Political News

ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క రేటు.. రాజ‌కీయం!

సంక్రాంతి సంద‌ర్భంగా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌కు రెడీ అయిన రెండు సినిమాల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం రాజ‌కీయ కోణంలో నిర్ణ‌యం తీసుకుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య‌, న‌ట‌సింహం బాల‌య్య న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి విడుద‌ల కానున్నాయి. అయితే.. రెండు సినిమాలు కూడా భారీ బ‌డ్జెట్‌సినిమాలే కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ రెండు చిత్రాల నిర్మాత‌లు కూడా.. ప్ర‌భుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. త‌మ సినిమాల‌కు.. ధ‌ర‌లు పెంచుకునే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. గ‌తంలో రూ.150 నుంచి 100 వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఉంద‌ని.. దీనిని పున‌రుద్ధ‌రించాల‌ని వారు అభ్య‌ర్థించారు. అయితే.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం త‌న‌దైన శైలిలో ఈ రేట్ల పెంపుపై నిర్ణ‌యం తీసుకుంది.

బాల‌య్య న‌టించిన సినిమా వీర‌సింహారెడ్డికి రూ.20 పెంచుకునేలా అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌భుత్వం అదేస‌మ‌యంలో చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమాకు రూ.25 పెంచుకునేందుకు ఛాన్స్ క‌ల్పించింది. వాస్త‌వానికి రెండూ హై బ‌డ్జెట్ సినిమాలే అయిన‌ప్పుడు ఇంత త‌క్కువ‌గా ధ‌ర‌లు పెంచ‌డం.. అది కూడా ఒక్కొక్క సినిమాకు వేరియేష‌న్ కూడా చూపించ‌డం.. రాజకీయ ఎత్తుగ‌డ‌లో భాగ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. ఈ పెంపు కూడా కేవ‌లం ప‌ది రోజుల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఇదిలావుంటే, తెలంగాణ ప్ర‌భుత్వం అక్క‌డ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు సినిమాల‌కు రూ.100 వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. ఒక‌ ప్రత్యేక షో వేసుకునేందుకు అనుమతినిచ్చింది. 

This post was last modified on January 11, 2023 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago