గుడివాడ మళ్లీ రగులుకుంది. రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడలో గెడ్డం గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. టీడీపీ కీలకనాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు లక్ష్యంగా పెట్రోల్ సంచులతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను నిలవరించలేక బాధితులైన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి దిగారు. మీడియా ప్రతినిధులపైనా గెడ్డం గ్యాంగ్ సభ్యులు దాడికి తెగపడి సెల్ఫోన్లు, కెమెరాలు పగలకొట్టారు. సుమారు రెండు గంటలపాటు గుడివాడ పట్టణం అట్టుడికిపోయింది.
అసలేం జరిగిందంటే..
ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు గెడ్డం గ్యాంగ్ నేత, మాజీ మంత్రి కౌడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాలు కాళీ పోన్ చేసి అసభ్యపదజాలంతో దూషిస్తూ. ‘నిన్ను చంపేస్తా’ అని బెదిరింపులకు దిగాడు. దీంతో రావి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వెనువెంటనే కాళీ తన అనుచరులతో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోలు సంచులను విసిరేప్రయత్నం చేశాడు.
అయితే, అవి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాయి. మరోవైపు, రావి ఇచ్చిన సమాచారంతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. వైసీపీ శ్రేణులను నిలువరించాల్సింది పోయి ప్రేక్షకపాత్ర పోషించారు. అయితే, గెడ్డం గ్యాంగ్ విరిసిన పెట్రోల్ సంచులను అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పై కాళీ చేయిచేసుకున్నాడు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వైసీపీ శ్రేణులను నిలువరించకపోగా, బాధితులైన టీడీపీ శ్రేణులపై లాఠీచార్జి చేశారు.
సోమవారం మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, దీనిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకుండా పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే గెడ్డం గ్యాం గ్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
This post was last modified on December 26, 2022 9:44 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…