Political News

మాది స‌ర్ణ‌యుగం.. జ‌గ‌న్‌ది న‌ర‌క కూపం.. చంద్ర‌బాబు హాట్ కామెంట్స్‌

టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని, ప్ర‌స్తుత జ‌గ‌న్ హ‌యాం అన్న‌దాత‌ల‌కు న‌ర‌క కూప‌మ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం ఏపీ అని అన్నారు.

టీడీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేదని, ఇప్పుడు దానిని వైసీపీ నేత‌లు న‌ర‌క కూపంగా మార్చార‌ని చెప్పారు. రైతులు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకున్నా మన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతులను అన్ని విధాలా ఆదుకున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలను పంపించి కల్లాల వద్దే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

సింగిల్‌ విండో విధానం ద్వారా రైతులకు కావాల్సింది ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో నీటిపారుదలకు రూ.1,550 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రైతులపై వాలంటీర్లు పెత్తనం చేస్తారా? అని నిలదీశారు. ఆర్బీకేలను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కిందా? అని విమర్శించారు.

పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు. టీడీపీ అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేసినట్లు తెలిపారు. పాత వ్యవస్థలను ఎప్పుడూ రద్దు చేయలేదని పేర్కొన్నారు. రైతుల పంటను మొబైల్‌ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామని తెలిపారు. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టింది టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

This post was last modified on December 24, 2022 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

3 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

5 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

5 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

5 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

7 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

7 hours ago