తారీకులు.. దస్తావేజులు.. నాకు గుర్తులేవని.. మహాకవి శ్రీశ్రీ అంతటి వారుచెప్పినా.. నాయకులు సైతం మరిచిపోయినా.. అదేంటో కానీ.. ప్రజలు మాత్రం “మాకు తారీకులూ గుర్తున్నాయి. దస్తావేజులూ గుర్తున్నాయి” అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ జాబులకు క్యాలెండర్ ఇచ్చి.. మరిచిపోకుండా ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ, మరిచిపోయారు.
సంక్షేమ పథకాలకు క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇచ్చారు. అమలు చేస్తున్నారు. వీటికి గాను అప్పులు కూడా చేస్తు్న్నారు. అయితే.. ఆయన మరిచిపోయింది.. ఆయన సొంత జిల్లా కడప ప్రజలు గుర్తు పెట్టుకున్నది ఒకటి ఉంది. అదే ‘డిసెంబరు 23’ ఇది ఏ మహానాయకుడి పుట్టినరోజో.. జయంతో.. వర్ధంతో కాదు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు అంతకన్నా కాదు. కానీ, కడప ప్రజలు మాత్రం మహా బాగా గుర్తు పెట్టుకున్నారు.
ఎందుకంటే.. ఇదే డిసెంబరు 23, 2019న ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన సొంత జిల్లా కడపలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఏడాది కాలంలో దీనిని పూర్తి చేసి జిల్లాలోని 3000 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని కూడా ఆయన ఘంటా పథంగా చెప్పుకొచ్చారు. దీంతో డిసెంబరు 23 వచ్చిన ప్రతిసారీ.. ప్రజలు సీఎం జగన్ మాటలను.. ఈ డేటులను గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయింది. మరొక్క ఏడాది గడిస్తే.. ఎన్నికలు రానే వచ్చేస్తాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈ ఏడాది డిసెంబరు 23న జగన్ యాదృచ్ఛికంగా.. అదే కడపలో పర్యటిస్తున్నారు. కడప దర్గా ఉత్సవాల్లో ఆయన పాల్గొంటున్నారు. దీంతోఇక్కడి ప్రజలు. జగనన్నా గుర్తుందా? అంటూ.. వాట్సాప్లో గుర్తు చేస్తున్నారు.
This post was last modified on December 23, 2022 2:49 pm
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…