ఏపీలో రాజకీయ పరిణామాలుమారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేసినట్టు రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. ఇక, తాజాగా జనసేనలో మరో చర్చ తెరమీదికి వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సీటును జనసేనకు ఇవ్వాలనే షరతు తెరమీదికి వచ్చిందని అంటున్నారు.
దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు కూడా అంగీకరించారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ విశాఖను దక్కించుకోలేక పోయింది. 2009లో పురందేశ్వరి(కాంగ్రెస్), 2014లో కంభం పాటి హరిబాబు (బీజేపీ), 2019లో ఎంవీవీ సత్యనారాయణ (వైసీపీ) విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా.. అది వైసీపీకి అప్పగించినట్టు అవుతుందనే భావన ఉంది.
ఈ క్రమంలో దీనిని జనసేనకు వదిలేయడం ద్వారా.. నరసాపురం టికెట్ను తమ దగ్గర పెట్టుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక, విశాఖ నుంచి జనసేన నేత నాగబాబు పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఈయనకు అండగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల చిరంజీవి కూడా విశాఖలో ఇల్లు కట్టుకుంటానని చెప్పడం ద్వారా.. కొంత జోష్ పెరిగింది.
సో.. విశాఖను జనసేనకు ఇవ్వడం ఖాయమని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు.. నరసాపురం నుంచి.. వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజుకు.. టీడీపీ టికెట్ ఇవ్వనుందని ఇటువైపు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీ అనుకూలంగా.. చంద్రబాబుకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నరసాపురం నుంచి ఆయనను బరిలో దింపితే.. వైసీపీకి చెక్ పెట్టినట్టు అవుతుందని వ్యూహాలు వేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on January 11, 2023 9:33 am
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…