ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల కిందట.. ఇక్కడ టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించిన సమయంలో చోటు చేసుకున్న రగడ ఇంకా చల్లారక ముందే.. మరోసారి మాచర్ల రాజకీయం హీటెక్కింది. నాటి ఘటనలో టీడీపీ నేతలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్టడం, వాహనాలకు నిప్పు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పటి ఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. కోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో నేతలు ఇళ్లకు చేరుకున్నారు. అయితే.. ఈరోజు మరోసారి టీడీపీ కీలక నాయకుడు, మాచర్ల ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లకు వస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఆవెంటనే మాచర్లలో 114 సెక్షన్ను రాత్రికి రాత్రి ప్రకటించారు. అదేసమయంలో సెక్షన్ 30 ని కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ నేలను అప్రకటిత గృహనిర్బంధం చేసినట్టు అయింది. అయినప్పటికీ, బ్రహ్మానందరెడ్డి తన పర్యటన సాగిస్తానని.. చెప్పడం గమనార్హం.
మరోవైపు.. పోలీసులు మాచర్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూడా ప్రధాన కూడళ్లలో కవాతు నిర్వహించారు. ఈ పరిణామాలతో మాచర్లలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొనడం గమనార్హం.
This post was last modified on January 8, 2023 5:25 pm
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…