ఒక్క రోజులో వెయ్యి కరోనా కేసులట. గత నెలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసులకు పైగా వచ్చాయంటే కరోనా కేసులు బయటపడ్డాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగించే విషయం.
తెలంగాణలో కరోనా బులిటెన్ రోజూ రాత్రి ఇస్తే.. ఏపీలో ఉదయమే బులిటెన్ రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ ఆదివారం మాత్రం మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం దాకా బులిటెన్ ఇవ్వలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి రాత్రి 7 గంటలకు బులిటెన్ రిలీజ్ చేశారు. అందులో కరోనా కేసుల గణాంకాలు చూసి అంతా షాకైపోయారు.
గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 5041 కొత్త కరోనా కేసులు బయట పడినట్లు ఇందులో వెల్లడించారు. కాకపోతే టెస్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం కొంచెం ఉపశమనం కలిగించే విషయం. 31 వేలకు పైగా శాంపిల్స్ తీస్తే అందులో 5041 మందికి కరోనా ఉన్నట్లు వెల్లడైంది. అలా చూసినా 20 శాతం దాకా పాజిటివ్ రేటు ఉండటం ఆందోళన కలిగించే విషయమే.
శనివారం 4 వేల మార్కుకు దగ్గర కరోనా కేసులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఒక్క తూర్పుగోదావరిలోనే 1000కి చేరువగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఆ జిల్లాలో 647 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఒక్క జిల్లాలోనే 10 మంది మరణించారు. శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. విశాఖపట్నం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురి చొప్పున ప్రాణాలు వదిలారు. సౌత్ ఇండియాలో ఒక్క రోజులో 5 వేల కేసులు నమోదైన తొలి రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…