Political News

నియోజ‌క‌వ‌ర్గాలు మారం.. తేల్చి చెప్పేస్తున్న ఎమ్మెల్యేలు

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో అనేక మార్పులు ఉంటాయ‌ని.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు స్ప‌ష్టం చేస్తున్నాయి. త‌మ త‌మ నేత‌ల‌ను ఇప్ప‌టి నుంచి మాన‌సికంగా రెడీ చేస్తున్నాయి. అయితే.. అన్నీ కాక‌పోయినా.. క‌నీసం 20 నుంచి 30 స్థానాల్లో మార్పులు త‌ప్ప‌వ‌నే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మారిపోవ‌డ‌మే!

దీంతో టీడీపీలోను, వైసీపీలోనూ.. యుద్ధ మేఘాలు ఆవ‌రించిన‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. అయితే.. ఈ మార్పును ఎక్కువ మంది నాయ‌కులు సానుకూలంగా తీసుకోవ‌డం లేదు. పార్టీ అధినేతల అభిప్రాయం ప్ర‌కారం.. ప్రజ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న నాయ‌కులు.. ప్ర‌త్య‌ర్థి పార్టీ బ‌ల‌మైన నాయ‌కుడిని నిల‌బెట్టిన స్థానాల్లోనూ మార్పులు చేయాల‌ని నిర్ణ‌యించేశారు. ఉదాహ‌ర‌ణ‌కు.. విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానంలో టీడీపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు టికెట్ ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

దీంతో అంత‌క‌న్నా బ‌ల‌మైన నాయ‌కుడి కోసం వైసీపీ వెతుకుతోంది. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన పీవీపీని ప‌క్క‌న పెట్టారు. కానీ, పీవీపీ మాత్రం త‌న‌కే ఇవ్వాల‌ని.. ఈసారి ఎలాగైనా గెలుస్తాన‌ని.. 100 నుంచి 200 కోట్లు పెట్ట‌డానికి కూడా సిద్ధ‌మ‌ని చెబుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయినా స‌రే.. నీకు ఇచ్చేది లేద‌ని తేల్చిచెప్పారు. అదేవిధంగా ఈ సారి నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది.

దీంతో ఇక్క‌డ మేక‌పాటి కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి.. అంత‌క‌న్నా బ‌ల‌మైన వ్య‌క్తిని పెట్టే ఆలోచ‌న చేస్తున్నారట‌. ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా మార్పులు జ‌రుగుతున్నాయి. విజ‌య‌వాడ తూర్పులో గ‌ద్దె రామ్మోహ‌న్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయ‌న‌ను గ‌న్న‌వ‌రం పంపించి.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి యాంటీగా నిల‌బెట్టాల‌ని చూస్తున్నారు.కానీ, గ‌ద్దె మాత్రం స‌సేమిరా అంటున్నారు. ఈ విధంగా ఇలాంటి మార్పులు ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. కానీ, నాయ‌కులు మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 25, 2022 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

13 minutes ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

1 hour ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

2 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

6 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago