టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్టు ప్రక టించారు. యువగళం పేరుతో ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. అదేసమయంలో పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని నడవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక, రూట్ మ్యాప్ మాత్రం సిద్ధం కావాల్సి ఉంది. అయితే.. ఇంతలోనే.. వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున సంచలన ప్రకటన చేశారు. లోకేష్ ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారని.. ఆయన ప్రశ్నించారు. అంతే కాదు.. లోకేష్ పాదయాత్రను ఆపేస్తామని చెప్పారు. “గతంలో రైతుల పాదయాత్ర ఆపేశాం. ఇప్పుడు లోకేష్ వంతు వచ్చింది. దీనిని కూడా ఆపేస్తాం” అని ప్రకటన ఇచ్చారు.
అయితే, దీనిపై టీడీపీ నేతలు ఇంకా రియాక్ట్ కాలేదు. ఈలోగా నెల్లూరు జిల్లా కందుకూరు ఘటన జరిగింది. దీంతో నాగార్జున వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించలేదు. కానీ, మంత్రిగారి వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఇది సరికాదని.. దీనివల్ల మనకే నష్టమని.. గుంటూరుకు చెందిన ఒక నేత ఆఫ్దిరికార్డుగా వ్యాఖ్యానించారు. గతంలో జగన్ పాదయాత్ర చేసిన విషయాన్ని ఆయన ప్రస్తా వించారు.
అంతేకాదు.. “పాదయాత్రను అడ్డుకుంటే ఏమొస్తుంది? అపవాదు తప్ప. గతంలో మా నాయకుడు కూడా పాదయాత్ర చేశారు. అప్పుడు ఇలానే అడ్డుకుని ఉంటే.. బాగుండేదా? ఇలాంటి ఆలోచనలు సరికాదు. ఇలా చేస్తే.. టీడీపీకి మరింత ప్రచారం కల్పించినట్టు అవుతుంది. వాళ్లు కోర్టుకు వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు. అది బాగుటుందా.? ప్రభుత్వం పై మచ్చపడదా?” అని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on December 30, 2022 7:37 pm
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…