ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. సకాలంలో వేతనాలు అందని ప్రభుత్వోద్యోగులు మాట వినేందుకు నిరాకరిస్తున్నారు. విపక్షం రోజురోజుకు బలపడుతోంది. చంద్రబాబుకు జనం నీరాజనం పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం సీఎం జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కింది స్థాయి నుంచి ప్రతీ ఇంటిని ప్రతీ ఒక్కరినీ డేగకంటితో కనిపెడితే ఓట్లు రాబట్టడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చి ఆ దిశగా అడుగులు వేశారు. ప్రతీ ఒక్క ఓటు కీలకమేనన్న అభిప్రాయం వెల్లడైన తరుణంలో గృహ సారథుల నియామకం టీమ్ జగన్ మదిలో మెదిలింది…
2024 ఎన్నికల్లో విజయం కోసం జగన్ ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే లక్ష్యంగా ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందాయో లేదో తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిన మానస పుత్రికే గృహ సారథులని చెప్పాలి. నిజానికి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు వాలంటీర్ల వ్యవస్థను అమలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల 60 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. అయితే వాలంటీర్లు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఈసీ ఆదేశించింది. దానితో జగన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. ఇప్పుడు కొత్త స్కెచ్ తో గృహ వాలంటీర్ల వ్యవస్థను తెరపైకి తెచ్చారు
వై నాట్ 175.. అంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు గెలవకూడదన్న కాన్సెప్ట్ తో గృహ సారథుల నియామకాన్ని తెరపైకి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ తరపున 5.20 లక్షల మంది గృహసారథులను నియమించాలని ఆదేశించారు రాష్ట్రంలోని 15 వేల గ్రామాల్లో గృహసారథులు ఉంటారు. ప్రతీ సచివాలయ పరిథిలో ముగ్గురు కన్వీనర్లు, ప్రతీ యాభై ఇళ్లకు ఇద్దరు గృహ సారథులను నియమించాలని జగన్ ఆదేశించారు. ఈ నియమాలకే ఇప్పుడు పార్టీలో గొడవలకు కారణమవుతోంది.
కన్వీనర్ల నియామకంలో విభేదాలు తలెత్తాయి. ప్రతీ చోట ఎమ్మెల్యే వర్గం సూచించిన ఒక కన్వీనర్, ప్రత్యర్థి వర్గం సూచించిన మరో కన్వీనర్ నియామకానికి పేర్లు రెడీ అయ్యాయి. మూడో కన్వీనర్ నియామకం ఎవరి ద్వారా జరగాలన్న చర్చతో ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని చెబుతున్నారు. ఇక గృహ సారథిగా ఉండేందుకు చాలా చోట్ల జనం రావడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్లు అన్ని పనులు చూసుకుంటున్నారని, ఇంక తాము చేయగలిగిందేముందని ప్రశ్నిస్తున్నారట.
ఓటర్లకు డబ్బులు పంచేందుకు గృహ సారథులను వినియోగిస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఓటుకు పది నుంచి పదిహేను వేలు ముట్టజెపుతారని కూడా చెప్పుకున్నారు. దానితో ఎన్నికల్లో డబ్బులు మిగిల్చుకోవచ్చని కొందరు నిరుద్యోగులు గృహ సారథుల పనికి ఒప్పుకున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత వారంతా వెనక్కి తగ్గారు. పార్టీ నుంచి వచ్చే నిధులను ఎమ్మెల్యేల మనుషులు, ఇంచార్జ్ లు సర్పంచులు నొక్కేసి తమ చేతికి చాలా తక్కువ ఇస్తారని. అటు ఓటర్లు డబ్బులు అందలేదని నిలదీసే అవకాశం ఉందని గ్రహించి గృహసారథులుగా ఉండేందుకు జనం ముందుకు రావడం లేదు. మరి నియామకానికి జగన్ పెట్టిన గడువు క్రిస్మస్ తో ముగుస్తోంది.. ఏం చేయాలో..
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…