Political News

అంత టెన్ష‌న్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ అంత్యాక్ష‌రి

దేశ‌మంతా క‌రోనా చ‌ర్చ‌ల్లో మునిగిపోయి ఉంటే.. రాజ‌స్థాన్‌లో మాత్రం రాజ‌కీయ వేడి రాజుకుంది. అశోక్ గెహ్లాత్ స‌ర్కారుపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ వ‌ర్గం.. ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే.

స‌చిన్ వైపు 30 మంది దాకా ఎమ్మెల్యేలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. ఇటీవ‌ల మీడియా ముందు 104 మందితో ప‌రేడ్ నిర్వ‌హించి త‌న ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని చాటుకున్నాడు గెహ్లాత్. అనంతరం పైల‌ట్‌ను ఉప ముఖ్య‌మంత్రిగా తొల‌గిస్తూ నిర్ణ‌యం కూడా తీసుకున్నాడాయ‌న‌.

ఆ ప‌రేడ్ తర్వాత గెహ్లాత్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంద‌రినీ ‌శిబిరానికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఓ స్టార్ హోటల్లో వీళ్లంద‌రికీ బ‌స క‌ల్పించి.. స‌క‌ల వ‌స‌తులూ క‌ల్పించిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌తో చేతులు క‌ల‌ప‌కుండా వారిఫోన్ క‌నెక్ష‌న్లు కూడా క‌ట్ చేశారంటున్నారు. ఐతే ఆ ఎమ్మెల్యేలు బ‌స చేసిన హోట‌ల్ నుంచి తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన ఓ వీడియో ఇంట‌ర్నెట్లో వైర‌ల్ అవుతోంది.

బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు బోర్ కొట్టి అంత్యాక్ష‌రి ఆడుకుంటున్న వీడియో అది. సోఫాల‌పై ఆసీనులైన ఎమ్మెల్యేలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పాట‌లు పాడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రాజ‌కీయంగా రాజ‌స్థాన్‌లో అంత ఉత్కంఠ‌భ‌రిత వాతావ‌ర‌ణ నెల‌కొంటే.. ఎమ్మెల్యేలు ఇంత తాపీగా అంత్యాక్ష‌రి పాడుకుంటున్నారేంటా అని జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారీ వీడియో చూసి.

This post was last modified on July 20, 2020 9:59 am

Share

Recent Posts

రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…

10 minutes ago

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

2 hours ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

2 hours ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

2 hours ago

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

3 hours ago

సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

3 hours ago