Political News

దొంగగా మారిన ఏపీ కాంట్రాక్టర్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక తమ పంట పండినట్లే అనుకున్నారు ఆ పార్టీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లు. గతంలో వైఎస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా.. కాంట్రాక్టర్లు మామూలుగా సంపాదించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ, వైఎస్ సన్నిహితులు అప్పట్లో ఎంతో బాగుపడ్డారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ల ముఖాల్లో కళ పోయింది.

పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కించుకున్న బడా బాబులకే ఢోకా లేకపోయింది కానీ.. చిన్న, మీడియం రేంజి కాంట్రాక్టర్ల పరిస్థితే దయనీయంగా మారింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు దక్కించుకుని.. చేతి నుంచి డబ్బులు పెట్టుకుని ఉత్సాహంగా పనులైతే చేసేశారు కానీ.. ఆ తర్వాత బిల్లుల కోసం నెలలు, ఏళ్లు ఎదురు చూస్తూ దయనీయమైన స్థితికి చేరుతున్నారు కాంట్రాక్టర్లు. 2019, 2020ల్లో చేసిన పనులకు కూడా బిల్లులు రాక ఇంకా ఇబ్బంది పడుతున్నవాళ్లున్నారు.

ఇలాగే ఒక కాంట్రాక్టర్ తాను చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు రాక దొంగగా మారిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఒంగోలు జిల్లాకు చెందిన ఆ కాంట్రాక్టర్ పేరు క్రాంతి కిరణ్. ఆర్అండ్‌బీలో కాంట్రాక్టరుగా పని చేసే క్రాంతి కిరణ్.. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కాంట్రాక్టర్ అయ్యాడు. అతను చేసిన రూ.2.70 కోట్ల పనులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర బిల్లులు ఆగిపోయాయి. అవి ఎంతకీ రాకపోవడం అప్పులపాలయ్యాడు. అప్పులవాళ్ల గొడవ ఎక్కువైపోవడంతో ఏం చేయాలో పాలుపోక దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నాడు.

తన మేనత్త ఇంట్లోనే అతను దొంగతనానికి పాల్పడడం గమనార్హం. ఒంగోలులోని దేవుడు చెరువు ప్రాంతంలోనే మేనత్త ఇంట్లో నాలుగు రోజుల కిందట రూ.52.5 లక్షలు దోచుకెళ్లాడు. ముందు ఎవరో బయటి వాళ్లే ఈ పని చేశారనుకున్నారు. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అందులో కనిపించిన ఒక కారు ఆధారంగా కూపీ లాగితే క్రాంతి కిరణే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల దుస్థితికి ఈ ఉదంతం నిదర్శనం అంటూ జగన్ సర్కారును తూర్పారబడుతున్నారు నెటిజన్లు.

This post was last modified on January 5, 2023 7:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

3 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

3 hours ago

స్లమ్ డాగ్ మేలుకుంటే బాగుండేది

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…

9 hours ago

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…

11 hours ago

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…

11 hours ago

అలాంటి మ్యాజిక్.. ఇంకోసారి సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…

12 hours ago