ఏపీ సీఎం జగన్.. చంద్రబాబుపైనా.. పనిలోపనిగా పవన్పైనా నిప్పులు చెరిగేశారు. చంద్రబాబు స్క్రిప్టు రాస్తే.. పవన్ యాక్టింగ్ చేస్తాడు.. అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రాజకీయం అంటే.. ఏంటో కూడా జగనే చెప్పేశారు. రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపించామని జగన్ అన్నారు. సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ ప్రజల సేవకులని చెప్పారు. రాజకీయం అంటే ఇదేనని స్పష్టం చేశారు.
రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపామన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలేదని జగన్ ఆరోపించారు. ఫొటో షూట్ కోసం, జనాన్ని ఎక్కువ చూపడానికి ఒక చిన్న సందులోకి నెట్టి.. 8 మందిని చంపేశారని చెప్పారు. రాజకీయం అంటే షూటింగ్ కాదని.. ఎస్సీ, ఎస్టీ మధ్య తరగతి జీవితాల్లో మార్పు తీసుకుని రావడమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏది చెప్తే.. పవన్ కల్యాణ్ అది చేస్తాడని విమర్శించారు. చంద్రబాబును చూస్తే కేవలం రెండే విషయాలు గుర్తుకువస్తాయన్న జగన్.. అవి వెన్నుపోటు, మోసాలు అని వ్యాఖ్యానించారు.
“చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక్క మంచి పని కూడా చేయలేదు. దత్తతండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు మరో దత్తపుత్రుడు. వీరి ఇద్దరి స్టైల్ ఒక్కటే. ఈ రాష్ట్రం కాకపోతే.. మరో రాష్ట్రం, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అన్నట్లు ఉంటుంది. వీరిద్దరి స్వరూపం చూస్తే.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, ఇదేం ఖర్మ మన రాజకీయానికి అని అనిపిస్తోంది“ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. మరో ఆయనకేమో(పవన్) ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు(ఉన్న ఎమ్మెల్యేను జగనే లాగేసుకున్నాడు). రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు. పవన్కి చంద్రబాబు నిర్మాత, దర్శకుడు. చంద్రబాబు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు కాల్షీట్లు ఇస్తాడు. బాబు స్క్రిప్ట్ ఇస్తే ఈయన డైలాగ్లు చెప్పి యాక్ట్ చేస్తాడు అని అక్కసు వెళ్లగక్కారు.
This post was last modified on December 31, 2022 9:03 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…