Political News

చిరంజీవిని టార్గెట్ చేస్తే ఏమొస్తాది రోజా

పవన్ కల్యాణ్‌పై తరచూ విమర్శలు చేసే మంత్రి రోజా తాజాగా మరో అడుగు ముందుకు వేసి చిరంజీవిపైనా విమర్శలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే చిరంజీవి సోదరుడు నాగబాబు.. రోజాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజా నోరు చెత్త కుప్ప అని నాగబాబు అనడంతో ఆ మాట ఏకంగా ట్విటర్లో ట్రెండ్‌గా కూడా మారింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు రోజా పై ఆగ్రహిస్తున్నారు.

మరోవైపు రోజా గతంలో నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించిన జబర్దస్ నటుడు గెటప్ శ్రీను కూడా రోజాకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. శ్రీను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయన రోజా కామెంట్లను తప్పుపట్టారు. ముఖ్యంగా చిరంజీవికి సేవాభావం లేదని రోజా అనడాన్ని గెటప్ శ్రీను తప్పు పట్టారు.

‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో.. రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సి వస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు రోజా క్షమాపణ చెప్పాలంటూ చిరంజీవి అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల ఆమె దిష్టిబొమ్మలూ దహనం చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌పై ఎన్ని విమర్శలు చేసినా ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉండడంతో అదేమీ ఇబ్బందికరం కాకపోయినా ఇప్పుడు చిరంజీవిని సీన్లోకి లాగడంతో రోజాపై వ్యతిరేకత కనిపిస్తోంది.

వైసీపీ నేతలు కూడా కొందరు రోజా అనవసరంగా చిరంజీవి ప్రస్తావన తెచ్చారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాజకీయంగా కాపులను పూర్తిగా దూరం చేసుకోవాలంటేనే చిరంజీవిని టార్గెట్ చేయాలని… ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యల వల్ల అలాంటి పరిస్థితే వస్తుందని వైసీపీలోని కాపునేతలు కొందరు అన్నట్లు సమాచారం.

This post was last modified on January 8, 2023 9:49 am

Share

Recent Posts

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

11 minutes ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

18 minutes ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

30 minutes ago

అభిమాని చిరకాల కోరిక తీర్చిన రామ్

సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు…

33 minutes ago

అన్నయ్యను పలకరించాలి బ్రహ్మానందం గారూ…

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి…

59 minutes ago

రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి: కొండా సుష్మిత

పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే,…

1 hour ago