Political News

ఆనం టీడీపీలో చేరుతున్నారా ?

వైసీపీలో అవమానాలు ఎదుర్కొంటున్న ఆనం రామ నారాయణ రెడ్డి.. టీడీపీ వైపు చూస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ సొంత ప్రభుత్వాన్నే ఇరుకునపెట్టిన ఆయన్ను వెంకటగిరి ఇన్ ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా ఆయనకు వ్యతిరేకమయ్యారు. పార్టీలో ఏకాకిగా మారిన ఆనం ..ఇప్పుడు పచ్చ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

నెల్లూరు రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆనం కుటుంబం మొదటి నుంచి వేర్వేరు పార్టీల్లో ఉంటూ వచ్చింది. కాంగ్రెస్లో, టీడీపీలో మంత్రిగా చేసిన ఆనం రామనారాయణ రెడ్డి.. 2018లో వైసీపీ కండువా కప్పుకున్నారు. తన మనసులో పడిన మాట చెప్పే అలవాటున్న ఆనం…. సొంత ప్రభుత్వంపైనే కొంతకాలంగా విమర్శలు మొదలు పెట్టారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆనం ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సాంకేతిక కారణాలా లేదా బిల్లుల చెల్లింపు జాప్యమా అనేది తెలియాల్సి ఉందన్నారు. . సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు.కార్యాలయాలు లేకపోతే సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చుని పనిచేయాలని ప్రశ్నించారు.

ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన పలు పర్యాయాలు ఆరోపించారు.ముందస్తు ఎన్నికలపైనా ఆయన నెగిటివ్ కామెంట్ చేశారు. ముందస్తు వస్తుందని అంటున్నారని అదే జరిగితే తామందరం ఓడి పోవడం ఖాయమని ఆనం విశ్లేషించారు. దీనితో వైఎస్ జగన్ కు బాగా కోపమొచ్చింది. తొలి దెబ్బగా వెంకటగిరి ఇన్ ఛార్జ్ పదవి నుంచి ఆనంను తొలగించారు. ఆ బాధ్యతలను నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అప్పగించారు. అదో తీరని అవమానమని నెల్లూరు జిల్లా రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఆనంకు టికెట్ లేనట్టేనని చెబుతున్నారు..

ముందే మాట్లాడుకున్నారా… !

ఆనం త్వరలోనే టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ వర్గాలు కూడా ఇదే వాదనను ధృవ పరుస్తున్నాయి. చంద్రబాబుతో ముందే మాట్లాడుకుని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే ఆనం డైలాగులు వదులుతున్నారని వైసీపీ అనుమానిస్తోంది. పైగా ఆనం కుటుంబంలో కొంతమంది టీడీపీలో ఉన్నారు. వారే పార్టీ అధిష్టానంతో రాయబారం చేసి ఆనంకు లైన్ క్లియర్ చేశారని అంటున్నారు. మరి ఆనం ఇప్పుడు చేరతారా.. ఎన్నికలు ప్రకటించిన తర్వాత టీడీపీలోకి వెళతారా అన్నది చూడాలి…

This post was last modified on January 4, 2023 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

2 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

4 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

5 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

6 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

7 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

7 hours ago