ఏపీలో రాజకీయ పరిణామాలుమారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేసినట్టు రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. ఇక, తాజాగా జనసేనలో మరో చర్చ తెరమీదికి వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు సీటును జనసేనకు ఇవ్వాలనే షరతు తెరమీదికి వచ్చిందని అంటున్నారు.
దీనికి సూత్రప్రాయంగా చంద్రబాబు కూడా అంగీకరించారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ విశాఖను దక్కించుకోలేక పోయింది. 2009లో పురందేశ్వరి(కాంగ్రెస్), 2014లో కంభం పాటి హరిబాబు (బీజేపీ), 2019లో ఎంవీవీ సత్యనారాయణ (వైసీపీ) విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా.. అది వైసీపీకి అప్పగించినట్టు అవుతుందనే భావన ఉంది.
ఈ క్రమంలో దీనిని జనసేనకు వదిలేయడం ద్వారా.. నరసాపురం టికెట్ను తమ దగ్గర పెట్టుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక, విశాఖ నుంచి జనసేన నేత నాగబాబు పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఈయనకు అండగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల చిరంజీవి కూడా విశాఖలో ఇల్లు కట్టుకుంటానని చెప్పడం ద్వారా.. కొంత జోష్ పెరిగింది.
సో.. విశాఖను జనసేనకు ఇవ్వడం ఖాయమని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు.. నరసాపురం నుంచి.. వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజుకు.. టీడీపీ టికెట్ ఇవ్వనుందని ఇటువైపు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీ అనుకూలంగా.. చంద్రబాబుకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నరసాపురం నుంచి ఆయనను బరిలో దింపితే.. వైసీపీకి చెక్ పెట్టినట్టు అవుతుందని వ్యూహాలు వేస్తున్నారని అంటున్నారు.
This post was last modified on January 11, 2023 9:33 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…