Political News

ఔను.. చంద్ర‌బాబు క‌న్నా.. ఎక్కువ అప్పులు చేశాను: ఒప్పుకొన్న జ‌గ‌న్

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ అప్పుల విష‌యంలో నిమిషానికో మాట చెబుతూ వ‌చ్చిన ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం.. తాజాగా తాను అప్పులు ఎక్కువ చేస్తున్న మాట వాస్త‌వ‌మేన‌ని ఒప్పుకుంది. ఔను..చంద్ర‌బాబు హ‌యాంలో క‌న్నా.. ఇప్పుడు మేం ఎక్కువ‌గా నే అప్పులు చేస్తున్నాం అని సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ చెప్పేశారు. అయితే.. ఆయ‌న ఈ అప్పులు చేయ‌డాన్ని స‌మ‌ర్థించుకున్నారు.

ఇప్పటిలా అప్ప‌ట్లో సంక్షేమ పథకాలు లేవ‌ని.. అందుకే ఇప్పుడు అప్పులు పెరుగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. సీఎం సొంత నియోజక వర్గం పులివెందులలో.. ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పులివెందులలో కొత్త‌గా నిర్మించిన‌ ఆర్టీసీ బస్టాండ్ను ప్రారంభించారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. చెడిపోయిన వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

తాము చేసే ప్రతి పనిలో నెగెటివ్ కోణాలే చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నినాదం.. ‘వై నాట్‌ 175’ అని సీఎం జగన్‌ తెలిపారు. పులివెందుల ప్రజలు ఇచ్చిన భరోసాతోనే ముందుకెళ్తున్నామ న్నారు. “అందరూ ఆలోచించాలి. అప్పుడూ ఒకటే రాష్ట్రం ఒకటే బడ్జెట్.. మరి ఇప్పుడూ అదే రాష్ట్రం అదే బడ్జెట్. అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటిలా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. మనకు ఓటు వేయలేని వాళ్లకీ అర్హత ఉన్నవారికి కూడా మంచి జరిగేలా చూస్తున్నాం అని జ‌గ‌న్ చెప్పారు.

సీఎం మారడం వల్లే రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల తలరాతలు మారుతున్నాయని పేర్కొన్నారు. తమ పాలనలో ఎక్కడా లంచాలు లేవని తెలిపారు. పులివెందులలో రూ.125 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

2 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

2 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

3 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

4 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

4 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

5 hours ago