సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలకు రెడీ అయిన రెండు సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే.. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్సినిమాలే కావడం గమనార్హం.
అయితే.. ఈ రెండు చిత్రాల నిర్మాతలు కూడా.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. తమ సినిమాలకు.. ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో రూ.150 నుంచి 100 వరకు పెంచుకునే అవకాశం ఉందని.. దీనిని పునరుద్ధరించాలని వారు అభ్యర్థించారు. అయితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో ఈ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంది.
బాలయ్య నటించిన సినిమా వీరసింహారెడ్డికి రూ.20 పెంచుకునేలా అవకాశం కల్పించిన ప్రభుత్వం అదేసమయంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 పెంచుకునేందుకు ఛాన్స్ కల్పించింది. వాస్తవానికి రెండూ హై బడ్జెట్ సినిమాలే అయినప్పుడు ఇంత తక్కువగా ధరలు పెంచడం.. అది కూడా ఒక్కొక్క సినిమాకు వేరియేషన్ కూడా చూపించడం.. రాజకీయ ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు పరిశీలకులు.
ఇదిలావుంటే.. ఈ పెంపు కూడా కేవలం పది రోజుల వరకు మాత్రమే పరిమితమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు సినిమాలకు రూ.100 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. ఒక ప్రత్యేక షో వేసుకునేందుకు అనుమతినిచ్చింది.
This post was last modified on January 11, 2023 4:08 pm
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…