రాజకీయాల్లో నాయకులు ఏం చెప్పినా.. ఏం మాట్లాడినా.. చెల్లుతుందనే రోజులకు కాలం చెల్లింది. ఎందుకంటే.. ప్రజలకు అన్ని లెక్కలు ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. ప్రజలు ఇంకా కొన్ని జ్ఞాపకాలను మరిచిపోలేదు. గురివింద నీతులు చెబితే.. ఎవరూ ఊరుకోరు కూడా. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్.. కడప జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఏపీ వాడిననే ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించారు. ఖమ్మంలో ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సభ.. ఆయన డైలాగులకు జగన్ కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబుకు ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం ఉందని వ్యాఖ్యానించారు. తనకు మాత్రం ఏపీనే ఉందని.. ఇక్కడి ప్రజలతోనే అనుబంధం ఉందని, ఇక్కడి గాలే పీలుస్తున్నానని.. ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పుకొచ్చారు. తను ఇక్కడే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు. సరే.. జగన్ ఎందుకు చెప్పారంటే.. చంద్రబాబుపై ‘నాన్ లోకల్ ‘ ముద్ర వేసేందుకేనని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇక్కడ జగన్ చేసిన కామెంట్లపై నెటిజన్లు.. ముఖ్యంగా ఏపీకి చెందిన మేధావులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.
2019 ఎన్నికలకుముందు వరకు తమరు(జగన్) ఎక్కడున్నారు జగన్ సర్? అనేది ప్రధాన ప్రశ్న. 2014లో 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న తర్వాత.. కూడా జగన్ హైదరాబాద్లోని లోటస్ పాండ్కే పరిమితమయ్యారు. అంతెందుకు.. అసెంబ్లీకి వచ్చి వెళ్లేందుకు కూడా ఏపీ నుంచి హైదరాబాద్కు అయ్యే ఖర్చులను ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. ఆదివారాల్లో సెలవు రోజుల్లో కూడా ఆయన ఏపీలో ఉండకుండా.. అసెంబ్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి అయిన ఖర్చును ఏపీ ప్రజలే చెల్లించారని.. గుర్తు చేస్తున్నారు.
ఇవన్నీ మరిచిపోయి.. ఇప్పుడు ఈ మూడు ఏళ్ల కాలానికి.. తనకు తనే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం ఏం బాలేదని అంటున్నారు. ఇప్పటికే జగన్ లోటస్ పాండ్ బంగళా, ఆయన వ్యాపార సముదాయం.. సాక్షి పత్రిక హెడ్ క్వార్టర్ వంటివి ఏపీలో ఉన్నాయా? హైదరాబాద్లో ఉన్నాయా? అనేది కూడా నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న. ఒకవేలు ఇతరులపై చూపిస్తే.. నాలుగు వేళ్లు నీవైపు చూపిస్తున్నాయని జగనన్నా.. అంటున్నారు.
This post was last modified on December 23, 2022 9:54 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…