సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలకు రెడీ అయిన రెండు సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే.. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్సినిమాలే కావడం గమనార్హం.
అయితే.. ఈ రెండు చిత్రాల నిర్మాతలు కూడా.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. తమ సినిమాలకు.. ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో రూ.150 నుంచి 100 వరకు పెంచుకునే అవకాశం ఉందని.. దీనిని పునరుద్ధరించాలని వారు అభ్యర్థించారు. అయితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో ఈ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంది.
బాలయ్య నటించిన సినిమా వీరసింహారెడ్డికి రూ.20 పెంచుకునేలా అవకాశం కల్పించిన ప్రభుత్వం అదేసమయంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 పెంచుకునేందుకు ఛాన్స్ కల్పించింది. వాస్తవానికి రెండూ హై బడ్జెట్ సినిమాలే అయినప్పుడు ఇంత తక్కువగా ధరలు పెంచడం.. అది కూడా ఒక్కొక్క సినిమాకు వేరియేషన్ కూడా చూపించడం.. రాజకీయ ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు పరిశీలకులు.
ఇదిలావుంటే.. ఈ పెంపు కూడా కేవలం పది రోజుల వరకు మాత్రమే పరిమితమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు సినిమాలకు రూ.100 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. ఒక ప్రత్యేక షో వేసుకునేందుకు అనుమతినిచ్చింది.
This post was last modified on January 11, 2023 4:08 pm
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు…
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…