దేశమంతా కరోనా చర్చల్లో మునిగిపోయి ఉంటే.. రాజస్థాన్లో మాత్రం రాజకీయ వేడి రాజుకుంది. అశోక్ గెహ్లాత్ సర్కారుపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం.. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కలిసి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.
సచిన్ వైపు 30 మంది దాకా ఎమ్మెల్యేలున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. ఇటీవల మీడియా ముందు 104 మందితో పరేడ్ నిర్వహించి తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని చాటుకున్నాడు గెహ్లాత్. అనంతరం పైలట్ను ఉప ముఖ్యమంత్రిగా తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నాడాయన.
ఆ పరేడ్ తర్వాత గెహ్లాత్కు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ శిబిరానికి తరలించిన సంగతి తెలిసిందే. ఓ స్టార్ హోటల్లో వీళ్లందరికీ బస కల్పించి.. సకల వసతులూ కల్పించినట్లు చెబుతున్నారు. ప్రత్యర్థులతో చేతులు కలపకుండా వారిఫోన్ కనెక్షన్లు కూడా కట్ చేశారంటున్నారు. ఐతే ఆ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ నుంచి తాజాగా బయటికి వచ్చిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు బోర్ కొట్టి అంత్యాక్షరి ఆడుకుంటున్న వీడియో అది. సోఫాలపై ఆసీనులైన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాజకీయంగా రాజస్థాన్లో అంత ఉత్కంఠభరిత వాతావరణ నెలకొంటే.. ఎమ్మెల్యేలు ఇంత తాపీగా అంత్యాక్షరి పాడుకుంటున్నారేంటా అని జనాలు ఆశ్చర్యపోతున్నారీ వీడియో చూసి.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…