ఏపీలో రాజకీయ పరిణామాలుమారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేసినట్టు రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. ఇక, తాజాగా జనసేనలో మరో చర్చ తెరమీదికి వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సీటును జనసేనకు ఇవ్వాలనే షరతు తెరమీదికి వచ్చిందని అంటున్నారు.
దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు కూడా అంగీకరించారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ విశాఖను దక్కించుకోలేక పోయింది. 2009లో పురందేశ్వరి(కాంగ్రెస్), 2014లో కంభం పాటి హరిబాబు (బీజేపీ), 2019లో ఎంవీవీ సత్యనారాయణ (వైసీపీ) విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా.. అది వైసీపీకి అప్పగించినట్టు అవుతుందనే భావన ఉంది.
ఈ క్రమంలో దీనిని జనసేనకు వదిలేయడం ద్వారా.. నరసాపురం టికెట్ను తమ దగ్గర పెట్టుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక, విశాఖ నుంచి జనసేన నేత నాగబాబు పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఈయనకు అండగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల చిరంజీవి కూడా విశాఖలో ఇల్లు కట్టుకుంటానని చెప్పడం ద్వారా.. కొంత జోష్ పెరిగింది.
సో.. విశాఖను జనసేనకు ఇవ్వడం ఖాయమని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు.. నరసాపురం నుంచి.. వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజుకు.. టీడీపీ టికెట్ ఇవ్వనుందని ఇటువైపు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీ అనుకూలంగా.. చంద్రబాబుకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నరసాపురం నుంచి ఆయనను బరిలో దింపితే.. వైసీపీకి చెక్ పెట్టినట్టు అవుతుందని వ్యూహాలు వేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on January 11, 2023 9:33 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…