Political News

క‌రోనాను మించిన విల‌యం చూస్తున్న ఆ రాష్ట్రం

ఇప్పుడు దేశ‌మంతా అంద‌రి దృష్టీ క‌రోనా మీదే ఉంది. ఇండియాలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వైర‌స్ ప్ర‌భావంతో అన్ని రాష్ట్రాలూ అల్లాడిపోతున్నాయి. క‌రోనా కేసులు ప‌ది ల‌క్ష‌లు దాటిపోయాయి. వేల‌మంది ప్రాణాలు వ‌దులుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్నీ ఈ మ‌హ‌మ్మారి ధాటికి కుదేల‌వుతున్నాయి. ఐతే ఓ రాష్ట్రం మాత్రం క‌రోనాను మించి విల‌యాన్ని ఎదుర్కొంటోంది. కానీ దాని గురించి ఎవ‌రికీ ప‌ట్టింపు లేదు. ఆ రాష్ట్రం అస్సాం.

భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆ రాష్ట్రంలో ద‌య‌నీయ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. కొంచెం లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల‌న్నీ పూర్తిగా మునిగిపోయాయి. అస‌ల‌క్క‌డ ఇళ్లు ఉన్న ఆన‌వాళ్లు కూడా క‌నిపించ‌డం లేదు. చాలా చోట్ల దొరికిన సామాను ప‌ట్టుకుని జ‌నాలు మేడ‌ల‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. చుట్టూ నీళ్లు ప్ర‌మాద‌క‌ర రీతిలో ప్ర‌వ‌హిస్తుండ‌గా.. పైన తిన‌డానికి ఏమీ లేని దయ‌నీయ స్థితిలో ఆకాశం వైపు చూస్తున్నారు.

గ‌త కొన్ని రోజుల్లో అక్క‌డ వంద మంది దాకా వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్రాణాలు కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స్థాయిలో జంతువులు కూడా చ‌నిపోయాయి. భారీ ఖ‌డ్గ మృగాల‌కు నెల‌వైన అస్సాం నేష‌న‌ల్ పార్క్ కూడా వ‌ర‌ద తాకిడికి గురైంది. ఖ‌డ్గ మృగాలు కూడా ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయాయి. ల‌క్ష ఎక‌రాల‌కు పైగా పంట న‌ష్టం వాటిల్లిందంటే ప‌రిస్థితి తీవ్ర‌త అర్థం చేసుకోవ‌చ్చు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నిస్స‌హాయ స్థితిలో ఉండ‌గా.. ఈ ఈశాన్య రాష్ట్రం మీద చిన్న‌చూపుతో కేంద్ర ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో సాయం చేయ‌ట్లేద‌ని.. మీడియా కూడా సెల‌బ్రెటీల క‌రోనా వార్త‌లు క‌వ‌ర్ చేయ‌డంలో బిజీగా ఉంటూ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అస్సాం వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on July 19, 2020 11:23 am

Share
Show comments
Published by
Satya
Tags: AssamFloods

Recent Posts

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

2 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

3 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

4 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

6 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

10 hours ago

అలా ఎలా ఒప్పించావయ్యా సుజీత్

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…

10 hours ago