గుడివాడ మళ్లీ రగులుకుంది. రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడలో గెడ్డం గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. టీడీపీ కీలకనాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు లక్ష్యంగా పెట్రోల్ సంచులతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ శ్రేణులను నిలవరించలేక బాధితులైన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జికి దిగారు. మీడియా ప్రతినిధులపైనా గెడ్డం గ్యాంగ్ సభ్యులు దాడికి తెగపడి సెల్ఫోన్లు, కెమెరాలు పగలకొట్టారు. సుమారు రెండు గంటలపాటు గుడివాడ పట్టణం అట్టుడికిపోయింది.
అసలేం జరిగిందంటే..
ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు గెడ్డం గ్యాంగ్ నేత, మాజీ మంత్రి కౌడాలి నాని ప్రధాన అనుచరుడు మెరుగుమాలు కాళీ పోన్ చేసి అసభ్యపదజాలంతో దూషిస్తూ. ‘నిన్ను చంపేస్తా’ అని బెదిరింపులకు దిగాడు. దీంతో రావి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వెనువెంటనే కాళీ తన అనుచరులతో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని దాడికి తెగబడ్డారు. ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోలు సంచులను విసిరేప్రయత్నం చేశాడు.
అయితే, అవి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాయి. మరోవైపు, రావి ఇచ్చిన సమాచారంతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. వైసీపీ శ్రేణులను నిలువరించాల్సింది పోయి ప్రేక్షకపాత్ర పోషించారు. అయితే, గెడ్డం గ్యాంగ్ విరిసిన పెట్రోల్ సంచులను అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పై కాళీ చేయిచేసుకున్నాడు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వైసీపీ శ్రేణులను నిలువరించకపోగా, బాధితులైన టీడీపీ శ్రేణులపై లాఠీచార్జి చేశారు.
సోమవారం మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, దీనిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకుండా పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే గెడ్డం గ్యాం గ్ ఈ దుశ్చర్యకు పాల్పడిందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
This post was last modified on December 26, 2022 9:44 am
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…