ఒక్క రోజులో వెయ్యి కరోనా కేసులట. గత నెలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసులకు పైగా వచ్చాయంటే కరోనా కేసులు బయటపడ్డాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగించే విషయం.
తెలంగాణలో కరోనా బులిటెన్ రోజూ రాత్రి ఇస్తే.. ఏపీలో ఉదయమే బులిటెన్ రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ ఆదివారం మాత్రం మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం దాకా బులిటెన్ ఇవ్వలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి రాత్రి 7 గంటలకు బులిటెన్ రిలీజ్ చేశారు. అందులో కరోనా కేసుల గణాంకాలు చూసి అంతా షాకైపోయారు.
గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 5041 కొత్త కరోనా కేసులు బయట పడినట్లు ఇందులో వెల్లడించారు. కాకపోతే టెస్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం కొంచెం ఉపశమనం కలిగించే విషయం. 31 వేలకు పైగా శాంపిల్స్ తీస్తే అందులో 5041 మందికి కరోనా ఉన్నట్లు వెల్లడైంది. అలా చూసినా 20 శాతం దాకా పాజిటివ్ రేటు ఉండటం ఆందోళన కలిగించే విషయమే.
శనివారం 4 వేల మార్కుకు దగ్గర కరోనా కేసులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఒక్క తూర్పుగోదావరిలోనే 1000కి చేరువగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఆ జిల్లాలో 647 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఒక్క జిల్లాలోనే 10 మంది మరణించారు. శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. విశాఖపట్నం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురి చొప్పున ప్రాణాలు వదిలారు. సౌత్ ఇండియాలో ఒక్క రోజులో 5 వేల కేసులు నమోదైన తొలి రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం
This post was last modified on July 19, 2020 9:30 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…