Political News

వైసీపీ ఎమ్మెల్యేకి ‘మేము సైకిల్ గుర్తుకే ఓటేస్తాం’ అని చెప్పిన మహిళలు

అనేక‌ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నాం.. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా అమ‌లు చేస్తున్నాం.. సో.. జ‌నం నోట జ‌గ‌న్ మాటే వినిపిస్తుంది.. వినిపిస్తోంద‌ని ప‌దే ప‌దే చెప్పే వైసీపీ నాయ‌కుల‌కు శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌లు భారీషాక్ ఇచ్చారు. ‘మేము సైకిల్ గుర్తుకే ఓటేస్తాం’ అని వైసీపీ ఎమ్మెల్యే ఎదుట సిక్కోలు మహిళలు తేల్చిచెప్పారు. దీంతో నిర్ఘాంత పోయిన స‌ద‌రు ఎమ్మెల్యే మౌనంగా అక్క‌డ నుంచి నిష్క్ర‌మించారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

‘గడపగడపకూ మ‌న‌ ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తాజాగా శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వెంకయ్యపేటలో పర్యటించారు. ఆయన గ్రామంలోకి అడుగిడగానే సమస్యలు స్వాగతం పలికాయి. రోడ్లు, కాలువలు నిర్మించాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా తీస్తుండగా ‘పండగపూట పప్పన్నం తినొద్దా! ఒట్టి బియ్యమే తింటామా? తెలుగుదేశం హాయాంలో పండగపూట పప్పుదినుసులు ఇచ్చేవారు’ అని కొందరు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అద్దంకి ఆదెమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కిర‌ణ్‌ ప్రభుత్వ పథకాలు వివరించి ఎవరికి ఓటు వేస్తారని అడిగారు. దీంతో ఆదెమ్మ “నేను సైకిల్ గుర్తుకే ఓటు వేస్తా” అని చెప్పడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. అక్కడే ఉన్న మ‌రికొంద‌రు మ‌హిళ‌లు మాత కాంతమ్మ, కొండపల్లి శాంతమ్మ కూడా తాము కూడా సైకిల్‌కు ఓటు వేస్తానని చెప్పడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి వలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఇదేనయ్యా మీరు ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకువెళ్లిన తీరు.. అసలు మీరేమి చేసు న్నారు? కనీసం యాభై గృహాల వారికి కూడా అవగాహన కల్పించలేరా? ఇందుకా ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది. తీరు మార్చుకోకపోతే వలంటీర్ల బాధ్యతల నుంచి తీసివేస్తాం’ అని హెచ్చరించారు. మనం పథకాలు ఇస్తే గ్రామస్థుల నోట సైకిల్ అనే మాట రావడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోసం వలంటీర్లు పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

This post was last modified on January 7, 2023 9:09 pm

Share

Recent Posts

వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…

43 minutes ago

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…

57 minutes ago

నయనతార నిర్ణయాలు అందుకే కరెక్ట్

టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…

1 hour ago

ఏష నాగుల కట్ట… కలెక్షన్లు తెచ్చే మూట

ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…

3 hours ago

భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌,…

3 hours ago

మజ్లిస్ నుంచి ఎమ్మెల్సీ సస్పెండ్, కారణం అదేనా?

హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…

4 hours ago