Political News

క‌రోనాను మించిన విల‌యం చూస్తున్న ఆ రాష్ట్రం

ఇప్పుడు దేశ‌మంతా అంద‌రి దృష్టీ క‌రోనా మీదే ఉంది. ఇండియాలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వైర‌స్ ప్ర‌భావంతో అన్ని రాష్ట్రాలూ అల్లాడిపోతున్నాయి. క‌రోనా కేసులు ప‌ది ల‌క్ష‌లు దాటిపోయాయి. వేల‌మంది ప్రాణాలు వ‌దులుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్నీ ఈ మ‌హ‌మ్మారి ధాటికి కుదేల‌వుతున్నాయి. ఐతే ఓ రాష్ట్రం మాత్రం క‌రోనాను మించి విల‌యాన్ని ఎదుర్కొంటోంది. కానీ దాని గురించి ఎవ‌రికీ ప‌ట్టింపు లేదు. ఆ రాష్ట్రం అస్సాం.

భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆ రాష్ట్రంలో ద‌య‌నీయ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. కొంచెం లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల‌న్నీ పూర్తిగా మునిగిపోయాయి. అస‌ల‌క్క‌డ ఇళ్లు ఉన్న ఆన‌వాళ్లు కూడా క‌నిపించ‌డం లేదు. చాలా చోట్ల దొరికిన సామాను ప‌ట్టుకుని జ‌నాలు మేడ‌ల‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. చుట్టూ నీళ్లు ప్ర‌మాద‌క‌ర రీతిలో ప్ర‌వ‌హిస్తుండ‌గా.. పైన తిన‌డానికి ఏమీ లేని దయ‌నీయ స్థితిలో ఆకాశం వైపు చూస్తున్నారు.

గ‌త కొన్ని రోజుల్లో అక్క‌డ వంద మంది దాకా వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్రాణాలు కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స్థాయిలో జంతువులు కూడా చ‌నిపోయాయి. భారీ ఖ‌డ్గ మృగాల‌కు నెల‌వైన అస్సాం నేష‌న‌ల్ పార్క్ కూడా వ‌ర‌ద తాకిడికి గురైంది. ఖ‌డ్గ మృగాలు కూడా ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయాయి. ల‌క్ష ఎక‌రాల‌కు పైగా పంట న‌ష్టం వాటిల్లిందంటే ప‌రిస్థితి తీవ్ర‌త అర్థం చేసుకోవ‌చ్చు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నిస్స‌హాయ స్థితిలో ఉండ‌గా.. ఈ ఈశాన్య రాష్ట్రం మీద చిన్న‌చూపుతో కేంద్ర ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో సాయం చేయ‌ట్లేద‌ని.. మీడియా కూడా సెల‌బ్రెటీల క‌రోనా వార్త‌లు క‌వ‌ర్ చేయ‌డంలో బిజీగా ఉంటూ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అస్సాం వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on July 19, 2020 11:23 am

Share
Show comments
Published by
Satya
Tags: AssamFloods

Recent Posts

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

2 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

3 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

5 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

5 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

10 hours ago