Political News

లోకేష్ పాద‌యాత్ర‌కు బ్రేకిస్తే.. మ‌న‌కే తంటా.. వైసీపీ గుస‌గుస‌

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జ‌న‌వ‌రి 27 నుంచి పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్టు ప్ర‌క టించారు. యువ‌గ‌ళం పేరుతో ఆయ‌న పాద‌యాత్రకు రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌ల చేశారు. అదేస‌మ‌యంలో ప‌తాకాన్ని కూడా ఆవిష్క‌రించారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక‌, రూట్ మ్యాప్ మాత్రం సిద్ధం కావాల్సి ఉంది. అయితే.. ఇంత‌లోనే.. వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. లోకేష్ ఏ ఉద్దేశంతో పాద‌యాత్ర చేస్తున్నార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతే కాదు.. లోకేష్ పాద‌యాత్ర‌ను ఆపేస్తామ‌ని చెప్పారు. “గ‌తంలో రైతుల పాద‌యాత్ర ఆపేశాం. ఇప్పుడు లోకేష్ వంతు వ‌చ్చింది. దీనిని కూడా ఆపేస్తాం” అని ప్ర‌క‌ట‌న ఇచ్చారు.

అయితే, దీనిపై టీడీపీ నేత‌లు ఇంకా రియాక్ట్ కాలేదు. ఈలోగా నెల్లూరు జిల్లా కందుకూరు ఘ‌ట‌న జ‌రిగింది. దీంతో నాగార్జున వ్యాఖ్య‌లపై టీడీపీ నేత‌లు స్పందించ‌లేదు. కానీ, మంత్రిగారి వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీలోనే భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది. ఇది స‌రికాద‌ని.. దీనివ‌ల్ల మ‌న‌కే న‌ష్ట‌మ‌ని.. గుంటూరుకు చెందిన ఒక నేత ఆఫ్‌దిరికార్డుగా వ్యాఖ్యానించారు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తా వించారు.

అంతేకాదు.. “పాద‌యాత్ర‌ను అడ్డుకుంటే ఏమొస్తుంది? అప‌వాదు త‌ప్ప‌. గ‌తంలో మా నాయ‌కుడు కూడా పాద‌యాత్ర చేశారు. అప్పుడు ఇలానే అడ్డుకుని ఉంటే.. బాగుండేదా? ఇలాంటి ఆలోచ‌న‌లు స‌రికాదు. ఇలా చేస్తే.. టీడీపీకి మ‌రింత ప్ర‌చారం క‌ల్పించిన‌ట్టు అవుతుంది. వాళ్లు కోర్టుకు వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు. అది బాగుటుందా.? ప్ర‌భుత్వం పై మ‌చ్చ‌ప‌డ‌దా?” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

This post was last modified on December 30, 2022 7:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

2 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

3 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

3 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

4 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

4 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

5 hours ago