ఒక్క రోజులో వెయ్యి కరోనా కేసులట. గత నెలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసులకు పైగా వచ్చాయంటే కరోనా కేసులు బయటపడ్డాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగించే విషయం.
తెలంగాణలో కరోనా బులిటెన్ రోజూ రాత్రి ఇస్తే.. ఏపీలో ఉదయమే బులిటెన్ రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ ఆదివారం మాత్రం మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం దాకా బులిటెన్ ఇవ్వలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి రాత్రి 7 గంటలకు బులిటెన్ రిలీజ్ చేశారు. అందులో కరోనా కేసుల గణాంకాలు చూసి అంతా షాకైపోయారు.
గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 5041 కొత్త కరోనా కేసులు బయట పడినట్లు ఇందులో వెల్లడించారు. కాకపోతే టెస్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం కొంచెం ఉపశమనం కలిగించే విషయం. 31 వేలకు పైగా శాంపిల్స్ తీస్తే అందులో 5041 మందికి కరోనా ఉన్నట్లు వెల్లడైంది. అలా చూసినా 20 శాతం దాకా పాజిటివ్ రేటు ఉండటం ఆందోళన కలిగించే విషయమే.
శనివారం 4 వేల మార్కుకు దగ్గర కరోనా కేసులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఒక్క తూర్పుగోదావరిలోనే 1000కి చేరువగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఆ జిల్లాలో 647 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఒక్క జిల్లాలోనే 10 మంది మరణించారు. శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. విశాఖపట్నం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురి చొప్పున ప్రాణాలు వదిలారు. సౌత్ ఇండియాలో ఒక్క రోజులో 5 వేల కేసులు నమోదైన తొలి రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం
This post was last modified on July 19, 2020 9:30 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…