వైసీపీలో అవమానాలు ఎదుర్కొంటున్న ఆనం రామ నారాయణ రెడ్డి.. టీడీపీ వైపు చూస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ సొంత ప్రభుత్వాన్నే ఇరుకునపెట్టిన ఆయన్ను వెంకటగిరి ఇన్ ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా ఆయనకు వ్యతిరేకమయ్యారు. పార్టీలో ఏకాకిగా మారిన ఆనం ..ఇప్పుడు పచ్చ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
నెల్లూరు రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆనం కుటుంబం మొదటి నుంచి వేర్వేరు పార్టీల్లో ఉంటూ వచ్చింది. కాంగ్రెస్లో, టీడీపీలో మంత్రిగా చేసిన ఆనం రామనారాయణ రెడ్డి.. 2018లో వైసీపీ కండువా కప్పుకున్నారు. తన మనసులో పడిన మాట చెప్పే అలవాటున్న ఆనం…. సొంత ప్రభుత్వంపైనే కొంతకాలంగా విమర్శలు మొదలు పెట్టారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆనం ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సాంకేతిక కారణాలా లేదా బిల్లుల చెల్లింపు జాప్యమా అనేది తెలియాల్సి ఉందన్నారు. . సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు.కార్యాలయాలు లేకపోతే సచివాలయ సిబ్బంది ఎక్కడ కూర్చుని పనిచేయాలని ప్రశ్నించారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన పలు పర్యాయాలు ఆరోపించారు.ముందస్తు ఎన్నికలపైనా ఆయన నెగిటివ్ కామెంట్ చేశారు. ముందస్తు వస్తుందని అంటున్నారని అదే జరిగితే తామందరం ఓడి పోవడం ఖాయమని ఆనం విశ్లేషించారు. దీనితో వైఎస్ జగన్ కు బాగా కోపమొచ్చింది. తొలి దెబ్బగా వెంకటగిరి ఇన్ ఛార్జ్ పదవి నుంచి ఆనంను తొలగించారు. ఆ బాధ్యతలను నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అప్పగించారు. అదో తీరని అవమానమని నెల్లూరు జిల్లా రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఆనంకు టికెట్ లేనట్టేనని చెబుతున్నారు..
ముందే మాట్లాడుకున్నారా… !
ఆనం త్వరలోనే టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ వర్గాలు కూడా ఇదే వాదనను ధృవ పరుస్తున్నాయి. చంద్రబాబుతో ముందే మాట్లాడుకుని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే ఆనం డైలాగులు వదులుతున్నారని వైసీపీ అనుమానిస్తోంది. పైగా ఆనం కుటుంబంలో కొంతమంది టీడీపీలో ఉన్నారు. వారే పార్టీ అధిష్టానంతో రాయబారం చేసి ఆనంకు లైన్ క్లియర్ చేశారని అంటున్నారు. మరి ఆనం ఇప్పుడు చేరతారా.. ఎన్నికలు ప్రకటించిన తర్వాత టీడీపీలోకి వెళతారా అన్నది చూడాలి…
This post was last modified on January 4, 2023 9:29 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…