Political News

మారిన గేమ్ ప్లాన్.. టీడీపీ ఎదురుదాడి

టీడీపీ గేమ్ ప్లాన్ మార్చింది. అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ అన్న నిర్ణయానికి వచ్చింది. తొక్కిసలాట సంఘటనలను తొలుత దుర్ఘటనలుగా భావించిన టీడీపీ ఇప్పుడు అసలు సంగతి అర్థం చేసుకుని డైరెక్టుగా వైసీపీని అటాక్ చేస్తోంది..

చంద్రబాబు నాయుడు కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది చనిపోయారు. తక్షణమే స్పందించిన టీడీపీ అధినేత బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు భారీగా ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదని ఆవేదన చెందారు. జనాన్ని వారించేందుకు ప్రయత్నించే లోపే ప్రమాదం జరిగిపోయిందనుకున్నారు.

తర్వాత రెండు రోజులకే గుంటూరులో మరో సంఘటన జరిగింది. ఉయ్యూరు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుకల కార్యక్రమానికి చంద్రబాబు హాజరై వెళ్లిపోయిన కాసేపటికే తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు వదిలారు. రెండో ఘటన తర్వాత జరుగుతున్నదేమిటో టీడీపీ దృష్టికి వచ్చింది. ఈ దుర్ఘటనల వెనుక వైసీపీ కుళ్లు కుతంత్రాలు ఉన్నాయని టీడీపీకి బోధపడింది.

మొదటి దుర్ఘటన సమయంలోనే ఒకరిద్దరూ టీడీపీ సీనియర్ నేతలు వైసీపీపై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు లైట్ తీసుకున్నారు. రెండో ఘటన తర్వాతే విషయం ఆయనకు కూడా అర్థమైంది. పైగా అంతలోనే ఏమీ తెలియనట్లుగా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిందని గ్రహించారు.

దానితో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వైసీపీ బండారాన్ని బయటపెట్టేందుకు సిద్దమయ్యారు. కుప్పం మీటింగ్ వేదికగా వైసీపీ దుశ్చర్యలను ఎండగట్టారు. తమ మీటింగులను ఫెయిల్ చేయడానికి తమను బయటకు రాకుండా చూడటానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. ఆ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు, తాజాగా కుప్పం సంఘటనలని ఆయన విశ్లేషించారు. తొక్కిసలాటలు వైసీపీ పుణ్యమేనని ఆయన నర్మగర్భంగా వెల్లడించారు. తనను, తన పార్టీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారన్నారు….

నారా లోకేష్ కూడా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా.. వైసీపీపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. కోడికత్తి గాటు, బాబాయ్ గుండెపోటు డ్రామాల అనుభవంతో జగన్ తొక్కిసలాట స్కెచ్ వేశాడని లోకేష్ అన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షం అంటే జగన్ కు వణుకని, సైకో పాలన పోవాలని ఉద్యమిస్తున్న టీడీపీకి ప్రజా మద్దతు వెల్లువెత్తుతుంటే చూడలేకపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సభలు జనసంద్రాన్ని తలపిస్తుంటే తట్టుకోలేక తొక్కిసలాటను సృష్టించారని లోకేష్ ఆరోపించారు. దానితో ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోవడం వైసీపీ వంతయ్యింది..

This post was last modified on January 6, 2023 1:21 pm

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

4 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

4 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

5 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

6 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

6 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

8 hours ago