వచ్చే 2024 ఎన్నికల్లో అనేక మార్పులు ఉంటాయని.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు స్పష్టం చేస్తున్నాయి. తమ తమ నేతలను ఇప్పటి నుంచి మానసికంగా రెడీ చేస్తున్నాయి. అయితే.. అన్నీ కాకపోయినా.. కనీసం 20 నుంచి 30 స్థానాల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి కారణం.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకంగా మారిపోవడమే!
దీంతో టీడీపీలోను, వైసీపీలోనూ.. యుద్ధ మేఘాలు ఆవరించినట్టుగా ఉంది పరిస్థితి. అయితే.. ఈ మార్పును ఎక్కువ మంది నాయకులు సానుకూలంగా తీసుకోవడం లేదు. పార్టీ అధినేతల అభిప్రాయం ప్రకారం.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులు.. ప్రత్యర్థి పార్టీ బలమైన నాయకుడిని నిలబెట్టిన స్థానాల్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించేశారు. ఉదాహరణకు.. విజయవాడ పార్లమెంటు స్థానంలో టీడీపీ లగడపాటి రాజగోపాల్కు టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీంతో అంతకన్నా బలమైన నాయకుడి కోసం వైసీపీ వెతుకుతోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పీవీపీని పక్కన పెట్టారు. కానీ, పీవీపీ మాత్రం తనకే ఇవ్వాలని.. ఈసారి ఎలాగైనా గెలుస్తానని.. 100 నుంచి 200 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధమని చెబుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినా సరే.. నీకు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అదేవిధంగా ఈ సారి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
దీంతో ఇక్కడ మేకపాటి కుటుంబాన్ని పక్కన పెట్టి.. అంతకన్నా బలమైన వ్యక్తిని పెట్టే ఆలోచన చేస్తున్నారట. ఇక టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా మార్పులు జరుగుతున్నాయి. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనను గన్నవరం పంపించి.. వల్లభనేని వంశీకి యాంటీగా నిలబెట్టాలని చూస్తున్నారు.కానీ, గద్దె మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ విధంగా ఇలాంటి మార్పులు ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను తెరమీదకి వస్తున్నాయి. కానీ, నాయకులు మాత్రం ఇష్టపడడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…
కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్సు ఎక్కాలి.. తెలంగాణ వెళ్ళడానికి హైదరాబాద్ బస్సు ఎక్కాలి.. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి…
వెండితెరపై ఎప్పుడూ కాస్త బోల్డ్, వెస్ట్రన్ లుక్స్తో ట్రెండ్ క్రియేట్ చేసే శ్రుతి హాసన్ ఈసారి పూర్తిగా రూట్ మార్చేసింది.…
దురంధర్ తర్వాత రామ్ చరణ్ మెచ్చుకున్న బాలీవుడ్ మూవీ ఇటీవలే విడుదలైన బేబి దో డై దో. టైటిల్ విచిత్రంగా…
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…