Political News

ఏపీలో ముందస్తు ముచ్చట

ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు విశాఖ నుంచి హైదరాబాద్ వరకు ఎవరిని పలుకరించినా ఇదే ప్రశ్న వేస్తున్నారు. .సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చినప్పటి నుంచి రాజకీయ, మీడియా వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.

ప్రధాని మోదీని జగన్ కలిసినప్పుడు నేరుగా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు అందుకు కేంద్రం సహకారం తీసుకోవాలనుకుంటున్నట్లు జగన్ చెప్పారట. అయితే మోదీ మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారట. బాబూ మీ ఇష్టం.. మీరే ఆలోచించుకోవాలి అన్నారట. జగన్ కోరిన ఆశీస్సులు ఇచ్చేందుకు మాత్రం ఆయన ఆసక్తి చూపడం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి…

జగన్ ఎందుకు పర్మీషన్ అడుగుతున్నారు..

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఎన్నికల కమిషన్ సహకరించాలి. అంటే కేంద్ర పెద్దలు అందుకు పచ్చజెండా ఊపాలి. లేని పక్షంలో తిప్పలు తప్పవు, గవర్నర్ ను కలిసి అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయాలని కోరిన తర్వాత కేంద్రం అడ్డం తిరగాలనుకుంటే జగన్ ను ఎవరూ కాపాడలేదు. ఆసెంబ్లీ రద్దయిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించి ఆరు నెలల పాటు జాప్యం చేసే అవకాశం ఉంటుంది. ఈ లోపు అధికార పార్టీని ఛిన్నాభిన్నం చేసే వ్యూహాలను రచించే అవకాశం కేంద్రంలోని అధికార పార్టీకి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అనుకున్న సమయానికి ముందస్తు ఎన్నికలు జరగకపోతే.. వాళ్లకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఈసీ అడ్డు తగిలింది. దానితో జరిగిన నష్టమేంటో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రాన్ని వేడుకున్నారు..

ఎందుకు ముందస్తు ఎన్నికలు !
జగన్ ముందస్తు ఎన్నికలు ఎందుకు కోరుకుంటున్నారన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు వైసీపీ పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.గడప గడపకు కార్యక్రమంలో నిత్యం నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలను జనం గుక్కతిప్పుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎమ్మెల్యేల్లోనే జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది.తమ బాధలను సీఎం అర్థం చేసుకోవడం లేదని,జనంలోకి వెళితే వాళ్లు తిడుతున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. దానితో వై నాట్ 175 సంగతి దేవుడెరుగు.. ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడే జారిపోయే ప్రమాదం ఉంది. పైగా చంద్రబాబు రోజురోజుకు దూసుకుపోతున్నారు. షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఇక తమ పార్టీ శంకరగిరి మాన్యాలు పట్టుకు పోవాల్సిందేనని జగన్ భయపడుతున్నారు. చంద్రబాబు దూకుడును ఆపాలంటే ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాలి. ఒక్క సారి ఎన్నికలు పూర్తయి, వైసీపీ గెలిస్తే ఇక ఐదేళ్ల వరకు ఢోకా ఉండదు.. చంద్రబాబు బెంగ తమకు ఉండదని జగన్ ఆలోచిస్తున్నారు..

ఏప్రిల్‌లో అసెంబ్లీ రద్దు

ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది. జీతాలు, పెన్షన్లు అందక జనం తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. వారి ఆగ్రహం వ్యతిరేక ఓటుగా మారకముందే ఎన్నికలు జరిగిపోతే హాయిగా ఉండొచ్చన్నది జగన్ ప్లాన్. అందుకే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో అసెంబ్లీని రద్దు చేస్తే.. మే చివరి వారంలో ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. ఏడాది ముందే ఎన్నికలు జరుపుకుని గట్టెక్కినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నారు. దానికి బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనని వైసీపీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి…

This post was last modified on January 1, 2023 10:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

6 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

6 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

8 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

8 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

10 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

11 hours ago