కొన్నిసార్లు రాజకీయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ పార్టీ సంగతిని చూసుకోని కొందరు నేతలు.. తమకేమాత్రం సంబంధం లేని అంశాల్లో తలదూర్చటమే కాదు.. సదరు పార్టీ నేతలకు కాలిపోయేలా వ్యాఖ్యలు చేస్తుంటారు.
తాజాగా అలాంటి వ్యాఖ్యల్నే చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చిదంబరం కుమారుడు కమ్ పార్లమెంటు సభ్యుడు కార్తీ చిదంబరం. తాజాగా బెంగళూరు నుంచి కారులో తమిళనాడులోని చెన్నైకి వచ్చిన ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళ.. త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారని.. అప్పటి నుంచి అధికార అన్నాడీఎంకే ఆమె చేతుల్లోకి వెళుతుందని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే శశికళ.. అన్నాడీఎంకేపార్టీ పూర్తి అధికారాల్ని చేపడుతుందని.. దినకరన్ మరోసారి అన్నాడీఎంకేలో కలిసిపోతారన్నారు.
అన్నాడీఎంకేలో కలకలం రేపేలా కార్తీ చిదంబరం వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికళను అన్నాడీఎంకేలోకి రానిచ్చే పరిస్థితి లేదు. అలాంటివేళ.. చిన్నమ్మ పేరును ప్రస్తావించటం ద్వారా ఆయన కొత్త రాజకీయానికి తెర తీశారనే చెప్పాలి.
మరికొద్ది నెలల్లో శశికళ పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్న వేళ.. అధికార అన్నాడీఎంకేలో కొత్త కలకలానికి బీజం వేసేలా కార్తీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. మరి.. దీనిపై అధికార అన్నాడీఎంకే ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.
This post was last modified on July 19, 2020 10:48 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…