ఏపీలో రాజకీయాలే కాదు.. నామినేటెడ్ పదువుల్లోనూ సీఎం Jagan తనదైన మార్కు వేసుకుంటున్నారు. తాజాగా తన సొంత బాబాయి(విజయమ్మ చెల్లెలు భర్త) వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వైవీని ఆ పోస్టు నుంచి తప్పించేయాలని భావిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. దీంతో టీటీడీకి త్వరలోనే కొత్త బోర్డుఏర్పాటు కానుందని అంటున్నారు.
ప్రస్తుత TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని జోర్డు పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఉంది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ బాధ్యతలు మొత్తం జగన్ ఆయనకే అప్పగించడంతో అటు టీటీడీ చైర్మన్, ఇటు పార్టీ సమన్వయ బాధ్యతలు నిర్వహించడం ఆయనకు తలనొప్పిగా మారిందనేది వాస్తవం. అలాగని శ్రీవారి సేవలను వదులుకోలేరు. కానీ, ఉత్తరాంధ్రలో పార్టీ కట్టుతప్పేసింది.
ఈ క్రమంలో టీటీడీ బోర్డు పదవి నుంచి బాబాయిని తప్పించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ఒక వాదన వినిపిస్తోంది. అయితే.. టీటీడీ బాధ్యతల నుంచి వైదొలుగుతానని వైవీనే స్వయంగా సీఎంకు చెప్పినట్లు ఆయన వర్గం చెబుతోంది. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని వైవీ స్పష్టం చేశారని, ఇందుకు జగన్ కూడా అంగీకరించారని ప్రచారం జరుగుతోంది.
తిరుమలలో జనవరి 2 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు పూర్తయ్యాక వైవీని పక్కన పెట్టేస్తారని అంటున్నారు. వాస్తవానికి వైవీ.. ఏరికోరి మరీ టీటీడీ బోర్డు పదవిని తెచ్చుకున్నారు. కాబట్టి.. ఆయనంతట ఆయన ఈ పదవిని వదులుకుంటారని ఎవరూ అనుకోరు. కానీ, టీటీడీపై ఇటీవల కాలంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వైవీపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
అయితే.. ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించినా.. అక్కడ కూడా పార్టీ పరిస్థితి కుదుట పడలేదు. మరి ఏం చేస్తారు? టీటీడీ పదవి తొలగించినా.. రాజకీయంగా ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం దక్కుతుందనే సంకేతాలు లేవు. మొత్తానికి బాబాయి విషయంపై జగన్ అసహనంతో ఉన్నారా? లేక.. పార్టీకోసం.. ఇలా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…