్నారు. ‘బొచ్చులో నాయకత్వం‘ అన్న మాటతో మొదలైన ఇసుక వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండానే పదవి నుంచి డిస్మిస్ చేయాలంటూ లోక్ సభ స్పీకరుకు వైసీపీ పార్లమెంటరీ విభాగం వినతిపత్రం ఇచ్చింది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సస్పెండ్ చేస్తే అతనికి మేలు చేసినట్టు అవుతుందన్న ఏకైక కారణంతో సస్పెండ్ చేయడం లేదు. దీంతో ఆయన ఏం చేసినా వార్తే అవుతోంది. అలా అని రఘురామ రాజు ఏది పడితే అది చేయడం లేదు. తన భవిష్యత్తు ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. తాజాగా అయోధ్య రామాలయానికి భారీ విరాళం ఇచ్చారు.

ఆగస్టు 5న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం దేశంలోని 10 కోట్ల కుటుంబాలని సంప్రదిస్తామని రామాలయ ట్రస్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో రఘురామరాజు తన మూడు నెలల జీతభత్యాలను Rs 3,96,000 (మూడు లక్షల తొంబై ఆరు వేలు రూపాయలు) ఆలయ నిర్మాణం కోసం విరాళం ప్రకటించారు. రామాలయ నిర్మాణానికి నా వంతు ఉడతాభక్తిగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు ఈ విరాళం సమర్పిస్తున్నట్టు ఆయన తన ప్రకటన విడుదల చేశారు. ప్రకటనతో పాటు చెక్ ఫొటోను కూడా తన సోషల్ మీడియాలో పెట్టారు.

మొదట విమర్శలు, ఆ తర్వాత లేఖలతో ముఖ్యమంత్రి జగన్ ను ఇరిటేట్ చేసిన రఘురామ రాజు ఇటీవల మోడీని కీర్తిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మోడీ శంకుస్థాపన నేపథ్యంలో ఈ విరాళం ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు. నిబంధనల ప్రకారం అనర్హతకు తగిన తప్పులు రఘరామరాజు చేయలేదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో సస్పెండ్ చేస్తే గాని వైసీపీకి ఈయన బాధ తప్పేలా లేదు. కానీ రాజు గారు మాత్రం యథా ప్రకారం పార్టీకి విధేయత చూపుతున్నారు.

This post was last modified on July 20, 2020 4:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

16 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

52 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago