Political News

క‌రోనాను మించిన విల‌యం చూస్తున్న ఆ రాష్ట్రం

ఇప్పుడు దేశ‌మంతా అంద‌రి దృష్టీ క‌రోనా మీదే ఉంది. ఇండియాలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వైర‌స్ ప్ర‌భావంతో అన్ని రాష్ట్రాలూ అల్లాడిపోతున్నాయి. క‌రోనా కేసులు ప‌ది ల‌క్ష‌లు దాటిపోయాయి. వేల‌మంది ప్రాణాలు వ‌దులుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్నీ ఈ మ‌హ‌మ్మారి ధాటికి కుదేల‌వుతున్నాయి. ఐతే ఓ రాష్ట్రం మాత్రం క‌రోనాను మించి విల‌యాన్ని ఎదుర్కొంటోంది. కానీ దాని గురించి ఎవ‌రికీ ప‌ట్టింపు లేదు. ఆ రాష్ట్రం అస్సాం.

భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆ రాష్ట్రంలో ద‌య‌నీయ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. కొంచెం లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల‌న్నీ పూర్తిగా మునిగిపోయాయి. అస‌ల‌క్క‌డ ఇళ్లు ఉన్న ఆన‌వాళ్లు కూడా క‌నిపించ‌డం లేదు. చాలా చోట్ల దొరికిన సామాను ప‌ట్టుకుని జ‌నాలు మేడ‌ల‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. చుట్టూ నీళ్లు ప్ర‌మాద‌క‌ర రీతిలో ప్ర‌వ‌హిస్తుండ‌గా.. పైన తిన‌డానికి ఏమీ లేని దయ‌నీయ స్థితిలో ఆకాశం వైపు చూస్తున్నారు.

గ‌త కొన్ని రోజుల్లో అక్క‌డ వంద మంది దాకా వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్రాణాలు కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స్థాయిలో జంతువులు కూడా చ‌నిపోయాయి. భారీ ఖ‌డ్గ మృగాల‌కు నెల‌వైన అస్సాం నేష‌న‌ల్ పార్క్ కూడా వ‌ర‌ద తాకిడికి గురైంది. ఖ‌డ్గ మృగాలు కూడా ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయాయి. ల‌క్ష ఎక‌రాల‌కు పైగా పంట న‌ష్టం వాటిల్లిందంటే ప‌రిస్థితి తీవ్ర‌త అర్థం చేసుకోవ‌చ్చు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నిస్స‌హాయ స్థితిలో ఉండ‌గా.. ఈ ఈశాన్య రాష్ట్రం మీద చిన్న‌చూపుతో కేంద్ర ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో సాయం చేయ‌ట్లేద‌ని.. మీడియా కూడా సెల‌బ్రెటీల క‌రోనా వార్త‌లు క‌వ‌ర్ చేయ‌డంలో బిజీగా ఉంటూ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అస్సాం వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on July 19, 2020 11:23 am

Share
Show comments
Published by
Satya
Tags: AssamFloods

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago