ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవహరిస్తున్న వలంటీర్ల విషయంలో అమలాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపే విశ్వరూప్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం వారికి ఇస్తున్న రూ.5000లను త్వరలోనే 15000కు పెంచుతామని ఆయన చెప్పారు. అయితే.. దీనికి ఆయన ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ను వలంటీర్లు నెరవేర్చితే.. ఖచ్చితంగా వారి వేతనం మూడు రెట్లు అవుతుందని చెప్పారు.
ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేసేలా .. వలంటీర్లు శక్తి వంచన లేకుండా పనిచేయాలనేది ఆయన చెప్పిన కండిషన్. “వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇప్పటికే వైనాట్ -175 నినాదం ఇచ్చారు. దీనికి అనుగుణంగా.. వలంటీర్లు పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ జెండానే కనిపించాలి. రెపరెపలాడించాలి. అన్ని నియోజకవర్గాల్లోనూ.. వైసీపీనే విజయం దక్కించుకోవాలి. అప్పుడు వలంటీర్లకు 15వేల వేతనం చేస్తాం” అని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి వలంటీర్లకు ఇప్పుడు రూ.5000 గౌరవ వేతనంగా ఇస్తున్నారు. అదేసమయంలో ప్రతి ఉగాది పండుగ రోజున వారికి గిఫ్టులు, బిరుదులు, సత్కారాలు చేస్తున్నారు. అయితే..పెరుగుతన్న ధరలు.. కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వలంటీర్లు తమ వేతనాలను పెంచాలని ఎప్పటి ననుంచో కోరుతున్నారు. ఈ క్రమంలో ఒకానొక దశలో ఉద్యమం కూడా చేశారు. అయితే.. ప్రభుత్వం వారికి పెంచేందుకు నిరాకరించింది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికలను అడ్డు పెట్టుకుని వలంటీర్లకు తాయిలం ప్రకటించడం గమనార్హం.
This post was last modified on January 5, 2023 1:31 pm
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…