సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాలతో విడుదలకు రెడీ అయిన రెండు సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే.. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్సినిమాలే కావడం గమనార్హం.
అయితే.. ఈ రెండు చిత్రాల నిర్మాతలు కూడా.. ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. తమ సినిమాలకు.. ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో రూ.150 నుంచి 100 వరకు పెంచుకునే అవకాశం ఉందని.. దీనిని పునరుద్ధరించాలని వారు అభ్యర్థించారు. అయితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలో ఈ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంది.
బాలయ్య నటించిన సినిమా వీరసింహారెడ్డికి రూ.20 పెంచుకునేలా అవకాశం కల్పించిన ప్రభుత్వం అదేసమయంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.25 పెంచుకునేందుకు ఛాన్స్ కల్పించింది. వాస్తవానికి రెండూ హై బడ్జెట్ సినిమాలే అయినప్పుడు ఇంత తక్కువగా ధరలు పెంచడం.. అది కూడా ఒక్కొక్క సినిమాకు వేరియేషన్ కూడా చూపించడం.. రాజకీయ ఎత్తుగడలో భాగమేనని అంటున్నారు పరిశీలకులు.
ఇదిలావుంటే.. ఈ పెంపు కూడా కేవలం పది రోజుల వరకు మాత్రమే పరిమితమని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలావుంటే, తెలంగాణ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు సినిమాలకు రూ.100 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడంతోపాటు.. ఒక ప్రత్యేక షో వేసుకునేందుకు అనుమతినిచ్చింది.
This post was last modified on January 11, 2023 4:08 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…