వచ్చే 2024 ఎన్నికల్లో అనేక మార్పులు ఉంటాయని.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు స్పష్టం చేస్తున్నాయి. తమ తమ నేతలను ఇప్పటి నుంచి మానసికంగా రెడీ చేస్తున్నాయి. అయితే.. అన్నీ కాకపోయినా.. కనీసం 20 నుంచి 30 స్థానాల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి కారణం.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకంగా మారిపోవడమే!
దీంతో టీడీపీలోను, వైసీపీలోనూ.. యుద్ధ మేఘాలు ఆవరించినట్టుగా ఉంది పరిస్థితి. అయితే.. ఈ మార్పును ఎక్కువ మంది నాయకులు సానుకూలంగా తీసుకోవడం లేదు. పార్టీ అధినేతల అభిప్రాయం ప్రకారం.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులు.. ప్రత్యర్థి పార్టీ బలమైన నాయకుడిని నిలబెట్టిన స్థానాల్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించేశారు. ఉదాహరణకు.. విజయవాడ పార్లమెంటు స్థానంలో టీడీపీ లగడపాటి రాజగోపాల్కు టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీంతో అంతకన్నా బలమైన నాయకుడి కోసం వైసీపీ వెతుకుతోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పీవీపీని పక్కన పెట్టారు. కానీ, పీవీపీ మాత్రం తనకే ఇవ్వాలని.. ఈసారి ఎలాగైనా గెలుస్తానని.. 100 నుంచి 200 కోట్లు పెట్టడానికి కూడా సిద్ధమని చెబుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినా సరే.. నీకు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అదేవిధంగా ఈ సారి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
దీంతో ఇక్కడ మేకపాటి కుటుంబాన్ని పక్కన పెట్టి.. అంతకన్నా బలమైన వ్యక్తిని పెట్టే ఆలోచన చేస్తున్నారట. ఇక టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా మార్పులు జరుగుతున్నాయి. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనను గన్నవరం పంపించి.. వల్లభనేని వంశీకి యాంటీగా నిలబెట్టాలని చూస్తున్నారు.కానీ, గద్దె మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ విధంగా ఇలాంటి మార్పులు ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను తెరమీదకి వస్తున్నాయి. కానీ, నాయకులు మాత్రం ఇష్టపడడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 25, 2022 10:33 pm
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…