Political News

ఏపీలో వ‌లంటీర్ల వేత‌నం 15 వేలు.. మంత్రి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వానికి అన్నీ తామై వ్య‌వ‌హ‌రిస్తున్న వ‌లంటీర్ల విష‌యంలో అమ‌లాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపే విశ్వ‌రూప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం వారికి ఇస్తున్న రూ.5000ల‌ను త్వ‌ర‌లోనే 15000కు పెంచుతామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. దీనికి ఆయ‌న ఒక కండిష‌న్ పెట్టారు. ఆ కండిష‌న్‌ను వ‌లంటీర్లు నెర‌వేర్చితే.. ఖ‌చ్చితంగా వారి వేత‌నం మూడు రెట్లు అవుతుంద‌ని చెప్పారు.

ఇంత‌కీ ఆ కండిష‌న్ ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో వైసీపీ ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి ఏర్పాటు చేసేలా .. వ‌లంటీర్లు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌నిచేయాల‌నేది ఆయ‌న చెప్పిన కండిష‌న్‌. “వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే వైనాట్ -175 నినాదం ఇచ్చారు. దీనికి అనుగుణంగా.. వ‌లంటీర్లు ప‌నిచేయాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ జెండానే క‌నిపించాలి. రెప‌రెప‌లాడించాలి. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. వైసీపీనే విజ‌యం ద‌క్కించుకోవాలి. అప్పుడు వలంటీర్ల‌కు 15వేల వేతనం చేస్తాం” అని చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి వ‌లంటీర్ల‌కు ఇప్పుడు రూ.5000 గౌర‌వ వేత‌నంగా ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తి ఉగాది పండుగ రోజున వారికి గిఫ్టులు, బిరుదులు, స‌త్కారాలు చేస్తున్నారు. అయితే..పెరుగుత‌న్న ధ‌ర‌లు.. కుటుంబ బాధ్య‌త‌ల నేప‌థ్యంలో వ‌లంటీర్లు త‌మ వేత‌నాల‌ను పెంచాల‌ని ఎప్ప‌టి న‌నుంచో కోరుతున్నారు. ఈ క్ర‌మంలో ఒకానొక ద‌శ‌లో ఉద్య‌మం కూడా చేశారు. అయితే.. ప్ర‌భుత్వం వారికి పెంచేందుకు నిరాక‌రించింది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఎన్నిక‌ల‌ను అడ్డు పెట్టుకుని వ‌లంటీర్ల‌కు తాయిలం ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 5, 2023 1:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

58 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago