టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మూడు రోజుల పాటు విజయనగరంలో విస్తృతంగా పర్యటించారు. సామాన్యుల నుంచి రైతుల వరకు కూడా ఆయన వారి గోడు విన్నారు. సమస్యలు పరిష్కరిస్తానని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టి.. తనకు అవకాశం ఇవ్వాలని ఆయన విన్నవించారు. కట్చేస్తే.. ఈ జిల్లాలో టీడీపీ పరిస్థితి మాత్రం యథాతథంగానే ఉండిపోయింది.
నాయకుల మధ్య సఖ్యత లేదు. అశోక్ గజపతి రాజు దూకుడు ఎక్కువగా ఉందని చాలా మంది నాయకులు పార్టీకి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా గతంలో వైసీపీ తరఫున గెలిచిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు.. టీడీపీలోకి వచ్చి మంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో అదే పార్టీతరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఇప్పుడు మాత్రం.. ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు.
చంద్రబాబు వచ్చారు కాబట్టి.. ఆయన కూడా వచ్చి.. ఏదో మమ అనిపించారు. ఇక, నెల్లిమర్ల, విజయనగరం, ఇతర నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మంత్రి బొత్స సత్యానారాయణ దూకుడుతో టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. చంద్రబాబు రాకతో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు అనుకున్నారు. కానీ, చంద్రబాబు వీటిపై దృష్టి పెట్టలేదు.
కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు.. ఆయన స్వోత్కర్షలకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో విజయనగరం వంటి కంచుకోటలో పరిస్థితి యథాతథంగానే ఉందని అంటున్నారు పరిశీలకలు. తమ్ముళ్లు కూడా చంద్రబాబు వచ్చారు వెళ్లారు! అని పెదవి విరుస్తున్నారు. మొత్తం పర్యటన అంతా కూడా అశోక్ చేతుల మీదుగానే జరగడం మరింతగా అగ్గి రాజేసింది. మరి ఇక్కడ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…