Political News

ఉయ్యూరు నాకు మంచి మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే సంచ‌న‌ల వ్యాఖ్య‌లు

ఇటీవ‌ల గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ అనే సంస్థ పేద‌ల‌కు చంద్ర‌న్న సంక్రాంతి కానుక‌లు, జ‌న‌తా వ‌స్త్రాల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగి.. ముగ్గురు మ‌హిళ‌లు చ‌నిపోయారు. అదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు కూడా గాయ‌ప‌డ్డారు. అయితే.. ఈ విష‌యంపై రాజ‌కీయ దుమారం రేగింది. వైసీపీ నేత‌లు.. చంద్ర‌బాబు, టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, పోలీసులు కేసు కూడా న‌మోదు చేశారు. ఉయ్యూరు ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు, ఎన్నారై.. ఉయ్యూరు శ్రీనివాస‌రావుపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అయితే.. కోర్టు ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించేందుకు నిరా క‌రించింది. ఇదిలావుంటే.. ఈ విష‌యంపై ఇరు పార్టీలు ఘ‌ర్ష‌ణ‌కు దిగిన నేప‌థ్యంలో వైసీపీ నేత‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదు. ఉయ్యూరు శ్రీనివాస్ నాకు మంచి మిత్రుడు, ప్రవాసాంధ్రుల వలన దేశానికి మంచి జరుగుతుంది. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి. ప్రజలకు నష్టం జరగాలని ఇలాంటి కార్యక్రమాన్ని చేయరు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టి శ్రీనివాస్ పై ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలు చేయడం మంచిపని, ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్ లో ప్రవాసాంధ్రుల మనకి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకి రారు అని వ్యాఖ్యానించారు.

వాస్త‌వానికి ఇత‌ర రాజ‌కీయ‌వ‌ర్గాల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్త‌మ‌వుతోంది. ఇక‌, ఇప్పుడు సొంత పార్టీ నాయ‌కులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

2 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

2 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

2 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

2 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

3 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

3 hours ago