పవన్ కల్యాణ్పై తరచూ విమర్శలు చేసే మంత్రి రోజా తాజాగా మరో అడుగు ముందుకు వేసి చిరంజీవిపైనా విమర్శలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే చిరంజీవి సోదరుడు నాగబాబు.. రోజాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజా నోరు చెత్త కుప్ప అని నాగబాబు అనడంతో ఆ మాట ఏకంగా ట్విటర్లో ట్రెండ్గా కూడా మారింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు రోజా పై ఆగ్రహిస్తున్నారు.
మరోవైపు రోజా గతంలో నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించిన జబర్దస్ నటుడు గెటప్ శ్రీను కూడా రోజాకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. శ్రీను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయన రోజా కామెంట్లను తప్పుపట్టారు. ముఖ్యంగా చిరంజీవికి సేవాభావం లేదని రోజా అనడాన్ని గెటప్ శ్రీను తప్పు పట్టారు.
‘చిరంజీవి గారి .. సేవా గుణ , దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో.. రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సి వస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు రోజా క్షమాపణ చెప్పాలంటూ చిరంజీవి అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల ఆమె దిష్టిబొమ్మలూ దహనం చేస్తున్నారు. పవన్ కల్యాణ్పై ఎన్ని విమర్శలు చేసినా ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉండడంతో అదేమీ ఇబ్బందికరం కాకపోయినా ఇప్పుడు చిరంజీవిని సీన్లోకి లాగడంతో రోజాపై వ్యతిరేకత కనిపిస్తోంది.
వైసీపీ నేతలు కూడా కొందరు రోజా అనవసరంగా చిరంజీవి ప్రస్తావన తెచ్చారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాజకీయంగా కాపులను పూర్తిగా దూరం చేసుకోవాలంటేనే చిరంజీవిని టార్గెట్ చేయాలని… ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యల వల్ల అలాంటి పరిస్థితే వస్తుందని వైసీపీలోని కాపునేతలు కొందరు అన్నట్లు సమాచారం.
This post was last modified on January 8, 2023 9:49 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…