Political News

అంత టెన్ష‌న్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ అంత్యాక్ష‌రి

దేశ‌మంతా క‌రోనా చ‌ర్చ‌ల్లో మునిగిపోయి ఉంటే.. రాజ‌స్థాన్‌లో మాత్రం రాజ‌కీయ వేడి రాజుకుంది. అశోక్ గెహ్లాత్ స‌ర్కారుపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ వ‌ర్గం.. ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే.

స‌చిన్ వైపు 30 మంది దాకా ఎమ్మెల్యేలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. ఇటీవ‌ల మీడియా ముందు 104 మందితో ప‌రేడ్ నిర్వ‌హించి త‌న ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని చాటుకున్నాడు గెహ్లాత్. అనంతరం పైల‌ట్‌ను ఉప ముఖ్య‌మంత్రిగా తొల‌గిస్తూ నిర్ణ‌యం కూడా తీసుకున్నాడాయ‌న‌.

ఆ ప‌రేడ్ తర్వాత గెహ్లాత్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంద‌రినీ ‌శిబిరానికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఓ స్టార్ హోటల్లో వీళ్లంద‌రికీ బ‌స క‌ల్పించి.. స‌క‌ల వ‌స‌తులూ క‌ల్పించిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌తో చేతులు క‌ల‌ప‌కుండా వారిఫోన్ క‌నెక్ష‌న్లు కూడా క‌ట్ చేశారంటున్నారు. ఐతే ఆ ఎమ్మెల్యేలు బ‌స చేసిన హోట‌ల్ నుంచి తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన ఓ వీడియో ఇంట‌ర్నెట్లో వైర‌ల్ అవుతోంది.

బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు బోర్ కొట్టి అంత్యాక్ష‌రి ఆడుకుంటున్న వీడియో అది. సోఫాల‌పై ఆసీనులైన ఎమ్మెల్యేలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పాట‌లు పాడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రాజ‌కీయంగా రాజ‌స్థాన్‌లో అంత ఉత్కంఠ‌భ‌రిత వాతావ‌ర‌ణ నెల‌కొంటే.. ఎమ్మెల్యేలు ఇంత తాపీగా అంత్యాక్ష‌రి పాడుకుంటున్నారేంటా అని జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారీ వీడియో చూసి.

This post was last modified on July 20, 2020 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago