Political News

ఉద్యోగులకు జీతాల్లేవు కానీ జగన్‌కు 19 హైఎండ్ కొత్త కార్లు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎవరినడిగినా చెప్పేది ఒకటే… ఉద్యోగులకు జీతాలు లేవు.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు లేవు.. పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు… అభివృద్ధి పనులకు నిధులు లేవు.. సంక్షేమ పథకాలలో కోతలు.. అంటూ పెద్ద లిస్టే వినిపిస్తున్నారు. అంత ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రికి మాత్రం ఇప్పుడు కొత్తగా 19 అధునాతన కార్లు కొంటున్నారని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం టయోటా ఫార్చ్యూనర్ కార్లు కొత్తగా కొన్నది. మొత్తం 19 హైఎండ్ కార్లు కొని వాటిని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చుతోంది. కార్ల కొనుగోలు, బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చడానికి మొత్తంగా రూ. 15 కోట్లకు పైనే ఖర్చవుతుందని చెప్తున్నారు.

నిజానికి జగన్ సీఎం కాగానే ఆయన కోసం 6 కొత్త కార్లు కొన్నారు. తాడేపల్లి ప్రాంతంలో తిరగడానికి, జిల్లాల పర్యటనకు, ఆయన దిల్లీ పర్యటనలలో వాడడానికి వేర్వేరుగా కార్లు కొని పెట్టారు. అవన్నీ ఉండగా ఇప్పుడు ఏకంగా 19 కార్లు కొనడం చర్చకు దారితీస్తోంది.

ప్రభుత్వం కొత్తగా కొన్న 19 కార్లు ఎవరి కోసం.. ఎందుకోసం అనే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రతిపక్షాలు మాత్రం ఇవన్నీ సీఎం కాన్వాయ్‌గా వాడడానికే అని విమర్శిస్తున్నాయి. ఉద్యోగులు కూడా తమకు జీతాలు వేయడానికి డబ్బులు లేవు కానీ సీఎం కాన్వాయ్ కోసం కార్లు కొనడానికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.

ఏప్రిల్ నెల తరువాత జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారన్న ప్రచారం కూడా ఒకటి వినిపిస్తుండడంతో ఆయన ఎన్నికలకు ముందు నియోజకవర్గాలలో పర్యటించే ప్లాన్లో ఉన్నారని.. అందుకోసమే ఈ హెవీ కాన్వాయ్ సిద్ధం చేస్తున్నారని వినిపిస్తోంది. టీడీపీ నేత లోకేశ్ పాదయాత్ర.. జనసేన నేత పవన్ కల్యాణ్ తన వాహనం వారాహితో యాత్ర చేయనుండగా… జగన్ కూడా భారీ కాన్వాయ్‌తో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది.

This post was last modified on January 3, 2023 3:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

20 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago