Political News

ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎన్నో తెలుసా?


ఒక్క రోజులో వెయ్యి క‌రోనా కేసుల‌ట‌. గ‌త నెల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసుల‌కు పైగా వ‌చ్చాయంటే క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయంటే తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించే విష‌యం.

తెలంగాణ‌లో క‌రోనా బులిటెన్ రోజూ రాత్రి ఇస్తే.. ఏపీలో ఉద‌య‌మే బులిటెన్ రిలీజ్ చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ ఆదివారం మాత్రం మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం దాకా బులిటెన్ ఇవ్వ‌లేదు. దీంతో ఉత్కంఠ నెల‌కొంది. చివ‌రికి రాత్రి 7 గంట‌ల‌కు బులిటెన్ రిలీజ్ చేశారు. అందులో క‌రోనా కేసుల గ‌ణాంకాలు చూసి అంతా షాకైపోయారు.

గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 5041 కొత్త క‌రోనా కేసులు బ‌య‌ట ప‌డిన‌ట్లు ఇందులో వెల్ల‌డించారు. కాక‌పోతే టెస్టుల సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉండ‌టం కొంచెం ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం. 31 వేల‌కు పైగా శాంపిల్స్ తీస్తే అందులో 5041 మందికి క‌రోనా ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. అలా చూసినా 20 శాతం దాకా పాజిటివ్ రేటు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే.

శ‌నివారం 4 వేల మార్కుకు ద‌గ్గ‌ర క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఒక్క తూర్పుగోదావ‌రిలోనే 1000కి చేరువగా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఆదివారం ఆ జిల్లాలో 647 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఒక్క జిల్లాలోనే 10 మంది మ‌ర‌ణించారు. శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురి చొప్పున ప్రాణాలు వ‌దిలారు. సౌత్ ఇండియాలో ఒక్క రోజులో 5 వేల కేసులు న‌మోదైన తొలి రాష్ట్రం ఏపీనే కావ‌డం గ‌మ‌నార్హం

This post was last modified on July 19, 2020 9:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

54 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago