కొన్నిసార్లు రాజకీయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ పార్టీ సంగతిని చూసుకోని కొందరు నేతలు.. తమకేమాత్రం సంబంధం లేని అంశాల్లో తలదూర్చటమే కాదు.. సదరు పార్టీ నేతలకు కాలిపోయేలా వ్యాఖ్యలు చేస్తుంటారు.
తాజాగా అలాంటి వ్యాఖ్యల్నే చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చిదంబరం కుమారుడు కమ్ పార్లమెంటు సభ్యుడు కార్తీ చిదంబరం. తాజాగా బెంగళూరు నుంచి కారులో తమిళనాడులోని చెన్నైకి వచ్చిన ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళ.. త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారని.. అప్పటి నుంచి అధికార అన్నాడీఎంకే ఆమె చేతుల్లోకి వెళుతుందని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే శశికళ.. అన్నాడీఎంకేపార్టీ పూర్తి అధికారాల్ని చేపడుతుందని.. దినకరన్ మరోసారి అన్నాడీఎంకేలో కలిసిపోతారన్నారు.
అన్నాడీఎంకేలో కలకలం రేపేలా కార్తీ చిదంబరం వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికళను అన్నాడీఎంకేలోకి రానిచ్చే పరిస్థితి లేదు. అలాంటివేళ.. చిన్నమ్మ పేరును ప్రస్తావించటం ద్వారా ఆయన కొత్త రాజకీయానికి తెర తీశారనే చెప్పాలి.
మరికొద్ది నెలల్లో శశికళ పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్న వేళ.. అధికార అన్నాడీఎంకేలో కొత్త కలకలానికి బీజం వేసేలా కార్తీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు. మరి.. దీనిపై అధికార అన్నాడీఎంకే ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.
This post was last modified on July 19, 2020 10:48 am
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్.. లండన్ నుంచి ఇలా వచ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు,…
జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…
బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…
కూటమి ప్రభుత్వంలో కలిసి మెలిసి ఉండాలని.. నాయకులు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే…
"ఫిబ్రవరి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్రత్యకంగా గుర్తుండిపోయే రోజు" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం…