Political News

ఏ అవకాశాన్నీ వదులుకోని రఘురామకృష్ణం రాజు

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిరంతరం తనను గెలిపించిన పార్టీకి షాకులు ఇస్తూనే ఉన్నారు. ‘బొచ్చులో నాయకత్వం‘ అన్న మాటతో మొదలైన ఇసుక వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండానే పదవి నుంచి డిస్మిస్ చేయాలంటూ లోక్ సభ స్పీకరుకు వైసీపీ పార్లమెంటరీ విభాగం వినతిపత్రం ఇచ్చింది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సస్పెండ్ చేస్తే అతనికి మేలు చేసినట్టు అవుతుందన్న ఏకైక కారణంతో సస్పెండ్ చేయడం లేదు. దీంతో ఆయన ఏం చేసినా వార్తే అవుతోంది. అలా అని రఘురామ రాజు ఏది పడితే అది చేయడం లేదు. తన భవిష్యత్తు ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. తాజాగా అయోధ్య రామాలయానికి భారీ విరాళం ఇచ్చారు.

ఆగస్టు 5న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం దేశంలోని 10 కోట్ల కుటుంబాలని సంప్రదిస్తామని రామాలయ ట్రస్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో రఘురామరాజు తన మూడు నెలల జీతభత్యాలను Rs 3,96,000 (మూడు లక్షల తొంబై ఆరు వేలు రూపాయలు) ఆలయ నిర్మాణం కోసం విరాళం ప్రకటించారు. రామాలయ నిర్మాణానికి నా వంతు ఉడతాభక్తిగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు ఈ విరాళం సమర్పిస్తున్నట్టు ఆయన తన ప్రకటన విడుదల చేశారు. ప్రకటనతో పాటు చెక్ ఫొటోను కూడా తన సోషల్ మీడియాలో పెట్టారు.

మొదట విమర్శలు, ఆ తర్వాత లేఖలతో ముఖ్యమంత్రి జగన్ ను ఇరిటేట్ చేసిన రఘురామ రాజు ఇటీవల మోడీని కీర్తిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మోడీ శంకుస్థాపన నేపథ్యంలో ఈ విరాళం ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు. నిబంధనల ప్రకారం అనర్హతకు తగిన తప్పులు రఘరామరాజు చేయలేదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో సస్పెండ్ చేస్తే గాని వైసీపీకి ఈయన బాధ తప్పేలా లేదు. కానీ రాజు గారు మాత్రం యథా ప్రకారం పార్టీకి విధేయత చూపుతున్నారు.

This post was last modified on July 20, 2020 4:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిపేర్లు సరే ముందు డ్యామేజ్ చూడండి

ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…

21 minutes ago

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

3 hours ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

4 hours ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

6 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

6 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

6 hours ago