Political News

ఉద్యోగుల‌ పై అంత న‌మ్మ‌కం లేదా జ‌గ‌న‌న్నా?!

ఏపీలో ఉద్యోగుల‌ను అన్ని విధాలా వేధిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో సంచ‌ల‌న ఆదేశం జారీ చేసింది. ఉద్యోగులు ఎవ‌రూ కూడా విధుల‌కు వ‌చ్చే స‌మ‌యంలో త‌మ వ‌ద్ద రూ.500 నుంచి రూ.1000 కి మించి న‌గ‌దును ఉంచుకోవ‌డానికి వీల్లేద‌ని తాజాగా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్త‌వానికి ఇది ఉద్యోగుల స‌ర్వీసు నిబంధ‌న‌ల్లోనే ఉంది. అయితే.. ఏ ప్ర‌భుత్వం కూడా ఇలా ఎప్పుడూ ఆదేశించ‌ లేదు. ఎందుకంటే.. ఎప్పుడు ఏ అవ‌స‌రం ముంచుకు వ‌స్తుందో తెలియ‌దు కాబ‌ట్టి.. ఇలాంటి నిర్ణ‌యాల‌ను చూసీ చూడ‌నట్టు వ‌దిలేస్తుంటాయి.

కానీ, ఘ‌న‌త వ‌హించిన జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం రూల్స్ ప్ర‌కార‌మే తాము ప‌నిచేస్తున్న‌ట్టుగా ఉద్యోగుల‌కు రూల్స్ గుర్తు చేసింది. ఎవ‌రూ కూడా రూ.500-1000కి మించి తీసుకురావ‌ద్ద‌ని తాజాగా సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపీ సివిల్ స‌ర్వీస్ రూల్స్ 1964 ప్ర‌కారం.. దీనిలో స‌బ్ రూల్ 8(ఏ), 8(బీ), మ‌రో స‌బ్ రూల్ 9 ప్ర‌కారం.. ఎవ‌రూ కూడా త‌మ వ‌ద్ద అధికంగా న‌గ‌దు ఉంచుకోరాద‌ని ఆదేశాలు జారీ చేయ‌డం ఇప్పుడు ఉద్యోగుల‌ను మ‌రింత మంటెత్తిస్తున్నాయి.
(8)(ఏ) అంటే..

ప్రభుత్వ సేవకుడు తన వద్ద ఉన్న నగదు ఖాతాను ఏ సమయంలోనైనా అందించవలసి ఉంటుంది. అటువంటి ఖాతాలో నగదు లభ్య‌త వివ‌రాల‌ను ప్ర‌భుత్వం తెలుసుకుంటుంది.

(8) (B) అంటే..

సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వు ద్వారా విధిలో ఉన్న ప్రభుత్వోద్యోగిని నిర్దేశిత మొత్తానికి మించి తన వద్ద నగదును ఉంచుకోవద్దని,అతని వద్ద ఉన్న నగదును ప్రకటించాలని కోరవచ్చు. రూ.500/- కంటే ఎక్కువ ఉంటే డ్యూటీకి రిపోర్టింగ్ సమయంలో వ్యక్తిగత నగదు డిక్లరేషన్ ఇవ్వాలి. అయితే.. ప‌ర్య‌ట‌న‌లో(కార్యాల‌యంలో కాకుండా) పర్యటనలో ఉన్నప్పుడు రూ.10,000/- కంటే ఎక్కువ ఉంటే నగదు ఉంచుకోవ‌చ్చు.

డైరెక్టర్ జనరల్, యాంటీ కరప్షన్ బ్యూరో, కార్యాలయంలో విధుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు వ్యక్తిగత నగదును కలిగి ఉండేందుకు గల సీలింగ్ పరిమితిని రూ.500/- నుండి రూ.1000కి పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని స‌ర్కారు తెలిపింది.

ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఇప్పుడు డిజిటల్ చెల్లింపు యాప్‌లు సాధారణంగా ఉపయోగించబడు తున్నాయని, ఎక్కువ నగదును ఉంచుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం, ప‌న్ను వసూలు చేసే విభాగాలతో సహా నగదుతో వ్యవహరించే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరూ విధి నిర్వహణలో రిపోర్టింగ్ సమయంలో వ్యక్తిగత నగదు రూ.1000/ కంటే ఎక్కువగా ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 

This post was last modified on December 31, 2022 9:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago