తెలంగాణ సీఎం కేసీఆర్కు సంచలన నివేదిక అందిందా? ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఈ నివేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారా? అంటే.. ఔననే అంటున్నాయి ప్రగతి భవన్ వర్గాలు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత.. పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తుందని, ఇది తనకు, పార్టీకి మేలు చేస్తుందని కేసీఆర్ అనుకున్నారు. అయితే.. తన చుట్టూనే జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయి తప్ప.. నియోజకవర్గాల్లో సందడి కనిపించడం లేదు.
ఈ పరిణామాలను గమనించిన కేసీఆర్.. అసలు నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే విషయంపై రహస్య సమాచారం సేకరించినట్టు సమాచారం. ఈ సమాచారంలో పార్టీనేతలపై.. తీవ్ర విమర్శలు, వారు చేస్తున్న రహస్య రాజకీయాలు కూడా తేటతెల్లం అయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. వారికి టికెట్ లు ఇచ్చారు. వారు గెలిచారు.
అయితే.. తర్వాత.. ఆయా పార్టీలు పుంజుకుంటున్న పరిస్థితిలో వీరంతా ఎందుకైనా మంచిదని ఆయా పార్టీలతో తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వాటిపై తనకు అందిన సమాచారం ఆధారంగా కేసీఆర్.. చర్యలు తీసుకోవడం ఖాయమని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గతం నుంచి కూడా చాలా మంది నేతలపై కేసీఆర్కు అనుమానం ఉంది.
అయినప్పటికీ.. అందరికీ టికెట్లు ఇస్తామని ఆయన ప్రకటించి.. వారిని సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. నాయకులు చాలా మంది ఇప్పటికీ రెండు పడవలపై కాళ్లేసినట్టు వ్యవహరిస్తుండడం.. పార్టీ కార్యక్రమాలకు కూడా మొక్కుబడిగా హాజరు అవుతుండడం.. బీఆర్ ఎస్ పార్టీకి తగిన విదంగా ప్రచారం కల్పించకపోవడం వెనుక.. కీలకమైన పార్టీల ప్రభావం పడుతోందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్.. సదరు ఎక్వైరీకి ఆదేశించారని.. ప్రస్తుతం నివేదిక కూడా చేరిందని తెలుస్తోంది.
This post was last modified on January 10, 2023 5:18 pm
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…