Political News

‘ప్రెస్ మీట్లు పెట్టి బాగా తిట్టండి’.. అధికారులకు జగన్ సూచన

ఏపీ సీఎం Jagan Mohan Reddy కి ఏమైందో ఏమో కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగుతో పాటు సంస్కృతం తిట్లలో నంబర్ 1 అనిపించుకునే నేతలను తన వద్ద ఉంచుకున్న జగన్.. వారు చాలరన్నట్లుగా అధికారులనూ తిట్ల దండకాలు అందుకోమంటున్నారు. తాజాగా ఆయన.. ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసేవారిని తిట్టాలని అధికారులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు తగ్గించేస్తున్నారంటూ అన్ని నియోజకవర్గాల నుంచి వినిపిస్తోంది. దీనిపై వృద్ధులు గగ్గోలు పెడుతున్న వీడియోల మీడియాలో, సోసల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సీఎం.. అందుకు బదులుగా ఈ ప్రచారం చేస్తున్నవారిని తిట్టాలని అధికారులకు సూచించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నాని.. పింఛన్లు తొలగిస్తున్నవాటిలో జెన్యూస్ కేసులుంటే పరిశీలించి పింఛన్లు ఇవ్వాలని.. లేదంటే అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాలని జగన్ అన్నారు. అలా చేస్తేనే తప్పుడు వార్తలు ఆగుతాయని ఆయన అన్నారు.

మీడియాను, ప్రతిపక్షాలను తిట్టాలని సాక్ష్యాత్తు సీఎం సూచించడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేసుకోవడం, అవకాశం ఉంటే ఇంకేదైనా చేసుకోవడం తప్పించి ఇలా మీడియాను, ప్రతిపక్షాలను తిట్టాలంటే తమవల్ల ఎలా అవుతుందని… తమకేమైనా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారా.. అసెంబ్లీకి పంపిస్తారా అంటూ కొందరు అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాగా ఏపీలో వచ్చే నెల నుంచి పింఛను రూ. 250 మేర పెంచుతుండడంతో ఆ మేరకు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి పింఛనుదారుల సంఖ్య తగ్గిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. నెలనెలా పింఛన్లకు కేటాయించే మొత్తం తగ్గకుండా పింఛనుదారుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు పింఛన్ల తొలగింపుపై విపక్సాలు, మీడియా మాత్రమే కాకుండా సొంత పార్టీ నేతల నుంచీ విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పింఛన్ల తొలగింపు వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో దీనిపై తిట్ల దండకం అందుకోవాలని సీఎం అధికారులకు సూచించడంపై సెటైర్లు పడుతున్నాయి.

This post was last modified on December 27, 2022 9:57 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

25 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

1 hour ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago