ఇటీవల గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ అనే సంస్థ పేదలకు చంద్రన్న సంక్రాంతి కానుకలు, జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి.. ముగ్గురు మహిళలు చనిపోయారు. అదేసమయంలో మరికొందరు కూడా గాయపడ్డారు. అయితే.. ఈ విషయంపై రాజకీయ దుమారం రేగింది. వైసీపీ నేతలు.. చంద్రబాబు, టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇక, పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఉయ్యూరు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఎన్నారై.. ఉయ్యూరు శ్రీనివాసరావుపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అయితే.. కోర్టు ఆయనను జైలుకు తరలించేందుకు నిరా కరించింది. ఇదిలావుంటే.. ఈ విషయంపై ఇరు పార్టీలు ఘర్షణకు దిగిన నేపథ్యంలో వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదు. ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు, ప్రవాసాంధ్రుల వలన దేశానికి మంచి జరుగుతుంది. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి. ప్రజలకు నష్టం జరగాలని ఇలాంటి కార్యక్రమాన్ని చేయరు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టి శ్రీనివాస్ పై ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలు చేయడం మంచిపని, ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్ లో ప్రవాసాంధ్రుల మనకి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకి రారు అని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ఇతర రాజకీయవర్గాల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, ఇప్పుడు సొంత పార్టీ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on January 4, 2023 12:21 pm
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…