టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్టు ప్రక టించారు. యువగళం పేరుతో ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. అదేసమయంలో పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని నడవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక, రూట్ మ్యాప్ మాత్రం సిద్ధం కావాల్సి ఉంది. అయితే.. ఇంతలోనే.. వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున సంచలన ప్రకటన చేశారు. లోకేష్ ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారని.. ఆయన ప్రశ్నించారు. అంతే కాదు.. లోకేష్ పాదయాత్రను ఆపేస్తామని చెప్పారు. “గతంలో రైతుల పాదయాత్ర ఆపేశాం. ఇప్పుడు లోకేష్ వంతు వచ్చింది. దీనిని కూడా ఆపేస్తాం” అని ప్రకటన ఇచ్చారు.
అయితే, దీనిపై టీడీపీ నేతలు ఇంకా రియాక్ట్ కాలేదు. ఈలోగా నెల్లూరు జిల్లా కందుకూరు ఘటన జరిగింది. దీంతో నాగార్జున వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించలేదు. కానీ, మంత్రిగారి వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఇది సరికాదని.. దీనివల్ల మనకే నష్టమని.. గుంటూరుకు చెందిన ఒక నేత ఆఫ్దిరికార్డుగా వ్యాఖ్యానించారు. గతంలో జగన్ పాదయాత్ర చేసిన విషయాన్ని ఆయన ప్రస్తా వించారు.
అంతేకాదు.. “పాదయాత్రను అడ్డుకుంటే ఏమొస్తుంది? అపవాదు తప్ప. గతంలో మా నాయకుడు కూడా పాదయాత్ర చేశారు. అప్పుడు ఇలానే అడ్డుకుని ఉంటే.. బాగుండేదా? ఇలాంటి ఆలోచనలు సరికాదు. ఇలా చేస్తే.. టీడీపీకి మరింత ప్రచారం కల్పించినట్టు అవుతుంది. వాళ్లు కోర్టుకు వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు. అది బాగుటుందా.? ప్రభుత్వం పై మచ్చపడదా?” అని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on December 30, 2022 7:37 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…