Political News

ఇరుకు వ్యూహాలు.. క‌ర‌కు నింద‌లు.. అవ‌స‌ర‌మా చంద్ర‌బాబూ!

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఉండాల్సిందే. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై పైచేయి సాధించేందుకు ఎత్తుల‌కు పై ఎత్తులు వేయాల్సిందే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, కొన్నికొన్ని వ్యూహాలు బెడిసి కొడుతుంటాయి. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి టీడీపీలోనూ క‌నిపిస్తోంది. పార్టీ రాజకీయ వ్యూహ‌క‌ర్త ఇచ్చార‌ని చెబుతున్న వ్యూహాన్ని ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్నారు.

అదేంటంటే.. ఇప్ప‌టి నుంచే టీడీపీ పుంజుకుంద‌ని.. ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తున్నార‌నే ప్ర‌చారం చేయ‌డం! ఇది మంచిదే. వ‌స్తున్నార‌ని చెప్పుకోవ‌డం.. వీడియోలు తీసుకుని, ఫొటోలు వేయించుకుంటే ఎవ‌రూ కాద‌న‌రు. ఈ జ‌నాల రాక‌ను చూపించ‌డంలోనే వ్యూహం బెడిసి కొడుతోంది. విజ‌య‌న‌గ‌రంలోను, బొబ్బిలిలోనూ.. చిన్న‌పాటి ఇరుకు సందుల్లో స‌భ‌లు పెట్టార‌నే వాద‌న వ‌చ్చింది.

దీనిని టీడీపీ నాయ‌కులు కూడా అంగీక‌రించారు. అయితే.. పెద్ద గ్రౌండ్స్‌లో అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే.. చిన్న వీధుల్లో మాట్లాడుతున్నామ‌ని అన్నారు. అయితే.. ఈ రెండు చోట్లా ఏమీ కాలేదు కాబ‌ట్టి.. ఓకే! కానీ, ఇప్పుడు Kandukuru లో దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న జ‌రిగింది. ఈ క్ర‌మంలో టీడీపీ వ్యూహం.. బెడిసి కొట్టి.. 8 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో లేనిపోని నింద‌లు ఎదుర్కొనే ప‌రిస్థితి చంద్ర‌బాబుకు ఎదురైంది.

గ‌తంలోనూ చంద్ర‌బాబు ఐదు సార్లు(ఈ 3 ఏళ్ల‌లోనే) Kandukuru లో ప‌ర్య‌టించారు. అప్ప‌ట్లోనూ రెండు సార్లు స‌భ‌లు పెట్టారు. అయితే, ప్ర‌స్తుతం ఘ‌ట‌న జ‌రిగిన ఎన్టీఆర్ స‌ర్కిల్‌కు 200 మీట‌ర్ల దూరంలో ఉన్న అంకమ్మ దేవాలయం ప్రాంగణంలో సభను నిర్వహించేవారు. అది విశాలమైన ప్రాంగణం కావటంతో ఎంత మంది జనం వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ సారి ఇరుకు రోడ్లను ఎంచుకోవటంతో ఊహించని దారుణం జరిగిపోయింది. ఏదేమైనా.. ఇరుకు వ్యూహాల‌తో నింద‌లు ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

Satya

Recent Posts

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

5 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago