Political News

వైసీపీలో చేరి తప్పు చేశా.. టీడీపీ నేత కాళ్లు ప‌ట్టుకున్న వైసీపీ నేత‌

ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలో ఉన్న చాలా మంది అసంతృప్తి, అస‌హ‌నంతోనే కాలం వెళ్ల‌దీస్తున్నారు. పార్టీ కోసం.. Jaganను సీఎం చేసేందుకు.. తాము ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని కొంద‌రు, తాము ఎంతో ఖర్చు చేశామ‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. అయితే, ప్ర‌భుత్వం వ‌చ్చినా.. త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని.. కొత్త‌గా వ‌చ్చిన వారినే అక్కున చేర్చుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నా.. మ‌రికొంద‌రు మాత్రం మ‌న‌సులో దాచుకుని స‌మ‌యం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా అనంత‌పురం జిల్లాలోనూ ఇలాంటి ఒక నేత రోడ్డున ప‌డ్డాడు. YCPలోకి చేరి తప్పు చేశా.. అంటూ ముచ్చురామి రామాంజనేయులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో అకస్మాత్తుగా ఆయ‌న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో మాజీ మంత్రి Paritala Suneetha ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇళ్ల వద్దకెళ్లి, ప్రభుత్వ వైఫల్యాలను మహిళలు, ప్రజలకు వివరించారు. అందులో భాగంగా వైసీపీ నేత‌ ముచ్చుమర్రి రామాంజనేయులు ఇంటి వద్దకు పరిటాల సునీత వెళ్లారు. ఆయన వెంటనే పరిటాల సునీత కాళ్లు పట్టుకున్నారు.

‘నన్ను క్షమించమ్మా 2019 ఎన్నికల సమయంలో వైసీపీలోకి చేరి తప్పు చేశానమ్మా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పరిటాల సునీత వెంటనే పైకి లేవదీసి.. ‘మనది తెలుగుదేశం పార్టీ’ అని ఆప్యాయంగా పలకరించారు. TDP అందరికీ అవకాశం ఇస్తుందన్నారు. అనంతరం రామాంజనేయులుకు పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు. రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ బలేపేతానికి కృషి చేస్తానన్నారు. ఇక‌, ఇలా ఎంత మంది ఉన్నారో చూడాలి.

This post was last modified on December 27, 2022 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

2 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

2 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

2 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

2 hours ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

3 hours ago