Political News

తిరుమల దర్శనాలపై యుటర్న్

ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గత నెల తిరుమల శ్రీవారి దర్శనాలు పున:ప్రారంభించారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఫలితం లేకపోయింది. కొండపై పదుల సంఖ్యలో ఉద్యోగులు కరోనా బారిన పడుతూ వచ్చారు. అధికారికంగా ఇప్పటికే 160 మంది దాకా కరోనా బాధితులుగా మారారు. కానీ అనధికారికంగా ఆ లెక్క 200 దాటిందన్నది టీటీవీ వర్గాల మాట.

ఉద్యోగులతో పాటు అర్చకులు సైతం కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే దర్శనాలు ఆపేయాలన్న డిమాండ్ మొదలైంది. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా కనిపించలేదు. దర్శనాలు ఆపే ప్రసక్తే లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆయన సహా టీటీడీ బోర్డు పెద్దలంతా పునరాలోచనలో పడ్డట్లు సమాచారం.

శ్రీవారి కైంకర్యాల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించే ఓ స్వామీజీ కూడా తాజాగా కరోనా బారిన పడ్డట్లు సమాచారం. ఆయన పెద్ద వయస్కుడు కావడం, అనారోగ్య సమస్యలు ఉండటంతో స్విమ్స్ పద్మావతి కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. అర్చకుల్లో చాలామంది వృద్ధులే కావడంతో ఆలయంలోకి రావడానికి భయపడుతున్నారు. దర్శనాలు ఆపాలని వాళ్ల నుంచి గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది.

ఉద్యోగులు సైతం పని చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. దర్శనాలు ఆపాలన్న ఒత్తిడి అంతకంతకూ పెరుగుతుండటంతో టీటీడీ ఛైర్మన్ నిర్ణయం మార్చుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు కూడా కరోనా బారిన పడుతుండొచ్చని.. వారి నుంచి మరెంతో మందికి వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంటుందని.. కాబట్టి దర్శనాలు ఆపాల్సిందే అని టీటీడీలో మెజారిటీ అభిప్రాయపడుతున్నారని.. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రకటన రావచ్చని సమాచారం.

This post was last modified on July 20, 2020 11:17 am

Share
Show comments
Published by
Satya
Tags: COVID-19TTD

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago