ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ పోలీసులను చంద్రముఖిగా అభివర్ణించారు. తాజాగా చంద్రముఖి హీరో రజనీ కాంత్.. బాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఇస్తూ.. దీనిని లైవ్లో చర్చకు ఉంచేలా.. చంద్రబాబు పోలీసులపై చంద్రముఖి కామెంట్లతో విరుచుకు పడ్డారు. గంగ.. చంద్రముఖిగా మారినట్టు.. ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు అని వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలు ఏ చిన్న ఉద్యమం చేయాలని అనుకున్నా.. ఏచిన్న ధర్నా చేయాలని అనుకున్నా.. వెంట నే పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీ పీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతూ.. పోలీసులే ఫిర్యాదుదారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తా రు. రాను రాను కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారుతున్నారని ఆక్షేపించారు.
టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కుప్పం, పుంగనూరు ఘటనల్లో కావాలనే తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆక్షేపించారు. మొదట్లో టీడీపీపై వైసీపీ వాళ్లు అక్రమ కేసులు పెడితే.. పోలీసులు అండగా నిలిచేవారని, ఇప్పుడు పోలీసులే తప్పుడు కేసులు పెట్టే బాధ్యతను తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.
రజనీకాంత్ నటించిన సినిమాలో గంగ చంద్రముఖిగా మారినట్లు…రాష్ట్రంలో కొందరు పోలీసులు పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా రూపాంతరం చెందిన క్రమం ఇది. మొదట్లో టీడీపీపై వైసీపీ అక్రమ కేసులకు అండగా నిలిచిన కొందరు పోలీసులు…ఇక ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టే బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు! అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on January 11, 2023 5:56 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…