Political News

మారిన గేమ్ ప్లాన్.. టీడీపీ ఎదురుదాడి

టీడీపీ గేమ్ ప్లాన్ మార్చింది. అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ అన్న నిర్ణయానికి వచ్చింది. తొక్కిసలాట సంఘటనలను తొలుత దుర్ఘటనలుగా భావించిన టీడీపీ ఇప్పుడు అసలు సంగతి అర్థం చేసుకుని డైరెక్టుగా వైసీపీని అటాక్ చేస్తోంది..

చంద్రబాబు నాయుడు కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది చనిపోయారు. తక్షణమే స్పందించిన టీడీపీ అధినేత బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు భారీగా ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదని ఆవేదన చెందారు. జనాన్ని వారించేందుకు ప్రయత్నించే లోపే ప్రమాదం జరిగిపోయిందనుకున్నారు.

తర్వాత రెండు రోజులకే గుంటూరులో మరో సంఘటన జరిగింది. ఉయ్యూరు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుకల కార్యక్రమానికి చంద్రబాబు హాజరై వెళ్లిపోయిన కాసేపటికే తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు వదిలారు. రెండో ఘటన తర్వాత జరుగుతున్నదేమిటో టీడీపీ దృష్టికి వచ్చింది. ఈ దుర్ఘటనల వెనుక వైసీపీ కుళ్లు కుతంత్రాలు ఉన్నాయని టీడీపీకి బోధపడింది.

మొదటి దుర్ఘటన సమయంలోనే ఒకరిద్దరూ టీడీపీ సీనియర్ నేతలు వైసీపీపై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు లైట్ తీసుకున్నారు. రెండో ఘటన తర్వాతే విషయం ఆయనకు కూడా అర్థమైంది. పైగా అంతలోనే ఏమీ తెలియనట్లుగా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిందని గ్రహించారు.

దానితో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వైసీపీ బండారాన్ని బయటపెట్టేందుకు సిద్దమయ్యారు. కుప్పం మీటింగ్ వేదికగా వైసీపీ దుశ్చర్యలను ఎండగట్టారు. తమ మీటింగులను ఫెయిల్ చేయడానికి తమను బయటకు రాకుండా చూడటానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. ఆ కుట్రలో భాగమే కందుకూరు, గుంటూరు, తాజాగా కుప్పం సంఘటనలని ఆయన విశ్లేషించారు. తొక్కిసలాటలు వైసీపీ పుణ్యమేనని ఆయన నర్మగర్భంగా వెల్లడించారు. తనను, తన పార్టీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారన్నారు….

నారా లోకేష్ కూడా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా.. వైసీపీపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. కోడికత్తి గాటు, బాబాయ్ గుండెపోటు డ్రామాల అనుభవంతో జగన్ తొక్కిసలాట స్కెచ్ వేశాడని లోకేష్ అన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షం అంటే జగన్ కు వణుకని, సైకో పాలన పోవాలని ఉద్యమిస్తున్న టీడీపీకి ప్రజా మద్దతు వెల్లువెత్తుతుంటే చూడలేకపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సభలు జనసంద్రాన్ని తలపిస్తుంటే తట్టుకోలేక తొక్కిసలాటను సృష్టించారని లోకేష్ ఆరోపించారు. దానితో ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోవడం వైసీపీ వంతయ్యింది..

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

6 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

8 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

10 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

10 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

11 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

11 hours ago