ఒక్క రోజులో వెయ్యి కరోనా కేసులట. గత నెలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసులకు పైగా వచ్చాయంటే కరోనా కేసులు బయటపడ్డాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగించే విషయం.
తెలంగాణలో కరోనా బులిటెన్ రోజూ రాత్రి ఇస్తే.. ఏపీలో ఉదయమే బులిటెన్ రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ ఆదివారం మాత్రం మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం దాకా బులిటెన్ ఇవ్వలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి రాత్రి 7 గంటలకు బులిటెన్ రిలీజ్ చేశారు. అందులో కరోనా కేసుల గణాంకాలు చూసి అంతా షాకైపోయారు.
గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 5041 కొత్త కరోనా కేసులు బయట పడినట్లు ఇందులో వెల్లడించారు. కాకపోతే టెస్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం కొంచెం ఉపశమనం కలిగించే విషయం. 31 వేలకు పైగా శాంపిల్స్ తీస్తే అందులో 5041 మందికి కరోనా ఉన్నట్లు వెల్లడైంది. అలా చూసినా 20 శాతం దాకా పాజిటివ్ రేటు ఉండటం ఆందోళన కలిగించే విషయమే.
శనివారం 4 వేల మార్కుకు దగ్గర కరోనా కేసులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఒక్క తూర్పుగోదావరిలోనే 1000కి చేరువగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఆ జిల్లాలో 647 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఒక్క జిల్లాలోనే 10 మంది మరణించారు. శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. విశాఖపట్నం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురి చొప్పున ప్రాణాలు వదిలారు. సౌత్ ఇండియాలో ఒక్క రోజులో 5 వేల కేసులు నమోదైన తొలి రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం
This post was last modified on July 19, 2020 9:30 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…