ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ పోలీసులను చంద్రముఖిగా అభివర్ణించారు. తాజాగా చంద్రముఖి హీరో రజనీ కాంత్.. బాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఇస్తూ.. దీనిని లైవ్లో చర్చకు ఉంచేలా.. చంద్రబాబు పోలీసులపై చంద్రముఖి కామెంట్లతో విరుచుకు పడ్డారు. గంగ.. చంద్రముఖిగా మారినట్టు.. ఏపీ పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు అని వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలు ఏ చిన్న ఉద్యమం చేయాలని అనుకున్నా.. ఏచిన్న ధర్నా చేయాలని అనుకున్నా.. వెంట నే పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీ పీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతూ.. పోలీసులే ఫిర్యాదుదారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తా రు. రాను రాను కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారుతున్నారని ఆక్షేపించారు.
టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. కుప్పం, పుంగనూరు ఘటనల్లో కావాలనే తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆక్షేపించారు. మొదట్లో టీడీపీపై వైసీపీ వాళ్లు అక్రమ కేసులు పెడితే.. పోలీసులు అండగా నిలిచేవారని, ఇప్పుడు పోలీసులే తప్పుడు కేసులు పెట్టే బాధ్యతను తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.
రజనీకాంత్ నటించిన సినిమాలో గంగ చంద్రముఖిగా మారినట్లు…రాష్ట్రంలో కొందరు పోలీసులు పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా రూపాంతరం చెందిన క్రమం ఇది. మొదట్లో టీడీపీపై వైసీపీ అక్రమ కేసులకు అండగా నిలిచిన కొందరు పోలీసులు…ఇక ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టే బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు! అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…