పవన్ కల్యాణ్పై తరచూ విమర్శలు చేసే మంత్రి రోజా తాజాగా మరో అడుగు ముందుకు వేసి చిరంజీవిపైనా విమర్శలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే చిరంజీవి సోదరుడు నాగబాబు.. రోజాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజా నోరు చెత్త కుప్ప అని నాగబాబు అనడంతో ఆ మాట ఏకంగా ట్విటర్లో ట్రెండ్గా కూడా మారింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు రోజా పై ఆగ్రహిస్తున్నారు.
మరోవైపు రోజా గతంలో నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించిన జబర్దస్ నటుడు గెటప్ శ్రీను కూడా రోజాకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. శ్రీను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయన రోజా కామెంట్లను తప్పుపట్టారు. ముఖ్యంగా చిరంజీవికి సేవాభావం లేదని రోజా అనడాన్ని గెటప్ శ్రీను తప్పు పట్టారు.
‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో.. రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సి వస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు రోజా క్షమాపణ చెప్పాలంటూ చిరంజీవి అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల ఆమె దిష్టిబొమ్మలూ దహనం చేస్తున్నారు. పవన్ కల్యాణ్పై ఎన్ని విమర్శలు చేసినా ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉండడంతో అదేమీ ఇబ్బందికరం కాకపోయినా ఇప్పుడు చిరంజీవిని సీన్లోకి లాగడంతో రోజాపై వ్యతిరేకత కనిపిస్తోంది.
వైసీపీ నేతలు కూడా కొందరు రోజా అనవసరంగా చిరంజీవి ప్రస్తావన తెచ్చారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాజకీయంగా కాపులను పూర్తిగా దూరం చేసుకోవాలంటేనే చిరంజీవిని టార్గెట్ చేయాలని… ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యల వల్ల అలాంటి పరిస్థితే వస్తుందని వైసీపీలోని కాపునేతలు కొందరు అన్నట్లు సమాచారం.
This post was last modified on January 8, 2023 9:49 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…