Political News

ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క రేటు.. రాజ‌కీయం!

సంక్రాంతి సంద‌ర్భంగా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌కు రెడీ అయిన రెండు సినిమాల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం రాజ‌కీయ కోణంలో నిర్ణ‌యం తీసుకుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య‌, న‌ట‌సింహం బాల‌య్య న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి విడుద‌ల కానున్నాయి. అయితే.. రెండు సినిమాలు కూడా భారీ బ‌డ్జెట్‌సినిమాలే కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ రెండు చిత్రాల నిర్మాత‌లు కూడా.. ప్ర‌భుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. త‌మ సినిమాల‌కు.. ధ‌ర‌లు పెంచుకునే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. గ‌తంలో రూ.150 నుంచి 100 వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఉంద‌ని.. దీనిని పున‌రుద్ధ‌రించాల‌ని వారు అభ్య‌ర్థించారు. అయితే.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం త‌న‌దైన శైలిలో ఈ రేట్ల పెంపుపై నిర్ణ‌యం తీసుకుంది.

బాల‌య్య న‌టించిన సినిమా వీర‌సింహారెడ్డికి రూ.20 పెంచుకునేలా అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌భుత్వం అదేస‌మ‌యంలో చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమాకు రూ.25 పెంచుకునేందుకు ఛాన్స్ క‌ల్పించింది. వాస్త‌వానికి రెండూ హై బ‌డ్జెట్ సినిమాలే అయిన‌ప్పుడు ఇంత త‌క్కువ‌గా ధ‌ర‌లు పెంచ‌డం.. అది కూడా ఒక్కొక్క సినిమాకు వేరియేష‌న్ కూడా చూపించ‌డం.. రాజకీయ ఎత్తుగ‌డ‌లో భాగ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. ఈ పెంపు కూడా కేవ‌లం ప‌ది రోజుల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఇదిలావుంటే, తెలంగాణ ప్ర‌భుత్వం అక్క‌డ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు సినిమాల‌కు రూ.100 వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. ఒక‌ ప్రత్యేక షో వేసుకునేందుకు అనుమతినిచ్చింది. 

This post was last modified on January 11, 2023 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago