వచ్చే 2024 ఎన్నికల్లో అనేక మార్పులు ఉంటాయని.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు స్పష్టం చేస్తున్నాయి. తమ తమ నేతలను ఇప్పటి నుంచి మానసికంగా రెడీ చేస్తున్నాయి. అయితే.. అన్నీ కాకపోయినా.. కనీసం 20 నుంచి 30 స్థానాల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి కారణం.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకంగా మారిపోవడమే!
దీంతో టీడీపీలోను, వైసీపీలోనూ.. యుద్ధ మేఘాలు ఆవరించినట్టుగా ఉంది పరిస్థితి. అయితే.. ఈ మార్పును ఎక్కువ మంది నాయకులు సానుకూలంగా తీసుకోవడం లేదు. పార్టీ అధినేతల అభిప్రాయం ప్రకారం.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులు.. ప్రత్యర్థి పార్టీ బలమైన నాయకుడిని నిలబెట్టిన స్థానాల్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించేశారు. ఉదాహరణకు.. విజయవాడ పార్లమెంటు స్థానంలో టీడీపీ లగడపాటి రాజగోపాల్కు టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీంతో అంతకన్నా బలమైన నాయకుడి కోసం వైసీపీ వెతుకుతోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పీవీపీని పక్కన పెట్టారు. కానీ, పీవీపీ మాత్రం తనకే ఇవ్వాలని.. ఈసారి ఎలాగైనా గెలుస్తానని.. 100 నుంచి 200 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధమని చెబుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినా సరే.. నీకు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అదేవిధంగా ఈ సారి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
దీంతో ఇక్కడ మేకపాటి కుటుంబాన్ని పక్కన పెట్టి.. అంతకన్నా బలమైన వ్యక్తిని పెట్టే ఆలోచన చేస్తున్నారట. ఇక టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా మార్పులు జరుగుతున్నాయి. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనను గన్నవరం పంపించి.. వల్లభనేని వంశీకి యాంటీగా నిలబెట్టాలని చూస్తున్నారు.కానీ, గద్దె మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ విధంగా ఇలాంటి మార్పులు ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను తెరమీదకి వస్తున్నాయి. కానీ, నాయకులు మాత్రం ఇష్టపడడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…