Political News

నియోజ‌క‌వ‌ర్గాలు మారం.. తేల్చి చెప్పేస్తున్న ఎమ్మెల్యేలు

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో అనేక మార్పులు ఉంటాయ‌ని.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు స్ప‌ష్టం చేస్తున్నాయి. త‌మ త‌మ నేత‌ల‌ను ఇప్ప‌టి నుంచి మాన‌సికంగా రెడీ చేస్తున్నాయి. అయితే.. అన్నీ కాక‌పోయినా.. క‌నీసం 20 నుంచి 30 స్థానాల్లో మార్పులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మారిపోవ‌డ‌మే!

దీంతో టీడీపీలోను, వైసీపీలోనూ.. యుద్ధ మేఘాలు ఆవ‌రించిన‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. అయితే.. ఈ మార్పును ఎక్కువ మంది నాయ‌కులు సానుకూలంగా తీసుకోవ‌డం లేదు. పార్టీ అధినేతల అభిప్రాయం ప్ర‌కారం.. ప్రజ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న నాయ‌కులు.. ప్ర‌త్య‌ర్థి పార్టీ బ‌ల‌మైన నాయ‌కుడిని నిల‌బెట్టిన స్థానాల్లోనూ మార్పులు చేయాల‌ని నిర్ణ‌యించేశారు. ఉదాహ‌ర‌ణ‌కు.. విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానంలో టీడీపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు టికెట్ ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

దీంతో అంత‌క‌న్నా బ‌ల‌మైన నాయ‌కుడి కోసం వైసీపీ వెతుకుతోంది. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన పీవీపీని ప‌క్క‌న పెట్టారు. కానీ, పీవీపీ మాత్రం త‌న‌కే ఇవ్వాల‌ని.. ఈసారి ఎలాగైనా గెలుస్తాన‌ని.. 100 నుంచి 200 కోట్లు పెట్ట‌డానికి కూడా సిద్ధ‌మ‌ని చెబుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయినా స‌రే.. నీకు ఇచ్చేది లేద‌ని తేల్చిచెప్పారు. అదేవిధంగా ఈ సారి నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది.

దీంతో ఇక్క‌డ మేక‌పాటి కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి.. అంత‌క‌న్నా బ‌ల‌మైన వ్య‌క్తిని పెట్టే ఆలోచ‌న చేస్తున్నారట‌. ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా మార్పులు జ‌రుగుతున్నాయి. విజ‌య‌వాడ తూర్పులో గ‌ద్దె రామ్మోహ‌న్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయ‌న‌ను గ‌న్న‌వ‌రం పంపించి.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి యాంటీగా నిల‌బెట్టాల‌ని చూస్తున్నారు.కానీ, గ‌ద్దె మాత్రం స‌సేమిరా అంటున్నారు. ఈ విధంగా ఇలాంటి మార్పులు ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. కానీ, నాయ‌కులు మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 25, 2022 10:33 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago