ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల కిందట.. ఇక్కడ టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించిన సమయంలో చోటు చేసుకున్న రగడ ఇంకా చల్లారక ముందే.. మరోసారి మాచర్ల రాజకీయం హీటెక్కింది. నాటి ఘటనలో టీడీపీ నేతలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్టడం, వాహనాలకు నిప్పు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పటి ఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. కోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో నేతలు ఇళ్లకు చేరుకున్నారు. అయితే.. ఈరోజు మరోసారి టీడీపీ కీలక నాయకుడు, మాచర్ల ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లకు వస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఆవెంటనే మాచర్లలో 114 సెక్షన్ను రాత్రికి రాత్రి ప్రకటించారు. అదేసమయంలో సెక్షన్ 30 ని కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ నేలను అప్రకటిత గృహనిర్బంధం చేసినట్టు అయింది. అయినప్పటికీ, బ్రహ్మానందరెడ్డి తన పర్యటన సాగిస్తానని.. చెప్పడం గమనార్హం.
మరోవైపు.. పోలీసులు మాచర్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూడా ప్రధాన కూడళ్లలో కవాతు నిర్వహించారు. ఈ పరిణామాలతో మాచర్లలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొనడం గమనార్హం.
This post was last modified on January 8, 2023 5:25 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…