గుడివాడ మళ్లీ రగులుకుంది. రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడలో గెడ్డం గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. టీడీపీ కీలకనాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు లక్ష్యంగా పెట్రోల్ సంచులతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను నిలవరించలేక బాధితులైన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి దిగారు. మీడియా ప్రతినిధులపైనా గెడ్డం గ్యాంగ్ సభ్యులు దాడికి తెగపడి సెల్ఫోన్లు, కెమెరాలు పగలకొట్టారు. సుమారు రెండు గంటలపాటు గుడివాడ పట్టణం అట్టుడికిపోయింది.
అసలేం జరిగిందంటే..
ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు గెడ్డం గ్యాంగ్ నేత, మాజీ మంత్రి కౌడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాలు కాళీ పోన్ చేసి అసభ్యపదజాలంతో దూషిస్తూ. ‘నిన్ను చంపేస్తా’ అని బెదిరింపులకు దిగాడు. దీంతో రావి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వెనువెంటనే కాళీ తన అనుచరులతో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోలు సంచులను విసిరేప్రయత్నం చేశాడు.
అయితే, అవి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాయి. మరోవైపు, రావి ఇచ్చిన సమాచారంతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. వైసీపీ శ్రేణులను నిలువరించాల్సింది పోయి ప్రేక్షకపాత్ర పోషించారు. అయితే, గెడ్డం గ్యాంగ్ విరిసిన పెట్రోల్ సంచులను అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పై కాళీ చేయిచేసుకున్నాడు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వైసీపీ శ్రేణులను నిలువరించకపోగా, బాధితులైన టీడీపీ శ్రేణులపై లాఠీచార్జి చేశారు.
సోమవారం మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, దీనిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకుండా పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే గెడ్డం గ్యాం గ్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
This post was last modified on December 26, 2022 9:44 am
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…