ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల కిందట.. ఇక్కడ టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించిన సమయంలో చోటు చేసుకున్న రగడ ఇంకా చల్లారక ముందే.. మరోసారి మాచర్ల రాజకీయం హీటెక్కింది. నాటి ఘటనలో టీడీపీ నేతలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్టడం, వాహనాలకు నిప్పు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పటి ఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. కోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో నేతలు ఇళ్లకు చేరుకున్నారు. అయితే.. ఈరోజు మరోసారి టీడీపీ కీలక నాయకుడు, మాచర్ల ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లకు వస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఆవెంటనే మాచర్లలో 114 సెక్షన్ను రాత్రికి రాత్రి ప్రకటించారు. అదేసమయంలో సెక్షన్ 30 ని కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ నేలను అప్రకటిత గృహనిర్బంధం చేసినట్టు అయింది. అయినప్పటికీ, బ్రహ్మానందరెడ్డి తన పర్యటన సాగిస్తానని.. చెప్పడం గమనార్హం.
మరోవైపు.. పోలీసులు మాచర్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూడా ప్రధాన కూడళ్లలో కవాతు నిర్వహించారు. ఈ పరిణామాలతో మాచర్లలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొనడం గమనార్హం.
This post was last modified on January 8, 2023 5:25 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…