Political News

లోకేష్ పాద‌యాత్ర‌కు బ్రేకిస్తే.. మ‌న‌కే తంటా.. వైసీపీ గుస‌గుస‌

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జ‌న‌వ‌రి 27 నుంచి పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్టు ప్ర‌క టించారు. యువ‌గ‌ళం పేరుతో ఆయ‌న పాద‌యాత్రకు రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌ల చేశారు. అదేస‌మ‌యంలో ప‌తాకాన్ని కూడా ఆవిష్క‌రించారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక‌, రూట్ మ్యాప్ మాత్రం సిద్ధం కావాల్సి ఉంది. అయితే.. ఇంత‌లోనే.. వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. లోకేష్ ఏ ఉద్దేశంతో పాద‌యాత్ర చేస్తున్నార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతే కాదు.. లోకేష్ పాద‌యాత్ర‌ను ఆపేస్తామ‌ని చెప్పారు. “గ‌తంలో రైతుల పాద‌యాత్ర ఆపేశాం. ఇప్పుడు లోకేష్ వంతు వ‌చ్చింది. దీనిని కూడా ఆపేస్తాం” అని ప్ర‌క‌ట‌న ఇచ్చారు.

అయితే, దీనిపై టీడీపీ నేత‌లు ఇంకా రియాక్ట్ కాలేదు. ఈలోగా నెల్లూరు జిల్లా కందుకూరు ఘ‌ట‌న జ‌రిగింది. దీంతో నాగార్జున వ్యాఖ్య‌లపై టీడీపీ నేత‌లు స్పందించ‌లేదు. కానీ, మంత్రిగారి వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీలోనే భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది. ఇది స‌రికాద‌ని.. దీనివ‌ల్ల మ‌న‌కే న‌ష్ట‌మ‌ని.. గుంటూరుకు చెందిన ఒక నేత ఆఫ్‌దిరికార్డుగా వ్యాఖ్యానించారు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తా వించారు.

అంతేకాదు.. “పాద‌యాత్ర‌ను అడ్డుకుంటే ఏమొస్తుంది? అప‌వాదు త‌ప్ప‌. గ‌తంలో మా నాయ‌కుడు కూడా పాద‌యాత్ర చేశారు. అప్పుడు ఇలానే అడ్డుకుని ఉంటే.. బాగుండేదా? ఇలాంటి ఆలోచ‌న‌లు స‌రికాదు. ఇలా చేస్తే.. టీడీపీకి మ‌రింత ప్ర‌చారం క‌ల్పించిన‌ట్టు అవుతుంది. వాళ్లు కోర్టుకు వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు. అది బాగుటుందా.? ప్ర‌భుత్వం పై మ‌చ్చ‌ప‌డ‌దా?” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

This post was last modified on December 30, 2022 7:37 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago