ప్రస్తుతం ఏపీ అధికార పార్టీలో ఉన్న చాలా మంది అసంతృప్తి, అసహనంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. పార్టీ కోసం.. Jaganను సీఎం చేసేందుకు.. తాము ఎంతో కష్టపడ్డామని కొందరు, తాము ఎంతో ఖర్చు చేశామని మరికొందరు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం వచ్చినా.. తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని.. కొత్తగా వచ్చిన వారినే అక్కున చేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో కొందరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నా.. మరికొందరు మాత్రం మనసులో దాచుకుని సమయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి ఒక నేత రోడ్డున పడ్డాడు. YCPలోకి చేరి తప్పు చేశా.. అంటూ ముచ్చురామి రామాంజనేయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆయన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో మాజీ మంత్రి Paritala Suneetha ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇళ్ల వద్దకెళ్లి, ప్రభుత్వ వైఫల్యాలను మహిళలు, ప్రజలకు వివరించారు. అందులో భాగంగా వైసీపీ నేత ముచ్చుమర్రి రామాంజనేయులు ఇంటి వద్దకు పరిటాల సునీత వెళ్లారు. ఆయన వెంటనే పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు.
‘నన్ను క్షమించమ్మా 2019 ఎన్నికల సమయంలో వైసీపీలోకి చేరి తప్పు చేశానమ్మా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పరిటాల సునీత వెంటనే పైకి లేవదీసి.. ‘మనది తెలుగుదేశం పార్టీ’ అని ఆప్యాయంగా పలకరించారు. TDP అందరికీ అవకాశం ఇస్తుందన్నారు. అనంతరం రామాంజనేయులుకు పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు. రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ బలేపేతానికి కృషి చేస్తానన్నారు. ఇక, ఇలా ఎంత మంది ఉన్నారో చూడాలి.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…