దేశమంతా కరోనా చర్చల్లో మునిగిపోయి ఉంటే.. రాజస్థాన్లో మాత్రం రాజకీయ వేడి రాజుకుంది. అశోక్ గెహ్లాత్ సర్కారుపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం.. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కలిసి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.
సచిన్ వైపు 30 మంది దాకా ఎమ్మెల్యేలున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. ఇటీవల మీడియా ముందు 104 మందితో పరేడ్ నిర్వహించి తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని చాటుకున్నాడు గెహ్లాత్. అనంతరం పైలట్ను ఉప ముఖ్యమంత్రిగా తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నాడాయన.
ఆ పరేడ్ తర్వాత గెహ్లాత్కు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ శిబిరానికి తరలించిన సంగతి తెలిసిందే. ఓ స్టార్ హోటల్లో వీళ్లందరికీ బస కల్పించి.. సకల వసతులూ కల్పించినట్లు చెబుతున్నారు. ప్రత్యర్థులతో చేతులు కలపకుండా వారిఫోన్ కనెక్షన్లు కూడా కట్ చేశారంటున్నారు. ఐతే ఆ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ నుంచి తాజాగా బయటికి వచ్చిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు బోర్ కొట్టి అంత్యాక్షరి ఆడుకుంటున్న వీడియో అది. సోఫాలపై ఆసీనులైన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాజకీయంగా రాజస్థాన్లో అంత ఉత్కంఠభరిత వాతావరణ నెలకొంటే.. ఎమ్మెల్యేలు ఇంత తాపీగా అంత్యాక్షరి పాడుకుంటున్నారేంటా అని జనాలు ఆశ్చర్యపోతున్నారీ వీడియో చూసి.
This post was last modified on July 20, 2020 9:59 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…