Political News

మాది స‌ర్ణ‌యుగం.. జ‌గ‌న్‌ది న‌ర‌క కూపం.. చంద్ర‌బాబు హాట్ కామెంట్స్‌

టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని, ప్ర‌స్తుత జ‌గ‌న్ హ‌యాం అన్న‌దాత‌ల‌కు న‌ర‌క కూప‌మ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం ఏపీ అని అన్నారు.

టీడీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేదని, ఇప్పుడు దానిని వైసీపీ నేత‌లు న‌ర‌క కూపంగా మార్చార‌ని చెప్పారు. రైతులు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకున్నా మన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతులను అన్ని విధాలా ఆదుకున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలను పంపించి కల్లాల వద్దే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

సింగిల్‌ విండో విధానం ద్వారా రైతులకు కావాల్సింది ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో నీటిపారుదలకు రూ.1,550 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రైతులపై వాలంటీర్లు పెత్తనం చేస్తారా? అని నిలదీశారు. ఆర్బీకేలను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కిందా? అని విమర్శించారు.

పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. టీడీపీ అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. పాత వ్యవస్థలను ఎప్పుడూ రద్దు చేయలేదని పేర్కొన్నారు. రైతుల పంటను మొబైల్‌ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామని తెలిపారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టింది టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

This post was last modified on December 24, 2022 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

2 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

2 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

3 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

4 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

4 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

5 hours ago