ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎవరినడిగినా చెప్పేది ఒకటే… ఉద్యోగులకు జీతాలు లేవు.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు లేవు.. పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు… అభివృద్ధి పనులకు నిధులు లేవు.. సంక్షేమ పథకాలలో కోతలు.. అంటూ పెద్ద లిస్టే వినిపిస్తున్నారు. అంత ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి మాత్రం ఇప్పుడు కొత్తగా 19 అధునాతన కార్లు కొంటున్నారని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం టయోటా ఫార్చ్యూనర్ కార్లు కొత్తగా కొన్నది. మొత్తం 19 హైఎండ్ కార్లు కొని వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చుతోంది. కార్ల కొనుగోలు, బుల్లెట్ ప్రూఫ్గా మార్చడానికి మొత్తంగా రూ. 15 కోట్లకు పైనే ఖర్చవుతుందని చెప్తున్నారు.
నిజానికి జగన్ సీఎం కాగానే ఆయన కోసం 6 కొత్త కార్లు కొన్నారు. తాడేపల్లి ప్రాంతంలో తిరగడానికి, జిల్లాల పర్యటనకు, ఆయన దిల్లీ పర్యటనలలో వాడడానికి వేర్వేరుగా కార్లు కొని పెట్టారు. అవన్నీ ఉండగా ఇప్పుడు ఏకంగా 19 కార్లు కొనడం చర్చకు దారితీస్తోంది.
ప్రభుత్వం కొత్తగా కొన్న 19 కార్లు ఎవరి కోసం.. ఎందుకోసం అనే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రతిపక్షాలు మాత్రం ఇవన్నీ సీఎం కాన్వాయ్గా వాడడానికే అని విమర్శిస్తున్నాయి. ఉద్యోగులు కూడా తమకు జీతాలు వేయడానికి డబ్బులు లేవు కానీ సీఎం కాన్వాయ్ కోసం కార్లు కొనడానికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
ఏప్రిల్ నెల తరువాత జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారన్న ప్రచారం కూడా ఒకటి వినిపిస్తుండడంతో ఆయన ఎన్నికలకు ముందు నియోజకవర్గాలలో పర్యటించే ప్లాన్లో ఉన్నారని.. అందుకోసమే ఈ హెవీ కాన్వాయ్ సిద్ధం చేస్తున్నారని వినిపిస్తోంది. టీడీపీ నేత లోకేశ్ పాదయాత్ర.. జనసేన నేత పవన్ కల్యాణ్ తన వాహనం వారాహితో యాత్ర చేయనుండగా… జగన్ కూడా భారీ కాన్వాయ్తో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది.
This post was last modified on January 3, 2023 3:29 pm
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని…