Political News

ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎన్నో తెలుసా?


ఒక్క రోజులో వెయ్యి క‌రోనా కేసుల‌ట‌. గ‌త నెల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసుల‌కు పైగా వ‌చ్చాయంటే క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయంటే తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించే విష‌యం.

తెలంగాణ‌లో క‌రోనా బులిటెన్ రోజూ రాత్రి ఇస్తే.. ఏపీలో ఉద‌య‌మే బులిటెన్ రిలీజ్ చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ ఆదివారం మాత్రం మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం దాకా బులిటెన్ ఇవ్వ‌లేదు. దీంతో ఉత్కంఠ నెల‌కొంది. చివ‌రికి రాత్రి 7 గంట‌ల‌కు బులిటెన్ రిలీజ్ చేశారు. అందులో క‌రోనా కేసుల గ‌ణాంకాలు చూసి అంతా షాకైపోయారు.

గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 5041 కొత్త క‌రోనా కేసులు బ‌య‌ట ప‌డిన‌ట్లు ఇందులో వెల్ల‌డించారు. కాక‌పోతే టెస్టుల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉండ‌టం కొంచెం ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం. 31 వేల‌కు పైగా శాంపిల్స్ తీస్తే అందులో 5041 మందికి క‌రోనా ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. అలా చూసినా 20 శాతం దాకా పాజిటివ్ రేటు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే.

శ‌నివారం 4 వేల మార్కుకు ద‌గ్గ‌ర క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఒక్క తూర్పుగోదావ‌రిలోనే 1000కి చేరువగా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఆదివారం ఆ జిల్లాలో 647 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఒక్క జిల్లాలోనే 10 మంది మ‌ర‌ణించారు. శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురి చొప్పున ప్రాణాలు వ‌దిలారు. సౌత్ ఇండియాలో ఒక్క రోజులో 5 వేల కేసులు న‌మోదైన తొలి రాష్ట్రం ఏపీనే కావ‌డం గ‌మ‌నార్హం

This post was last modified on July 19, 2020 9:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

3 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

4 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

4 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

5 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

6 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

6 hours ago