ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిని అంగీకరించేది లేదని.. ఎట్టి పరిస్థితిలో దీనికి తాము ఒప్పుకోబోమని ఆయన వ్యాఖ్యానించారు. “అమరావతినే రాజధాని చేయాలని ఏ పార్టీ అయినా.. అనుకుంటే.. విశాఖను చిన్న రాష్ట్రం చేసి మాకు ఇచ్చేయండి.. మా పాలనేదో మేమే చేసుకుంటాం.. మా బతుకులేవో మేమే బతుకుతాం! రాజధాని కోసం మా కష్టార్జితాన్ని కట్టాల్సిన అవసరం లేదు. పన్నుల రూపంలో దోచుకుని.. ఒక్కచోటే పోగేసి.. మాకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం“ అని తీవ్రస్తాయిలో హెచ్చరించారు.
ప్రపంచ దేశాలన్నీ వికేంద్రీకరణ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనుసరిస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ నుంచి బొంతలకోడూరు మీదుగా పాతదిబ్బలపాలెం వరకు రూ.4.98 కోట్ల పీఎంసడక్ యోజన- ఫేజ్ 3 నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ తప్పనిసరిగా రాజధాని కావల్సిందేనని అన్నారు.
లేనిపక్షంలో విశాఖను కొత్త రాష్ట్రంగానైనా ప్రకటించాలన్నారు. హైదరాబాద్ రాజధాని కోసం 65 ఏళ్లపాటు రాష్ట్ర ఆదాయం మొత్తం వెచ్చించామన్నారు. ఇదే పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు వెనుకబాటు తప్పదన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా పార్టీలకు అతీతంగా విశాఖ రాజధానికి మద్దతు తెలిపాలన్నారు. బాదుడే బాదుడు, ఇదేమి ఖర్మ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించిన మాటలతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు.
పెట్రో ధరలు, గ్యాస్, వంట నూనె తదితర ధరల పెంపు కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్న విషయాన్ని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ నేతలు ప్రయత్నించడం వారి అవివేకమన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
This post was last modified on December 31, 2022 9:09 am
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…