సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తరచుగా వార్తల్లోకి వస్తుంటారు. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు.. అంటూ.. ఆయన ప్రసంగిస్తూ ఉంటారు. తెలుగువారైన ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ 2019 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ప్రస్తుత సీఎం జగన్ కేసులను విచారించి.. పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్ అరెస్టుతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
ఈ క్రమంలో విశాఖ ఎంపీగా వివీ పోటీ చేయడంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ యన గెలుపు ఖాయమనే చర్చకూడా జరిగింది. పార్టీ తరఫున కాకుండా.. ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం.. తర్వాత కాలంలో పవన్ మాట తప్పారంటూ..(అంటే.. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సినిమాల్లోకి వెళ్లడంతో) ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఇక, అప్పటి నుంచి వైసీపీ వైపు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, ఏం జరిగిందో ఏమో.. ఆయన మౌనంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు తాను స్వతంత్రంగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే.. దీనిపై విశాఖ రాజకీయ వర్గాలు ఆసక్తికర చర్చతెరమీదకి తెస్తున్నాయి. వచ్చే ఎన్నికలు కీలకం కావడంతో ఆయనను వైసీపీ తెరచాటు నుంచి నడిపిస్తోందని అంటున్నారు.
ఓట్లు చీల్చడం ద్వారా వైసీపీకి మేలు జరిగేలా ఆయనను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపాలనేది వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా చేస్తున్న చర్చలేనని చాలా మంది చెబుతున్నారు. లేకపోతే.. ఆయన తిరిగి జనసేనలోక వచ్చినా.. టీడీపీలోకి వచ్చినా.. అదే సీటును కేటాయించేందుకు రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి. వీరిని కాదని.. స్వతంత్రంగా పోటీ చేయడం వెనుక వైసీపీ ఉందని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి.
This post was last modified on December 25, 2022 1:19 pm
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…