Political News

2019 వ‌ర‌కు ఎక్క‌డున్నారు జ‌గ‌న‌న్నా?

రాజ‌కీయాల్లో నాయ‌కులు ఏం చెప్పినా.. ఏం మాట్లాడినా.. చెల్లుతుంద‌నే రోజులకు కాలం చెల్లింది. ఎందుకంటే.. ప్ర‌జ‌ల‌కు అన్ని లెక్క‌లు ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. ప్ర‌జ‌లు ఇంకా కొన్ని జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోలేదు. గురివింద నీతులు చెబితే.. ఎవ‌రూ ఊరుకోరు కూడా. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. క‌డ‌ప జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. తాను ఏపీ వాడిన‌నే ముద్ర వేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఖ‌మ్మంలో ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌భ‌.. ఆయ‌న డైలాగుల‌కు జ‌గ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు.

చంద్ర‌బాబుకు ఈ రాష్ట్రం కాక‌పోతే మ‌రో రాష్ట్రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌కు మాత్రం ఏపీనే ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌తోనే అనుబంధం ఉంద‌ని, ఇక్క‌డి గాలే పీలుస్తున్నాన‌ని.. ఇక్క‌డే ఇల్లు కూడా క‌ట్టుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. త‌ను ఇక్క‌డే రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని అన్నారు. స‌రే.. జ‌గ‌న్ ఎందుకు చెప్పారంటే.. చంద్ర‌బాబుపై ‘నాన్ లోక‌ల్ ‘ ముద్ర వేసేందుకేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇక్క‌డ జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై నెటిజ‌న్లు.. ముఖ్యంగా ఏపీకి చెందిన మేధావులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల‌కుముందు వ‌ర‌కు త‌మ‌రు(జ‌గ‌న్) ఎక్క‌డున్నారు జ‌గ‌న్ స‌ర్‌? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. 2014లో 67 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్న త‌ర్వాత‌.. కూడా జ‌గ‌న్ హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అంతెందుకు.. అసెంబ్లీకి వ‌చ్చి వెళ్లేందుకు కూడా ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వం నుంచి తీసుకున్నారు. ఆదివారాల్లో సెల‌వు రోజుల్లో కూడా ఆయ‌న ఏపీలో ఉండ‌కుండా.. అసెంబ్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయ‌ని అంటున్నారు. దీనికి అయిన ఖ‌ర్చును ఏపీ ప్ర‌జ‌లే చెల్లించార‌ని.. గుర్తు చేస్తున్నారు.

ఇవ‌న్నీ మ‌రిచిపోయి.. ఇప్పుడు ఈ మూడు ఏళ్ల కాలానికి.. త‌న‌కు త‌నే స‌ర్టిఫికెట్ ఇచ్చుకోవ‌డం ఏం బాలేద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే జగ‌న్‌ లోట‌స్ పాండ్ బంగ‌ళా, ఆయ‌న వ్యాపార స‌ముదాయం.. సాక్షి ప‌త్రిక హెడ్ క్వార్ట‌ర్ వంటివి ఏపీలో ఉన్నాయా? హైద‌రాబాద్‌లో ఉన్నాయా? అనేది కూడా నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌. ఒక‌వేలు ఇత‌రుల‌పై చూపిస్తే.. నాలుగు వేళ్లు నీవైపు చూపిస్తున్నాయ‌ని జ‌గ‌న‌న్నా.. అంటున్నారు.

Satya

Recent Posts

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

22 minutes ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

25 minutes ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

2 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

2 hours ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

3 hours ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

4 hours ago