ఇప్పటి వరకు ఏపీ అప్పుల విషయంలో నిమిషానికో మాట చెబుతూ వచ్చిన ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. తాజాగా తాను అప్పులు ఎక్కువ చేస్తున్న మాట వాస్తవమేనని ఒప్పుకుంది. ఔను..చంద్రబాబు హయాంలో కన్నా.. ఇప్పుడు మేం ఎక్కువగా నే అప్పులు చేస్తున్నాం అని సాక్షాత్తూ సీఎం జగన్ చెప్పేశారు. అయితే.. ఆయన ఈ అప్పులు చేయడాన్ని సమర్థించుకున్నారు.
ఇప్పటిలా అప్పట్లో సంక్షేమ పథకాలు లేవని.. అందుకే ఇప్పుడు అప్పులు పెరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం సొంత నియోజక వర్గం పులివెందులలో.. ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పులివెందులలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. చెడిపోయిన వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
తాము చేసే ప్రతి పనిలో నెగెటివ్ కోణాలే చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నినాదం.. ‘వై నాట్ 175’ అని సీఎం జగన్ తెలిపారు. పులివెందుల ప్రజలు ఇచ్చిన భరోసాతోనే ముందుకెళ్తున్నామ న్నారు. “అందరూ ఆలోచించాలి. అప్పుడూ ఒకటే రాష్ట్రం ఒకటే బడ్జెట్.. మరి ఇప్పుడూ అదే రాష్ట్రం అదే బడ్జెట్. అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటిలా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. మనకు ఓటు వేయలేని వాళ్లకీ అర్హత ఉన్నవారికి కూడా మంచి జరిగేలా చూస్తున్నాం అని జగన్ చెప్పారు.
సీఎం మారడం వల్లే రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల తలరాతలు మారుతున్నాయని పేర్కొన్నారు. తమ పాలనలో ఎక్కడా లంచాలు లేవని తెలిపారు. పులివెందులలో రూ.125 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…