ఏపీలో రాజకీయాలే కాదు.. నామినేటెడ్ పదువుల్లోనూ సీఎం Jagan తనదైన మార్కు వేసుకుంటున్నారు. తాజాగా తన సొంత బాబాయి(విజయమ్మ చెల్లెలు భర్త) వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వైవీని ఆ పోస్టు నుంచి తప్పించేయాలని భావిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. దీంతో టీటీడీకి త్వరలోనే కొత్త బోర్డుఏర్పాటు కానుందని అంటున్నారు.
ప్రస్తుత TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని జోర్డు పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఉంది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ బాధ్యతలు మొత్తం జగన్ ఆయనకే అప్పగించడంతో అటు టీటీడీ చైర్మన్, ఇటు పార్టీ సమన్వయ బాధ్యతలు నిర్వహించడం ఆయనకు తలనొప్పిగా మారిందనేది వాస్తవం. అలాగని శ్రీవారి సేవలను వదులుకోలేరు. కానీ, ఉత్తరాంధ్రలో పార్టీ కట్టుతప్పేసింది.
ఈ క్రమంలో టీటీడీ బోర్డు పదవి నుంచి బాబాయిని తప్పించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ఒక వాదన వినిపిస్తోంది. అయితే.. టీటీడీ బాధ్యతల నుంచి వైదొలుగుతానని వైవీనే స్వయంగా సీఎంకు చెప్పినట్లు ఆయన వర్గం చెబుతోంది. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని వైవీ స్పష్టం చేశారని, ఇందుకు జగన్ కూడా అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.
తిరుమలలో జనవరి 2 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు పూర్తయ్యాక వైవీని పక్కన పెట్టేస్తారని అంటున్నారు. వాస్తవానికి వైవీ.. ఏరికోరి మరీ టీటీడీ బోర్డు పదవిని తెచ్చుకున్నారు. కాబట్టి.. ఆయనంతట ఆయన ఈ పదవిని వదులుకుంటారని ఎవరూ అనుకోరు. కానీ, టీటీడీపై ఇటీవల కాలంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వైవీపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
అయితే.. ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించినా.. అక్కడ కూడా పార్టీ పరిస్థితి కుదుట పడలేదు. మరి ఏం చేస్తారు? టీటీడీ పదవి తొలగించినా.. రాజకీయంగా ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం దక్కుతుందనే సంకేతాలు లేవు. మొత్తానికి బాబాయి విషయంపై జగన్ అసహనంతో ఉన్నారా? లేక.. పార్టీకోసం.. ఇలా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…