ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల కిందట.. ఇక్కడ టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించిన సమయంలో చోటు చేసుకున్న రగడ ఇంకా చల్లారక ముందే.. మరోసారి మాచర్ల రాజకీయం హీటెక్కింది. నాటి ఘటనలో టీడీపీ నేతలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్టడం, వాహనాలకు నిప్పు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అప్పటి ఘటన రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై ఏకంగా హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. కోర్టు వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో నేతలు ఇళ్లకు చేరుకున్నారు. అయితే.. ఈరోజు మరోసారి టీడీపీ కీలక నాయకుడు, మాచర్ల ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్లకు వస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
ఆవెంటనే మాచర్లలో 114 సెక్షన్ను రాత్రికి రాత్రి ప్రకటించారు. అదేసమయంలో సెక్షన్ 30 ని కూడా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ నేలను అప్రకటిత గృహనిర్బంధం చేసినట్టు అయింది. అయినప్పటికీ, బ్రహ్మానందరెడ్డి తన పర్యటన సాగిస్తానని.. చెప్పడం గమనార్హం.
మరోవైపు.. పోలీసులు మాచర్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూడా ప్రధాన కూడళ్లలో కవాతు నిర్వహించారు. ఈ పరిణామాలతో మాచర్లలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొనడం గమనార్హం.
This post was last modified on January 8, 2023 5:25 pm
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. కానీ ఈ మ్యాచ్…